-
అమ్మా.. నీకెంత కష్టం!
భూమిమీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఓసారి ఏదో రకంగా మరణించాల్సిందే. అలా చనిపోయినపుడు పుట్టింటివారో..మెట్టినింటివారో వచ్చి అంత్యక్రియలు చేస్తారు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పదిరోజులుగా చికిత్సపొందుతూ కోలుకోలేక గురువారం తుదిశ్వాస విడిచింది ఓ మహిళ. ఈమెను ఖననం చేసేందుకు ఎవరూ రాకపోవడంతో పోలీసులు మున్సిపల్ సిబ్బందితో ఈ తతంగం కానిచ్చేశారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన 50ఏళ్ల మహిళ 10రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్తమా ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రిలోని వెంటిలెటర్లో చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించి మృతి చెందింది. అప్పటివరకు ఆమె వెంట 14ఏళ్ల బాబు ఉన్నాడు. మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న జనరల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ మృతదేహాన్ని పోస్టుమార్టం విభాగంలో భద్రపరిచాడు. ఈ విషయాన్ని ఆయన నారాయణపేట వైద్యులకు సమాచారం ఇచ్చాడు. వారు మృతురాలు నివాసం ఉంటున్న ఏరియాకు వెళ్లి బంధువులకు విషయం చెప్పారు. ఆమె నాలుగురోజుల కిందటే మృతి చెందితే మహబూబ్నగర్లో అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చామని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు పాలమూరు ఆస్పత్రి సూపరిటెండెంట్కు చెప్పారు. మృతదేహం ఇక్కడే ఉందని నారాయణపేట జిల్లా పోలీసులకు విషయం చెప్పారు. మృతురాలికి కరోనా ఉందని మృతదేహాం తీసుకుపోవడానికి మేం రాలేమని సమాధానం తెలిపారు. చేసేది ఏమి లేక మృతురాలి కొడుకును వెంట తీసుకుని మున్సిపాలిటీ సిబ్బందితో మహబూబ్నగర్లోని ఓ ఏరియాలో ఖననం చేశారు. మృతురాలికి భర్త లేకపోవడంతో 14ఏళ్ల బాబు ఉండటం పరిస్థితి దయనీయంగా మారింది. మృతి చెందిన తర్వాత కూడా మృతదేహాన్ని చూడటానికి ఒక్కరూ కూడా రాకపోవడం విశేషం. 14ఏళ్ల ఆ బాబుకు కరోనా లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరో బాధకర విషయం ఏమిటంటే 20రోజుల కిందట నారాయణపేటలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని కరోనా లక్షణాలు ఉన్నాయని ఇళ్లు ఖాళీ చేయించాడు. ఆ తర్వాత ఆమె కొడుకుని తీసుకుని వచ్చి జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది. చదవండి: మానవత్వం చాటిన ఎస్ఐ ధరణిబాబు -
10వేల స్థాయి వద్ద నిఫ్టీకి గట్టిమద్దతు
ప్రధాన బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీకి 10000స్థాయి వద్ద కీలక మద్దతు స్థాయి నెలకొని ఉందని భారత ఈక్విటీ ఆప్షన్ ట్రేడర్లు విశ్వసిస్తున్నారు. ఎన్ఎస్ఈ గణాంకాల పరిశీలిస్తే.., నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్ కాంట్రాక్ట్ల్లో కెల్లా అత్యధిక ఓపెన్ ఇంటెస్ట్ర్ 10వేల స్ట్రైక్ ప్రైస్ పుట్ కాంట్రాక్టుల వద్ద ఉంది. దీని ప్రకారం గురువారం వరకు నిఫ్టీ 10వేల స్థాయిని పరిరక్షించుకోగలదని వారు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్ మార్చి నెల తరువాత తొలిసారి ఈ జూన్ 10000 స్థాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుపుచ్చుకున్న దేశీయ ఈక్విటీ సూచీలు... ఈ మార్చి కనిష్ట స్థాయిల నుంచి 35శాతానికి మించి రికవరీ అయ్యాయి. మరోవైపు ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తొలిసారి 40ఏళ్ల కనిష్టాలను చవిచూసింది. నిఫ్టీ ఇండెక్స్ బేస్ 9,700 నుండి 10,000 కు పెరిగింది. సాంకేతికంగానూ బలంగా ఉంది. రాబోయే వారంలో 10,600-10,800 శ్రేణిని పరీక్షించడానికి ఇటీవలి గరిష్ట స్థాయి 10,350-10,400 పరిధిని అధిగమించాల్సి ఉంటుంది.’’ అని ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ విశ్లేషకుడు సమీత్ చవాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారంలో గురువారం డెరివేటివ్ కాంట్రాక్టు ఎక్స్పైరీ తేది ఉండటం, కొన్ని దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ వ్యాధి వ్యాప్తి మొదలు కావడం, అమెరికా-చైనాల మధ్య మరోసారి వాణిజ్య ఉద్రిక్తతలు తెరపైకి రావడం తదితర ప్రతికూల అంశాల దృష్టా్య ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మరికొందరు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. -
క్రమ‘బద్ధకం’!
