breaking news
export to abroad
-
విదేశీయులకు ప్రియమైన బంగినపల్లి
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి విదేశీయులకు సైతం నోరూరిస్తోంది. ఈ ఏడాది కూడా ఉలవపాడు బంగినపల్లె రకం మామిడి అమెరికా, యూకెలకు ఎగుమతులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడులోని బీ ష్యూర్ అగ్రి ఎక్స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ రెండు ప్రాంతాలకు ఎగుమతులు చేశారు. నాణ్యతలో ఎంపిక జరిగి వారి క్వాలిటీ కి అనుగుణంగా ఉన్న కాయలను మాత్రమే ఎగుమతులు చేశారు. బెంగళూరు లోని క్వాలిటీ తనిఖీ కేంద్రం నుంచి ఈ కాయలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఉలవపాడు ప్రాంతం నుంచి ప్రధానంగా బంగినపల్లె, రసాలు రకాలు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది సుమారు 10 టన్నుల పైనే ఎగుమతి అయ్యాయి. బంగినపల్లె రకం కవర్ కట్టిన కాయలు కేజీ రూ.140, కవర్ కట్టని కాయలు కేజీ రూ.100 చొప్పున నాణ్యత ఉన్న కాయలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి క్వాలిటీ టెస్ట్ చేసి ఎగుమతులు చేశారు. – ఉలవపాడునాణ్యతే కీలకంవిదేశాలకు ఎగుమతులలో నాణ్యతే ప్రధానం. కాయలను ముందుగా కోసిన తరువాత వాటిలో తేమ ఇంకే వరకు కాయలను తిరగబెట్టి ఉంచాలి. తరువాత మచ్చలేకుండా ఉన్న కాయలను ఎంచుకోవాలి. తియ్యదనం కూడా కాస్త తక్కువగా ఉండాలి. విదేశాలలో తినే కాయలకు కాస్త తీపి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కవర్ కట్టిన కాయలలో వడగాలి, ఎండ తగలదు కాబట్టి తీపి శాతం తక్కువగానే ఉంటుంది. కానీ కవర్ కట్టని కాయలనే విదేశాలలో ఉన్న భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా గ్రేడింగ్ అయిన కాయలను బెంగళూరులోని క్వాలిటీ కంట్రోల్ లో తనిఖీ చేస్తారు. నాణ్యమైన రకంగా గుర్తించిన కాయలను విమానాలలో విదేశాలకు ఎగుమతులు చేస్తారు.విదేశాలలో ఈ కాయలను హన్స్లెట్ లోని జీఓకారో లిమిటెడ్ వారు దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. 3 కేజీలు, 4 కేజీల బాక్స్లలో వీటిని ఎగుమతి చేస్తారు. ఒక్కో బాక్స్లో షుమారు 7 నుంచి 9 కాయలు పట్టేలా ప్యాకింగ్ చేస్తారు. ఇక్కడ షుమారు ఈ బాక్స్ విలువ రూ.450 నుంచి రూ.550 వరకు ఉంటుంది. ఈ కాయలు అమెరికాలో 57 డాలర్లకు అమ్ముతారు.అంటే షుమారు రూ.4500 పడుతుంది. 9 కాయలను రూ.4500 కు అమ్ముతారు. అంటే ఒక్కో కాయ రూ.500 చొప్పున విదేశాలలో అమ్ముడవుతుంది. యూకేలో షుమారు 21 పౌండ్ల వరకు రేటు పలుకుతుంది. ఉలవపాడు బంగినపల్లె రకం మామిడి కాయ విదేశాలలో రేటు చూసి గర్వపడాల్సిందే.నాణ్యత గల కాయలు ఎగుమతులు చేస్తున్నాం మా కంపెనీ ద్వారా విదేశాలకు మామిడి కాయలు ఎగుమతులు చేస్తున్నాం. రైతులు నాణ్యత గల కాయలు ఉంటే వాటిని బెంగళూరులో క్వాలిటీ చూసి పంపిస్తాం. ఈ ఏడాది అమెరికా, యూకేకు పంపించాం. కాయలు అద్భుతంగా ఉన్నాయని కొనుగోలు చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. – వై.బాలచందర్, బీష్యూర్ అగ్రి ఎక్స్పోర్ట్స్, ఉలవపాడు -
కుగ్రామం నుంచి అమెరికాకు
