breaking news
Fake idols selling
-
11వ శతాబ్దం నాటి విగ్రహం చోరీ
చంద్రగిరి (తిరుపతి జిల్లా): రాయల కాలం నాటి పురాతన విగ్రహాన్ని రాత్రికి రాత్రి చోరీ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థానంలో నకిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్కియాలజీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి రాయలవారి కోట ప్రాంగణంలో క్రీ.శ.11వ శతాబ్ధానికి చెందిన రాతి గోడలో అప్పటి రాజులు వినాయక స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఇటీవల ఆ విగ్రహంపై కన్నెసిన గుర్తు తెలియని కేటుగాళ్లు చోరీ చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అదే ప్రదేశంలో నకిలీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన విగ్రహం లోపల భాగంలో నిధులుంటాయని, వాటిని సొంతం చేసుకోవడానికే విగ్రహాన్ని చోరీ చేసి ఉంటారని ప్రచారం చక్కర్లు కొడుతోంది. -
నకిలీ విగ్రహాలను విక్రయించే ముఠా అరెస్ట్
చిత్తూరు (పెద్దతిప్పసముద్రం) : ఇనుప విగ్రహాలకు బంగారు పూత పూసి బంగారు విగ్రహాలని విక్రయిస్తూ పలువురిని మోసగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పెద్దతిప్పసముద్రంలో పోలీసులు సోమవారం అరెస్ట్చేశారు. వీరి నుంచి 8 నకిలీ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.