♦ క్రమబద్ధీకరణపై నీలి నీడలు ♦ గడువు మూడు రోజులే.. ఏకమొత్తంలో చెల్లించినా హక్కులు కల్పించని ప్రభుత్వం స్థలాల రెగ్యులరైజేషన్పై స్పష్టత ఇవ్వక, అర్జీదారుల అనుమానాల నివృత్తికి ప్రయత్నం చేయకపోవడంతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఆక్రమణదారులు ముందుకు రావడంలేదు. భూక్రమబద్ధీకరణ గందరగోళంగా మారింది. విధి విధానాలపై గోప్యత పాటిస్తున్న సర్కారు.. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించే గడువు పెంచేదిలేదని స్పష్టం చేయడం దరఖాస్తుదారులను అయోమయంలో పడేసింది. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు స్థలాల్లోని నిర్మాణాల రెగ్యులరైజ్కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. క్రమబద్ధీకరణలో బిల్టప్ ఏరియానే పరిగణనలోకి తీసు కోవాలా? ఆక్రమణకు గురైన స్థలాన్ని క్రమబద్ధీకరించాలా? అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతోపాటు యాజమాన్యహక్కులు (కన్వియెన్స్ డీడ్) కల్పించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31నాటికే క్రమబద్ధీకరణ గడువు ముగిసినప్పటికీ, ఈ నెలాఖరు వరకు పొడగించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాలుగు వాయిదాల్లో నిర్దేశిత మొత్తం చెల్లిస్తే స్థలాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని, సంక్రాంతి కానుకగా వీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ప్రభుత్వంపై భరోసాతో జిల్లావ్యాప్తంగా 59 జీఓ కింద 20,203 దరఖాస్తులు వచ్చాయి. (వీటిలో 8,360 అర్జీలు ఉచిత కేటగిరీ (జీఓ 58) నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారాయి). వీటిలో ప్రాథమిక స్థాయిలోనే సగానికి పైగా తిరస్కరణకు గురికాగా, 15,139 దరఖాస్తులను ఆర్డీఓ కమిటీలు పరిశీలించాయి. దీంట్లో 10,452 మాత్రమే క్రమబద్ధీకరణ పరిధిలోకి వస్తాయని తేల్చాయి. క్రమబద్ధీకరణకు అర్హులుగా తేలిన వారందరికీ నిర్ధిష్ట రుసుము చెల్లించాలని నోటీసులు జారీచేశారు. అయితే, పూర్తి మొత్తాన్ని చెల్లించినా యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో మిగతా దరఖాస్తుదారులు డైలమాలో పడ్డారు. దాదాపు 628 మంది ఏకమొత్తంలో (రూ.7.02 కోట్లు) నిర్దేశిత రుసుము కట్టారు. అయినప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో నెలకొన్న సందిగ్ధత కారణంగా వీరికి ఇప్పటివరకు స్థలాలపై హక్కులు రాలేదు. దీంతో ఒకటి, రెండు, మూడు వాయిదాలు కట్టిన దరఖాస్తుదారులు కూడా మిగతా మొత్తం చెల్లించేందుకు వెనుకడుగు వేశారు. ఈ క్రమంలోనే 29వ తేదీలోపు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశించడం అర్జీదారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు పరిశీలించిన దరఖాస్తుల్లో సుమారు 3వేల వరకు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. పొరపాటున తప్పుదొర్లితే సవరించేలా సాఫ్ట్వేర్లో ఆప్షన్ లేకపోవడం కూడా పెండింగ్కు కారణమైంది. ఈ వెసులుబాటు కల్పించాలనే డిమాండ్పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు వైబ్సైట్ను కూడా నిలిపివేయడంతో దరఖాస్తుల క్లియరెన్స్ నిలిచిపోయింది. దీంతో వీటి ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిర్దేశిత మొత్తం చెల్లించడానికి మూడు రోజులే గడువు మిగిలి ఉన్న సమయంలో వీటిపై స్పష్టత ప్రకటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికితోడు 29లోపు డబ్బులు చెల్లించమని చెబుతున్నారే తప్ప ఆలోపు రిజిస్ట్రేషన్ చేస్తామనే విషయంపై ఇప్పటికీ రెవె న్యూ యంత్రాంగం స్పష్టీకరించడంలేదు. ఇదిలావుండగా, ఎల్ఆర్ఎస్, బీపీఎస్కు ఈ నెలాఖరే ఆఖరు కావడంతో ఆలోపు వీటిపై నిర్ణయం వెలువడకపోతే బీపీఎస్కు దరఖాస్తు చేయడం సాధ్యపడదు. వీట న్నింటినీ పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మోదీ పరాజయం