ఇక్కడ తయారయ్యే అప్పడాలు, చక్కిలాలు, పేణి, సొండిగలు రుచికి పేరుపొందాయి. సబ్బియ్యము, జిలకర, పుదీన, పాలాకు, కరివేపాకు,కొత్తిమీర, మెంతాకు, టమోటోలను కలిపి చేసే అప్పడాలు చూడగానే నోరూరిస్తాయి. ఇక విడిగాను, భోజనాల్లోను నంజుకుని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు. గౌరిబిదనూరు: గౌరిబిదనూరు సమీపంలోని కల్లూడి గ్రామం రుచికరమైన అప్పడాల తయారీకి ప్రసిద్ధి పొందింది. ఇక్కడి మహిళలు తయారుచేసే అప్పడాలు ఇతర రాష్ట్రాలకు, తాజాగా విదేశాలకూ ఎగుమతి అవుతూ పల్లెవాసుల కీర్తిని చాటుతున్నాయి. ఆ ఊళ్లో ఏ ఇంటి ముంగిట, మిద్దెల మీద చూసినా అప్పడాలు ఆరవేసిన దృశ్యాలే కనిపిస్తాయి. సుమారు 2 వేలమంది జనాభా, 720 కుటుంబాలు నివసిస్తున్న ఈ చిన్న గ్రామంలో 80 శాతం మంది వృత్తి అప్పడాల తయారీనే. ఈ గ్రామంలో 5 పిండిమరలు ఉన్నాయి. ప్రతి మిల్లూ రోజూ 4 క్వింటాళ్ళ బియ్యాన్ని పిండి ఆడిస్తుంది. ఇలా ఒక కుగ్రామంలో పుట్టిన ఆర్థిక విప్లవంగా ఈ గ్రామాన్ని సందర్శించిన అభ్యుదయవాదులు పేర్కొన్నారు. గ్రామంలో మహిళలు సూర్యోదయం నుంచే అప్పడాల తయారీ ఆరంభిస్తారు. సిరిధాన్యాలు, ఆకుకూరలను కలిపి అనేక రకాల ఫ్లేవర్లలో 18 రకాల అప్పడాలు చేయడంలో వీరు దిట్టలు. పురుషులు వాటిని నగరాలు, పట్టణాల్లో విక్రయించుకుని వస్తారు. ఒక్కో మహిళకు రోజుకు రూ.200 వరకు లాభం మిగులుతుంది. విదేశాల్లోనూ డిమాండు అప్పడాల పేరు క్రమంగా రాష్ట్రం దాటి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. అక్కడి నుంచి వ్యాపారులు, దళారులు వచ్చి పెద్ద మొత్తంలో కొనుక్కువెళ్తున్నారు. బెంగళూరు తదితర నగరాల నుంచి విదేశాలకు వెళ్లే వారు కల్లూడి అప్పడాలను వెంట తీసుకెళ్లడం ఆరంభమైంది. తమ కోసమే కాకుండా అక్కడ ఉండే బంధుమిత్రుల కోసం కూడా ఆర్డర్లపై చేయించుకుని తీసుకెళ్తుంటారని గ్రామ మహిళలు చెప్పారు. ఒక్కసారి కొనుక్కువెళ్లినవారు మళ్లీ మళ్లీ కావాలని ఫోన్లు చేసి కొరియర్ ద్వారానో, లేదా తమ బంధుమిత్రుల ద్వారానో తెప్పించుకుంటా రు. అమెరికా, గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లేవా రు ఎక్కువగా అప్పడాలకు ఆర్డర్లు ఇస్తూ ఉంటా రు. దీంతో గ్రామ మహిళల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. నాణ్యత, రుచి పునాదులగా తయారయ్యే అప్పడాలకు ఎంత చెల్లించినా తక్కువే అంటారు కొనుగోలుదారులు. -
విదేశాలకు పులివెందుల అరటి
పులివెందుల రూరల్ : పులివెందుల నుంచి అరటి కాయలు విదేశాలకు ఎగుమతి చేసేందుకుసన్నాహాలు చేస్తున్నామని జార్ఖండ్ ఐఏఎస్ అధికారి (డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్) కె.రవికుమార్ అన్నారు. శనివారం ఎంపీడీవో సభా భవనంలో నియోజకవర్గంలోని అరటి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో పండే అరటి ఎక్కువ రోజుల నిల్వ ఉండటంతోపాటు నాణ్యత కలిగి ఉన్నాయని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ సూచనల మేరకు పరిశీలనకు వచ్చామని చెప్పారు. అరటి కాయలు ఏడాది పొడవునా ఉత్పత్తి, స్థానికంగా ఉన్న మార్కెట్ ధరలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ ట్రేడర్స్ రామలింగం, జిల్లా ఉద్యానవన శాఖ ఏడీ వెంకటేశ్వర్, ఆడిటర్ రవికుమార్, పులివెందుల హెచ్వో రాఘవేందారరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.