బడ్జెట్ రికార్డులు
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి ఆర్కే షణ్ముగంశెట్టి. 1947-49 మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆయన నెహ్రూతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగారు.
1951-52లో రిజర్వు బ్యాంకు గవర్నర్ సీడీ దేశ్ముఖ్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ప్రధానమంత్రిగా కొనసాగుతూ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 1958-59లో ఆర్థికశాఖను కూడా పర్యవేక్షించిన ఆయన ఈ రికార్డు సాధించారు. ఆ తర్వాత ఇదే బాటలో ఇందిరాగాంధీ 1970లో, రాజీవ్ 1987లో ప్రధానులుగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1974-75లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 1982-84 మధ్య, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
1991-92లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఏడాది తుది, తాత్కాలిక బడ్జెట్లను రెండు పార్టీలకు చెందిన, వేర్వేరు ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టడం గమనార్హం. తాత్కాలిక బడ్జెట్ను బీజేపీ నేత యశ్వంత్సిన్హా, తుది బడ్జెట్ను మన్మోహన్సింగ్ ప్రవేశపెట్టారు.
అతి తక్కువకాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు బీజేపీ నేత జశ్వంత్సింగ్ పేరిట ఉంది. ఆయన కేవలం 13 రోజుల పాటే కొనసాగారు.
పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ కూడా లీకయింది. కానీ అది 1950లో. అప్పట్లో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతిభవన్లో ముద్రించేవారు. ఆ తర్వాత మింటో రోడ్లోకి మార్చారు.
మోరార్జీ దేశాయ్ అత్యధికంగా పది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత సంపాదించుకున్నారు.
దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా ఇందిరా గాంధీ రికార్డు సృష్టించారు.