భూసేకరణ ఆర్డినెన్స్ను మళ్లీ జారీ చేయం ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని వెల్లడి * బిహార్ ఎన్నికల నేపథ్యంలో తన సవరణలపై కేంద్రం యూ టర్న్ * నీతి ఆయోగ్ సూచనతో మళ్లీ ఆర్డినెన్స్ జారీచేయరాదని నిర్ణయం * కేంద్రం ఆర్డినెన్స్ మళ్లీ జారీచేయబోదని ముందే వెల్లడించిన ‘సాక్షి’ * భూ ఆర్డినెన్స్ను కాలం చెల్లిపోనివ్వాలని నేను నిర్ణయించా: మోదీ * 2013 భూసేకరణ చట్టం అమలవుతుంది * నెలవారీ రేడియో ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎట్టకేలకు పరాజయాన్ని అంగీకరించింది. భూసేకరణకు సంబంధించి వివాదాస్పద ఆర్డినెన్స్ను మళ్లీ జారీచేయబోమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సోమవారం (31వ తేదీ)తో గడువు ముగిసిన తర్వాత ఈ ఆర్డినెన్స్ చెల్లిపోతుందని, దానిని అలాగే చెల్లిపోనివ్వాలని తాను నిర్ణయించానన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ను కేంద్రం తిరిగి జారీచేయబోదని ‘సాక్షి’ మూడు రోజుల కిందటే కథనం ప్రచురించడం తెలిసిందే. ఆ కథనాన్ని నిజం చేస్తూ స్వయంగా ప్రధానిమోదీయే ఆదివారం రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయానికి ఆయన చెప్పుకొచ్చిన కారణాలు ఏవైనా.. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా.. పార్లమెంటు ప్రక్రియను కాదని ఆర్డినెన్స్ల రూపంలో చట్టాలు తీసుకువచ్చి.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చునన్న మోదీ ధీమా సడలిపోనట్లు తాజా పరిణామం తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. పలు పరిశ్రమల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం గతంలో చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని సింగూరు, నందిగ్రామ్ వంటి ప్రాంతాల్లో వెల్లువెత్తిన రైతాంగ, ప్రజా ఆందోళనలు.. అనంతరం అనేక అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత గత యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టం చేసింది. ఈ చట్టం కింద భూమిని సేకరించటం ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది కావటంతో.. అది అభివృద్ధికి ప్రతిబంధకమని చెప్తూ మోదీ సర్కారు ఆ చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్త భూసేకరణ బిల్లును రూపొందించడం తెలిసిందే. పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో.. పెట్టుబడులను ఆకర్షించడానికి భూసేకరణకు ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవని.. కార్పొరేట్ ప్రపంచానికి చూపటం కోసం.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు చేసిన సూచనలతో హడావుడిగా రూపొందించిన ఆ సవరణల్లో.. పలు రంగాల కోసం భూసేకరణకు భూమి యజమానులైన రైతుల అంగీకారం తప్పనిసరి కాదని.. భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదని చేసిన సవరణలు అతి ముఖ్యమైనవి. భూసేకరణకు తక్షణం ‘అడ్డంకులు’ తొలగించే లక్ష్యంతో ఈ సవరణలతో 8 నెలల కిందటే ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ.. ఈ సవరణలపై ప్రతిపక్ష పార్టీలే కాదు.. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న మూడు రైతు సంఘాలు సహా దాదాపు అన్ని రైతు సంఘాలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఆ సవరణలతో కూడిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మూడు దశాబ్దాల అనంతరం లోక్సభలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. అభివృద్ధి నినాదంతో ఈ బిల్లును సులభంగానే గట్టెక్కించవచ్చని భావించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి లభించిన ప్రజాదరణను బట్టి.. మోదీ ‘అచ్చే దిన్’ తేవటం కోసం ఎటువంటి అవరోధాలనైనా అధిగమించేందుకు సిద్ధపడతారన్న సంకేతాలనిస్తూ.. రైతాంగం కూడా ఈ బిల్లుకు సానుకూలంగానే ఉంటారని తలచింది. కానీ.. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. విపక్షాల నుంచే కాదు.. మిత్రపక్షాల నుంచీ మోదీ భూబిల్లు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షం ఆధిక్యం ఉన్న రాజ్యసభ.. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పట్టుపట్టి మరీ సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)కి నివేదించింది. ఈలోగా భూ ఆర్డినెన్స్ గడువు తీరిపోయిన కారణంగా ఇప్పటికే మూడు పర్యాయాలు దానిని జారీచేసింది. ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్న బిల్లు విషయంలో.. 8 నెలల పాటు పట్టువీడని సర్కారు ఎట్టకేలకు ఇటీవలే తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రతిపక్ష పార్టీల్లో చాలా పార్టీలతో పాటు, పాలక ఎన్డీఏ మిత్రపక్షాలు కొన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో తను చేసిన సవరణల విషయంలో యూ టర్న్ తీసుకుంది. వాటిని వదిలివేయటానికి సిద్ధమని చెప్పటమే కాదు.. జేపీసీకి స్వయంగా అధికార బీజేపీయే సంబంధిత సవరణలు కూడా ప్రతిపాదించింది. మూడోసారి జారీచేసిన ఆర్డినెన్స్ గడువు కూడా సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో.. దానిని తిరిగి జారీ చేయాలని సర్కారు తొలుత నిర్ణయించింది. కానీ.. ప్రతిపక్షాలవ్యతిరేకత.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దానిని విపక్షాలు ఆయుధంగా చేసుకునే అవకాశం ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకుంది. భూ ఆర్డినెన్స్తో తనపై పడిన రైతు వ్యతిరేక ముద్రను చెరిపివేసుకునే లక్ష్యంతో.. 2013 భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తను చేసిన కీలకమైన సవరణలన్నిటినీ సర్కారు ఉపసంహరించుకోనుందని.. అందులో భాగంగానే ఆర్డినెన్స్కు కాలం చెల్లిపోనివ్వాలని నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అదీగాక.. భూసేకరణ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నందున దీనిపై చట్టం చేసే అంశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టాలన్న నీతిఆయోగ్ సిఫర్సూ ఈ నిర్ణయానికి కారణమని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఆర్డినెన్స్ను మళ్లీ జారీచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన మోదీ.. ఆర్డినెన్స్ను మళ్లీ జారీ చేయకపోవటమంటే.. భూసేకరణ చట్టం 2013ను యథాతథంగా అమలులోకి రావటమేననీ అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా భూసేకరణ బిల్లులో చేర్చటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనీ చెప్పారు. తద్వారా.. మోదీ మొట్టమొదటిసారిగా తన ఓటమిని పరోక్షంగానైనా స్వయంగా ఒప్పుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాభవం కన్నా.. భూసేకరణ చట్టం విషయంలో ‘అంగీకరించిన’ పరాభవమే చాలా పెద్దదని వారు విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రధానమంత్రి మోదీ తన రేడియో ప్రసంగంలో.. రైతుల ప్రయోజనాల కోసం ‘13 అంశాల’ను నోటిఫై చేయటం ద్వారా నిబంధనల రూపంలో అమలులోకి తెచ్చామని చెప్పటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ.. ఆ అంశాలు కొత్తవేవీ కాదని, 2013 చట్టంలో భాగంగా రూపొందించినవేనని పేర్కొంటున్నారు. నిర్దిష్ట ప్రభుత్వ పనుల కోసం భూసేకరణకు గల కష్టాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన ఈ 13 అంశాలను నోటిఫై చేయకపోతే ఆర్డినెన్స్తో పాటే గడువుతీరిపోతాయని వివరించారు. ఈ నిబంధనలను నోటిఫై చేయటం ద్వారా రైతులు ప్రస్తుతమున్న 2013 చట్టం ప్రకారం భూసేకరణకు పరిహారం పొందనున్నారు. మోదీ ‘మన్ కీ బాత్’.. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. మాకు ‘జై జవాన్-జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. ‘‘మేం ఒక భూ ఆర్డినెన్స్ను జారీ చేశాం. రేపటితో (సోమవారంతో) దాని గడువు తీరిపోతుంది. ఆ ఆర్డినెన్స్ గడువు తీరిపోనివ్వాలని నిర్ణయించాను. దానర్థం.. నా ప్రభుత్వం పగ్గాలు చేపట్టకముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించటం. రైతుల అభిప్రాయమే నాకు అత్యంత ముఖ్యం. భూసేకరణ బిల్లుపై ప్రభుత్వానికి విశాలదృక్పథం ఉంది. ఆ బిల్లుపై చాలా వివాదం నెలకొనివుంది. రైతుప్రయోజనాల కోసం ఎలాంటి సూచనలనైనా నేను అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. 2013 భూసేకరణ చట్టాన్ని మెరుగుపరచటానికి రాష్ట్రాల నుంచి సూచనలు వచ్చాయి. ఈ చట్టానికి ఉద్యోగస్వామ్య పిడికిళ్ల నుంచి స్వేచ్ఛ కల్పించాలని.. సాగునీటి కాలువలు, విద్యుత్తుకు విద్యుత్తు స్తంభాలు, రోడ్లు, ఇళ్లు అందించటం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం జరిగేలా చూడాలని, పేద గ్రామాలకు పని లభించేలా సాయం చేయాలని ఆ సూచనలు పేర్కొన్నాయి. అయితే.. ప్రభుత్వం ఈ భూ బిల్లును తీసుకువచ్చిన తర్వాత చాలా పొరపాటు అనుమానాలను సృష్టించారు. రైతుల్లో ఎంతో భయం నింపారు. రైతులకు ఎటువంటి సందేహం కానీ ఎటువంటి భయం కానీ అవసరం లేదు. నేను ఎవరికీ అటువంటి అవకాశం ఇవ్వను. ఇప్పుడు ఎటువంటి సందేహానికీ ఆస్కారం లేదు. ఎవరైనా భయం సృష్టించటానికి ప్రయత్నిస్తే.. మీరు భయపడకూడదు. ఈ వివాదాల కారణంగా విషయం సంక్లిష్టంగా మారింది. ఆర్డినెన్స్కు కాలం చెల్లిపోయేలా చేస్తున్నందున.. 13 అంశాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. అసంపూర్ణంగా ఉన్న పనిని పరిష్కరించేందుకు ఈ నిబంధనలు ఈ రోజు (ఆదివారం) నుంచి అమలులోకి వస్తాయి. రైతులు ఆర్థికంగా లేదా మరే రకంగా నష్టపోకూడదని మేం ఈ పని చేస్తున్నాం. మాకు ‘జై జవాన్- జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. అందుకే రైతుల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు స్వాతంత్య్ర దిన ప్రసంగంలో ప్రకటించాను.’’ అభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యలకు సమాధానం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం భూసేకరణ ఆర్డినెన్స్ రద్దు అంశంతో పాటు అనేక అంశాలను ప్రస్తావించారు. సొంతరాష్ట్రం గుజరాత్లో పటేల్ల ఆందోళనపై మొదటిసారి స్పందించారు. ప్రధాని ‘మన్కీ బాత్’ ప్రధాన అంశాలు... * గుజరాత్లో జరిగిన హింసా ఘటనలు దేశాన్ని ఆందోళన పర్చాయి. సర్దార్ పటేల్ పుట్టిన గడ్డపై ఏం జరిగినా అన్నింటికన్నా ముందు దేశానికి దిగ్భ్రాంతి కలిగింది. పరిస్థితులు అదుపు తప్పకుండా చూడడంలో కీలక భూమిక నిర్వహించిన నాగరికులతో గుజరాత్ శాంతి మార్గంలో పయనిస్తోంది. శాంతి, ఐక్యత, సోదరభావమే సరైన మార్గం. భుజం భుజం కలిపి అభివృద్ధి మార్గంలో నడవాలి. అభివృద్ధే మన సమస్యలకు సమాధానం. * రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెలకు బీమా ఇవ్వాలనే పిలుపునకు స్పందించి 11 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. * జన్ధన్ యోజన పిలుపుతో 17.75 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడం సంతోషం. జీరో బ్యాలెన్సుతో ఖాతా తెరవాలని కోరగా, 22వేల కోట్లు పొదుపు చేశారు. * బౌద్ధ దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయ విద్వాంసులు త్వరలోనే బుద్ధగయ రానున్నారు. మానవజాతి ప్రాపంచిక విషయాలపై చర్చించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూగయ వెళ్లారు. ఇప్పుడు బౌద్ధ విద్వాంసులతో బోధ్గయ వెళ్లే అవకాశం లభించడం ఆనందక్షణాలుగా భావిస్తున్నా. * మన శాస్త్రవేత్తలు అత్యుత్తమరీతిలో పనిచేస్తున్నారు. వారి పరిశోధనలు, ఆవిష్కరణలను సామాన్యుల వరకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలి. సిద్ధాంతాలను