breaking news
Food Safety and Standards Authority of India (FSSAI)
-
ఈ యాంటీబయాటిక్స్ తో జాగ్రత్త!
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో యాంటీమైక్రోబియల్ ఔషధాల వాడకంలో అపసవ్య ధోరణులను అరికట్టాల్సిన తరుణం ఇది. పాలు, మాంసం కోసం పశువులు, కోళ్ల పెంపకంలో.. రొయ్యలు, చేపల సాగులో లేదా ప్రాసెసింగ్ ప్రక్రియల్లో వాడేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. పాలు, మాంసం, గుడ్లు, తేనె ఉత్పత్తి క్రమంలో, ఆక్వా సాగులో, ప్రాసెసింగ్లో ఏ దశలోనూ 34 యాంటీబయాటిక్స్ను వాడొద్దని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాథికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) నిర్దేశిస్తోంది. యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు అనుగుణంగా మరో 15 యాంటీబయాటిక్స్ వాడకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిషేధించింది. ప్రజల శ్రేయస్సు, ఎగుమతులను పెంపొందించుకోవటంతో పాటు మన దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన సగానికిపైగా జనాభా జీవనోపాధులను సంరక్షించడంలోనూ యాంటీబయాటిక్స్ వాడకంపై సదవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఏయే యాంటీబయాటిక్ ఔషధాలపై దశలవారీగా నిషేధం విధించారో తెలుసా? చదవండి..సూక్ష్మక్రిములు సోకినప్పుడు చేసే వైద్య చికిత్సల్లో వాడే శక్తివంతమైన ఔషధాలే యాంటీబయాటిక్స్. ఇవి రెండు వైపులా పదును ఉన్న వజ్రాయుధాల్లాంటివి. వీటిని రూపొందించటం మానవాళి సాధించిన అద్భుతమైన విజయాలలో ఒకటి. సూక్ష్మక్రిములు సోకినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్ వంటి యాంటీమైక్రోబియల్ మందులు మనుషులకు, జంతువులకు మెరుగైన జీవన పరిస్థితులకు మార్గం సుగమం చేశాయి. యంటీమైక్రోబియల్ ఔషధాలు మనుషులు, జంతువులు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడానికి సహాయపడతాయి. అంటువ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి, చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, సూక్ష్మ పరాన్న జీవులు) నిరోధకతను సంతరించుకోవటంతో ఈ ప్రాణాలను రక్షించే అనేక మందులు వాటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.దీన్నే ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ లేక ఏఎంఆర్ అని పిలుస్తారు. మనుషులు, జంతువుల శ్రేయస్సుకు ‘యాంటీమైక్రోబియల్ నిరోధకత’ ముప్పు పెరుగుతోంది. ఈ ముప్పు మన కాలంలోని అతిపెద్ద ప్రపంచ ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జంతువులు, మానవ ఆరోగ్యానికి.. అలాగే ప్రపంచవ్యాప్తంగా జీవనోపాధికి, ఆహార భద్రతకు ఏఎంఆర్ ముప్పు పెరుగుతోంది.. అయితే, శుభవార్త ఏమిటంటే.. ఔషధ–నిరోధక సూక్ష్మక్రిముల ఆవిర్భావాన్ని అరికట్టడానికి పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ– పశువులను, కోళ్లను, రొయ్యలు, చేపలను పెంచే రైతులు, పశువైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, అన్ని దేశాల పౌరులు– ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఏఎంఆర్ను ఎదుర్కోవడానికి తమ స్థాయిలో పాటుపడటానికి అవకాశం ఉంది. మనుషులకు వాడేందుకు ప్రత్యేకించిన యాంటీబయాటిక్ ఔషధాలను ఇతరత్రా ఉపయోగాలకు అంటే పశుపోషణలో, ఆక్వా సాగులో ఉపయోగించరాదని అంతర్జాతీయ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఎంఆర్ ముప్పును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, రొయ్యలలో ఫలానా యాంటీమైక్రోబియల్/ యాంటీబయాటిక్ ఔషధాల అవశేషాలు ఉండకూడదు అని అనేక దేశాలు పట్టుబడుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని కంటెయినర్లను వెనక్కి తిప్పి పంపుతున్నాయి కూడా. భారతీయ ఆహారోత్పత్తుల దిగుమతిపై అమెరికా సరికొత్త అపరాధ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇతర దేశాల్లో కొత్త మార్కెట్లు వెతుక్కోవలసిన పరిస్థితి మన దేశానికి ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడొచ్చింది. ఈ నేపథ్యంలో మీ దేశం నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే మనుషుల కోసం రిజర్వు చేసిన 18 రకాల యాంటీబయాటిక్ ఔషధాలను జంతువులు, కోళ్లు, రొయ్యల సాగులో పెరుగుదల కోసం గానీ, చికిత్సల కోసం గానీ వాడకూడదన్నది యూరోపియన్ యూనియన్ పెట్టిన షరతు. దీంతో భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. కేంద్రీయ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు (డిటీఏబీ) 92వ సమావేశంలో మనుషుల చికిత్స కోసం యూరోపియన్ యూనియన్ రిజర్వు చేసిన 37 యాంటీమైక్రోబియల్ ఔషధాలపై చర్చించి, వీటిలో 34 యాంటీమైక్రోబియల్ ఔషధాలను నిషేధించింది. మన దేశంలో వీటి తయారీ, దిగుమతి, అమ్మకం, పంపిణీ, వినియోగాన్ని నిషేధిస్తూ డీటీఏబీ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు సూచించిన విధంగా మరో పదిహేను రకాలను యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇటీవలే భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో నిషేధించిన వాటితో కలుపుకుంటే ఇప్పటికి మొత్తంగా నిషేధానికి గురైన యాంటీమైక్రోబియల్ మందుల జాబితా (ఈ కథనంలోని పట్టికల్లో పేర్కొన్న విధంగా) చాలానే ఉంది. ఈ నిషిద్ధ మందుల జోలికి పోకుండా ఉంటేనే మన ఆహారోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చెయ్యగలుగుతాం.పశువులు, కోళ్లు, రొయ్యల సాగులో నిషిద్ధ యాంటీబయాటిక్స్ ఇవీ..భారత ఆహార భద్రత–ప్రమాణాల అథారిటీ– ఎఫ్ఎస్ఎస్ఏఐ (2024) నిషేధించినవి:ఏ రంగాలు?: మాంసం కోసం పశువుల పెంపకం, మాంసం ఉత్పత్తుల తయారీ, పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, కోళ్ల పెంపకం, ఆక్వా సాగు, ఆక్వా ఉత్పత్తుల తయారీ రంగంలో వాడకం నిషిద్ధం. యాంటీబయాటిక్స్– 3 తరగతులు: గ్లైకోపెప్టయిడ్స్, నైట్రోఫ్యూరాన్లు/ దాని మెటాబోలైట్లు, ఫ్యూరజోలిడోన్ (ఎవోజడ్), నైట్రోఫ్యూరాజోన్ (ఎస్ఇఎం), ఫ్యూరల్టాడోన్ (ఎఎంఓజడ్), నైట్రోఫ్యూరాంటోయిన్ (ఎహెచ్డీ), నైట్రోమిడాజోల్స్.. వీటితో సహా– (ఎ) డైమెట్రిడాజోల్, (బి) రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 2– హైడ్రాక్సీమీథైల్–1, –మిథైల్–3, నైట్రోమిడాజోల్(సి), ఇప్రోనిడాజోల్, దాని మెటాబోలైట్, హైడ్రాక్సీప్రోనిడాజోల్ (డి), మిట్రోనిడాజోల్, దాని మెటాబోలైట్ 3, హైడ్రాక్సీమెట్రోనిడాజోల్.యాంటీబయాటిక్స్– 5 రకాలు: కార్బడాక్స్, క్లోరంఫెనికాల్, కోలిస్టిన్ స్ట్రెప్టోమైసిన్ (దీని మెటబొలైట్ డిహైడ్రోస్ట్రెప్టోమైసిన్ సహా), సల్ఫామెథోగ్సాజోల్.కేంద్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిషేధించినవి (2019, 2025): ఏ రంగాలు?: పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఆహారం కోసం పెంచే ఇతర పక్షుల పెంపకంలో వాడకం నిషిద్ధం. యాంటీబయాటిక్స్– 9 తరగతులు: యూరిడోపెనిసిలిన్స్, సైడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్సైక్లిన్స్. యాంటీబయాటిక్స్– 9 రకాలు: తొమ్మిది యాంటీబయాటిక్స్ వాడకంపై 2019 నుంచి నిషేధం ఉంది. ఆహారం కోసం పెంచే జంతువుల పెంపకంలో, కోళ్ల పెంపకంలో, ఆక్వా సాగులో, పశుగ్రాస సప్లిమెంట్లలో వాడటం నిషిద్ధం. కొలిస్టిన్ వాడటంపై 2025 మార్చి నుంచి నిషేధం ఉంది. ఆహార ఉత్పత్తి కోసం పెంచే ఏ జంతువుల పెంపకంలోనూ దీన్ని వాడకూడదు. సెఫ్టోబిప్రోల్, సెఫ్టరోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరావాసైక్లిన్, ఓమాడాసైక్లిన్, నైట్రోఫ్యూరాన్, క్లోరాంఫెనికాల్లను జంతువుల పెంపకంలో వాడకంపై 2025 మే నుంచి నిషేధం ఉంది.కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నిషేధించినవి (2024): ఏ రంగం?: తీరప్రాంత ఆక్వా సాగులో నిషిద్ధం.యాంటీబయాటిక్స్– 5 తరగతులు: నైట్రోఫ్యూరాన్లు.. వీటితో సహా : ఫ్యూరాల్టాడోన్, ఫ్యూరాజోలిడోన్, ఫ్యూరిల్ఫ్యూరమైడ్, నిఫుర్ప్రజైన్, నైట్రోఫ్యూరాంటోయిన్, నైట్రోఫ్యూరాజోన్, డైమెట్రిడాజోల్, మెట్రోనిడాజోల్, రోనిడాజోల్, ఇప్రోనిడాజోల్ తదితర నైట్రోమిడాజోల్స్. సల్ఫోనామైడ్ మందులు (ఆమోదించబడిన సల్ఫాడిమెథాక్సిన్, సల్ఫాబ్రోమోమెథాజిన్, సల్ఫేథాక్సిపైరిడాజిన్ తప్ప), ఫ్లూరోక్వినోలోన్స్, గ్లైకోపెప్టయిడ్స్.యాంటీబయాటిక్స్– 5 రకాలు: క్లోరాంఫెనికాల్, నియోమైసిన్, నలిడిక్సిక్ ఆసిడ్, సల్ఫామెథోక్సాజోల్, డాప్సోన్.వాణిజ్య శాఖ నిషేధించినవి (2025): రంగం: రొయ్యల సాగులో నిషిద్ధం.యాంటీబయాటిక్స్–12 తరగతులు: కార్బోజైపెనిసిల్లిన్స్, యురీడోపెనిసిల్లిన్స్, సెఫలోస్పోరిన్స్ కాంబినేషన్లు బీటాతో– లాక్టామసె ఇన్హిబిటర్స్, సెడెరోఫోర్, సెఫలోస్పోరిన్స్, కార్బపెనెమ్స్, పెనెమ్స్, మోనోబాక్టమ్స్, గ్లైకోపెప్టయిడ్స్, లిపోపెప్టయిడ్స్, ఆక్సాజోలిడినోన్స్, గ్లైసిల్సైక్లిన్స్, ఫాస్ఫోనిక్ ఆసిడ్ డెరివేటివ్లు. యాంటీబయాటిక్స్– 6 రకాలు: సెఫ్టోబిప్రోల్, సెఫ్టారోలిన్, ఫిడాక్సోమైసిన్, ప్లాజోమైసిన్, ఎరవాసైక్లిన్, ఒమడాసైక్లిన్. -
ఆహార భద్రత సూచిక 2024: మరోసారి అగ్రస్థానంలో ఆ రాష్ట్రం!
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆహార భద్రతను మెరుగుపరచడం అత్యవసరం. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నందున ఇది మరింత ముఖ్యం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (SFSI) 2024 ర్యాంకింగ్లో మరోసారి కేరళ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ సూచీలో వరుసగా రెండోసారి తొలిస్థానం దక్కించుకుంది. గతేడాది రెండోస్థానంలో ఉన్న తమిళనాడు ఈసారి మొదటి స్థానానికి ఎగబాకింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, నాగాలాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకుర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఫేస్బుక్ పోస్ట్లో.. "కేరళ జాతీయ స్థాయిలో ఆహార భద్రతలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆహార భద్రతా సూచికలో జాతీయ స్థాయిలో కేరళ వరుసగా రెండవ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో గతేడాది కూడా మొదటి స్థానంలోనే నిలిచింది కేరళ. ఈ విషయంలో ప్రాసిక్యూషన్ కేసులు, గుర్తింపు పొందిన ల్యాబ్ల సంఖ్య, ల్యాబ్లలో అత్యుత్తమ పరీక్ష, మొబైల్ ల్యాబ్ల పనితీరు, శిక్షణ , అవగాహన కార్యకలాపాలు మొదలైనవి కేరళను అగ్రస్థానంలో నిలిపాయి. అలాగే కేరళ ఈ విజయాన్ని దక్కించుకోవడంలో కృషి చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ అభినందనలు. అని పోస్ట్లో పేర్కొన్నారు వీణా జార్జ్. ఈ ఆహార భద్రతా సూచీ అనేది రాష్ట్రాల ఐదు కీలక పారామితులపై అంచనా వేస్తుంది. మానవ వనరులు, సంస్థాగత డేటా, సమ్మతి, ఆహార పరీక్ష-మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత. ఆహార సంబంధిత వ్యాధులు, న్యూట్రాస్యూటికల్ భద్రత, ఆహారంలో ప్లాస్టిక్ల వల్ల ఎదురవుతున్న సవాళ్లను దృష్ట్యా..నేటి ప్రపంచంలో ఫుడ్ రెగ్యులేటర్ల ప్రాముఖ్యత పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నొక్కి చెప్పారు. అంతేగాదు ఫుడ్ సేఫ్టీ విషయంలో నిరంతర సహకారం, ఆవిష్కరణలు, మెరుగుదల తదితరాల ఆవశ్యకత గురించి హైలెట్ చేశారు.(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!) -
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?
మాములుగా అందరం ఆరోగ్యం కోసం పళ్లను తినడం జరుగుతుంది. అయితే చాలా పండ్లలో కొన్నింటికి మాత్రం వాటిపై స్టిక్కర్లు అంటించి ఉంటాయి. ఎందుకిలా స్టిక్కర్లు అంటిస్తారనేది చాలామందికి తెలియదు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు ఇలా స్టిక్కర్లు ఉంటాయోమో అనుకుంటాం . మరికొందరూ అలా స్టిక్కర్లు ఉన్న పళ్లే మంచివని కూడా అనుకుంటారు. అసలు ఇంతకీ ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అంటిస్తారు?. దానికేమైన అర్థం ఉందా? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!. పండ్లపై ఉండే స్టిక్కర్ల గురించి ఇటీవలేఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు, వాటి అర్థం ఏంటో సవివరంగా వెల్లడించింది. ఇక ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం..నాణ్యత, ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి. ఫ్రూట్స్కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9తో మొదలైతే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం. అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని తెలుస్తోంది. ఒకవేళ నాలుగు నంబర్లు ఉడి అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్తో పండించారని, ఇన్ఆర్గానిక్ అని భావించవచ్చు. అలాగే స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని అర్థం. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి. (చదవండి: చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!) -
FSSAI: న్యూస్ పేపర్లో ఆహారం ప్యాక్ చేయొద్దు
న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్ పేపర్) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్ను ఆహార పదార్థాల ప్యాకింగ్కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్ పేపర్ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రింటింగ్కు వాడే ఇంక్లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. -
‘దహీ’పై వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
చెన్నై/బెంగళూరు: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లిష్ ‘కర్డ్’కు బదులుగా హిందీలోని ‘దహీ’ముద్రించాలన్న ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కి తగ్గింది. కర్డ్ను కొనసాగిస్తూనే పక్కనే సమానార్థం.. తెలుగులో అయితే పెరుగు, కన్నడలో మొసరు, తమిళమైతే తాయిర్ అని ప్రాంతీయ భాషను ముద్రించవచ్చని స్పష్టతనిస్తూ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్కు బదులుగా హిందీ సమానార్ధం ‘దహీ’ని ముద్రించాలంటూ ఈ నెల 10వ తేదీన ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తమిళనాడు కో ఆపరేటివ్ మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ ‘ఆవిన్’బ్రాండ్తో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) నంది బ్రాండ్తో పెరుగును విక్రయిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎప్పటిలాగానే తమిళ ‘తాయిర్’నే వాడుతామని, ‘దహీ’అని మాత్రం వాడబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐకి సమాధానమిచ్చింది. అధికార డీఎంకే పార్టీ ‘నహీ టు దహీ’అంటూ ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘దహీ’వివాదంపై తమిళనాడు బీజేపీ విభాగం అభ్యంతరం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్తో తీసుకువస్తున్న పెరుగు ప్యాకెట్లపై హిందీ దహీ పక్కన బ్రాకెట్లలో కన్నడ (మొసరు) ముద్రించాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన మార్గదర్శకాలపై రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ఈ చర్య కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనన్నారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. -
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
ప్రతి స్వీట్కు ఓ తేదీ!
సాక్షి, గుంటూరు: స్వీట్స్ ఇష్టపడని వారెవరుంటారు. కలాకండ్, గులాబ్ జామూన్, లడ్డూ, జిలేబి ఇలా ఎన్నో రకాల స్వీట్లు చూడగానే నోరూరకమానదు. కానీ, మనం కొనే స్వీట్స్ ప్రతిసారి బాగుంటాయని చెప్పలేం. ఎందుకంటే వాటిపై ఎక్స్పైరీ తేదీ ఉండదు. ఈ క్రమంలోనే ప్రజలు ఒక్కో సారి కాలపరిమితి దాటిన స్వీట్లను కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు. అందుకనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా ప్రతి స్వీట్పై తయారీ, ఎక్స్పైరీ తేదీ ముద్రించాలని నిబంధన విధించింది. ►జిల్లాలో 400 మంది ఫుడ్సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని స్వీట్స్ విక్రయాలు సాగిస్తుండగా మరో 1200 మంది వరకు తోపుడు బండ్లపై అనధికారికంగా అమ్మకాలు చేస్తున్నారు. ►అయితే కొత్త నిబంధనల ప్రకారం స్వీట్లు విక్రయించే ప్రతి ఒక్కరూ ఫుడ్ ఇన్స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. ఏఏ స్వీట్లు.. ఎన్ని రోజుల్లో తినాలి ►కలాకండ్, బట్టర్ స్కాచ్, చాక్లెట్ కలాకండ్ తదితర స్వీట్లు తయారు చేసిన రోజునే తినేయాలి. ►పాల పదార్థాలు, బెంగాలీ స్వీట్స్ , బాదం మిల్క్, రసగుల్ల, రసమలై వంటి స్వీట్లను రెండు రోజుల్లో వినియోగించాలి. ►లడ్డు, కోవాస్వీట్స్, మిల్క్ కేక్, బూందీలడ్డు, కోకోనట్ బర్ఫీ, కోవా బాదం వంటివి తయారు చేసిన నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ►నేతితో చేసిన స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ హాల్వా, డ్రైఫ్రూట్ లడ్డు, అంజీర కేక్, కాజు లడ్డూ వంటి వాటిని వారంలో తినాలి. ►బసెస్ లడ్డూ, అటా లడ్డూ, చనా లడ్డూ, చనా బర్ఫీ, చిక్కీలు తయారు చేసిన 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. రూ.రెండు లక్షల వరకు జరిమానా స్వీట్లు విక్రయించే వ్యాపారులు కచ్చితంగా వాటిపై తయారీ, గడువు తేదీలను ముద్రించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తాం. నాణ్యత లేకుండా, తేదీలు ముద్రించకుండా స్వీట్లు విక్రయిస్తున్న వారి సమాచారాన్ని 98484 70969 నంబర్కు తెలియజేయాలి. – షేక్ గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, గుంటూరు -
స్కూళ్లలో ఇక పిజ్జా, బర్గర్లు బంద్!
న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మడం, అందుబాటులో ఉంచడం నియంత్రిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ముసాయిదా మార్గదర్శకాలను జారీచేసింది. పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలోనూ అత్యధిక కొవ్వు, సాల్ట్, షుగర్ విలువలున్న ఆహార పదార్థాలు అమ్మకుండా నియంత్రించాలని ఆదేశించింది. చిప్స్, రెడీ టు ఇట్ న్యూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, షూగర్ స్వీటెన్డ్ కార్బొనేటెడ్లు, శీతల పానీయాలు, నాన్- కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆలూ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలు స్కూల్ ప్రాంగణాల్లో అమ్మకుడదని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాల ప్రాంగణాల్లో క్యాంటీన్ పాలసీని, స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ను ఏర్పాటుచేసి.. అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల తలెత్తే దుష్ర్పరిణామాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఎస్ఎస్ఐ సూచించింది.