పరికరాల్లో ఎలా మార్పు చేయాలి? ల్యాబ్లను భూమికి ఎలా అనుసంధానం చేయాలి? అనే దిశగా ముందుకు వెళ్లాలి. * విద్యలో సంస్కరణలు తేవాలని, నైపుణ్యాభివృద్ధిపై పరిమల్ షా (ఠానే), ప్రాథమిక విద్యలో ఉత్తమ ఉపాధ్యాయుల అవసరంపై ప్రకాశ్ త్రిపాఠి లేఖల ద్వారా సూచనలు తెలియచేశారు. * చిన్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి నివారణకు ఇంటర్వ్యూల విధానం నుంచి విముక్తి కల్పించే పని త్వరలో అమల్లోకి రానుంది. * మనదేశంలో ఏటా 50వేల మంది తల్లులు, 13 లక్షల మంది శిశువులు ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత మృతి చెందడం ఆందోళనకరం. ఈ మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. * దేశంలో 514 డెంగీ రోగ నిర్ధారణకు ఉచిత పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటే ఉచిత పరీక్ష కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలి. * ప్రేమ, ఔదార్యాలతో కూడిన సూఫీ సంస్కృతిని అన్ని మతాలవారూ అర్థం చేసుకోవాలి. సూఫీ సంస్కృతి ఇస్లాం వాస్తవ రూపాన్ని చూపుతుంది. ఇటీవల సూఫీ సన్యాసులను, పండితులను కలుసుకున్నాను. వారి మాటలు, మాట్లాడిన విధానం వీనుల విందుగా అనిపించింది. క్రూరమైన జోక్... మోదీ దేశ రైతుల పట్ల క్రూరమైన జోక్ చేశారు. తమ సవరణలు ఆమో దం పొందే అవకాశాలు లేవని తెలిసినప్పుడు మూడు సార్లు ఎందుకు ఆర్డినెన్స్ను జారీ చేయాల్సి వచ్చింది? - సీతారాం ఏచూరి, సీపీఎం నేత సంస్కరణకు విఘాతం.. భూఆర్డినెన్స్ రద్దు ఆర్థిక సంస్కరణలకు తీవ్ర విఘాతం. పారిశ్రామికీకరణకు కీలకమైన భూసేకరణ ఇకపై కష్టతరమౌతుంది. - అసోచామ్ కాంగ్రెస్ బండారం బయటపడింది.. భూసేకరణ బిల్లుతో కాంగ్రెస్ బండారం బయటపడింది. సలహాలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా కాంగ్రెస్ అడ్డుపడింది. తాజా నిర్ణయంతో ఇక రాష్ట్రాలు స్వేచ్ఛగా భూసేకరణ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు. - కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ‘పొరపాటు’ ఒప్పుకుంది.. ప్రభుత్వం చివరకు తన పొరపాటు అంగీకరించింది. - ఆప్ -
మళ్లీ 'భూ' ఆర్డినెన్స్ తీసుకురాం
న్యూఢిల్లీ: ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన పలు వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఇదే అదనుగా చూసుకుని ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడానికి తమ పోరాటమే కారణమని కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురాబోమని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నందున బిల్లులో రైతుల ప్రయోజనాలుద్దేశించి ఎలాంటి సవరణలు కోరుకుంటున్నారో, ఏ అంశాలు చేర్చాలని భావిస్తున్నారో సలహాలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 2013లో తీసుకొచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లు రైతుల్లో తీవ్ర ఆందోళన పుట్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దీనివల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తర్వాత యూ టర్న్ తీసుకొని బిల్లులో సవరణలకు డిమాండ్ చేశాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోవడంతో గత రెండు పార్లమెంటు సమావేశాలు ఈ అంశం కారణంగానే ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఇప్పటి వరకు ఈ చట్టానికి సంబంధించి మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
ఎన్నికల బహిష్కరణపై విచారణ
నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి
గ్రామాన్ని అభివృద్ధి చేయకుంటే ఓటెయ్యం
మాతోనే రామాలయ అభివృద్ధి
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
విస్తృత తనిఖీలు చేపట్టాలి
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement