breaking news
exhaust
-
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!
కోటా (రాజస్థాన్): అది ఆదివారం రాత్రి.. రాజస్థాన్లోని కోటా నగరంలో సుభాష్ కుమార్ రావత్ తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు. తాళం తీసి లోపలికి వెళ్లిన ఆ దంపతులకు గుండె ఆగినంత పనైంది. గాలి కోసం పెట్టిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఒక వింత ఆకారం వేలాడుతూ కనిపించింది. సగం లోపల.. సగం బయట! నేలకి పది అడుగుల ఎత్తులో.. తల, చేతులు ఇంట్లోకి వచ్చి ఉన్నాయి.. కాళ్లు మాత్రం బయట గాలిలో ఊగుతున్నాయి. సరిగ్గా గమనిస్తే అర్థ్ధమైంది.. ఆ ఆకారం ఒక ’దొంగ’ ప్రబుద్ధుడిదని.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా దూరి లోపలికి రావాలని ప్రణాళిక వేసి, నడుము భాగం దగ్గర గట్టిగా ఇరుక్కుపోయాడు. పాపం, అటు లోపలికి రాలేక, ఇటు బయటకి వెళ్లలేక బావురుమన్నాడు. ఇరుక్కుపోయినా తగ్గని ’ఈగో’!రావత్ దంపతులు తేరుకుని, ‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’.. అని గట్టిగా అరిచారు. సాధారణంగా దొంగలు దొరికిపోతే కాళ్లావేళ్లా పడతారు. కానీ మన దొంగ రూటే వేరు! ఇరుక్కుపోయినా కూడా, ఇంటి యజమానులనే బెదిరించడం మొదలుపెట్టాడు. ‘నన్ను ఇప్పుడే వదిలేయండి. నా మనుషులు బయటే ఉన్నారు.. నన్నేమై నా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు!’.. అంటూ బడాయిలు పోయాడు. కానీ, అసలు విషయం ఏంటంటే.. అసలు దొంగ ఇరుక్కుపోవడం చూసి, బయట కాపలా ఉన్న కొసరు దొంగలంతా తమ కారు వదిలేసి మరీ పరారయ్యారు.ఏడుపులంకించుకున్న దొంగోడు వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతన్ని బయటకి తీయడం పెద్ద సాహసమే అయిపోయింది. బయట ఒక కానిస్టేబుల్ నెట్టడం, లోపల ఇద్దరు పోలీసులు లాగడం.. ఈ క్రమంలో మన దొంగ గారు నొప్పితో విలవిల్లాడుతూ, ఏడుస్తూ పెట్టిన కేకలు చుట్టుపక్కల వారికి మాత్రం వినోదాన్ని పంచాయి. ఎట్టకేలకు అతన్ని బయటకు తీసి, సంకెళ్లు వేసి స్టేషన్కు తరలించారు. దొంగలు వచ్చిన కారు మీద ’పోలీస్’ అని స్టిక్కర్ ఉండటం విశేషం. ఇప్పుడు పోలీసులు.. ఆ కారు ఎక్కడిది? ఆ దొంగ వెనుక ఉన్న ముఠా ఎక్కడ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
ఇంట్లోకి రాగానే ఆ దంపతులకు ఊహించని దృశ్యం..!
రాజస్థాన్లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి తన తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఊహించలేని దృశ్యం కనిపించింది. సుభాష్ కుమార్ రావత్ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగ.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎవరూ లేని ఇంటిలో దొంగతనం చేయడానికి ప్లాన్ చేసిన ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బయటకురావడానికి చాలా ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో కిందకి వేలాడుతూ ఉన్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. నేల నుండి 10 అడుగుల ఎత్తులో తల, చేతులు ఇంట్లో లోపల ఉండగా కాళ్లు బయట వేలాడుతూ కనిపించాడు.అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని సుభాష్ కుమార్ రావత్ వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో దొంగ వేలాడుతుండడాన్ని గమనించారు. తాను దొంగనంటూ ఆ చెప్పిన ఆ వ్యక్తి ఆ దంపతులపై బెదిరింపులకు దిగాడు. తన సహచరులు బయట ఉన్నారని, తాను బయటపడనివ్వకపోతే వారు హాని చేస్తారంటూ హెచ్చరించాడు.In Rajasthan's Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer's car. 😳 pic.twitter.com/mwNcxjD2AF— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026దీంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులే షాక్ అయ్యారు. జనవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
శ్రీహరికోటలో ఉద్యోగులకు తప్పిన ప్రమాదం
నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉద్యోగులకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు ఉద్యోగులు పని చేస్తున్న కంటైనర్లో ఆక్సిజన్ ఖాళీ కావడంతో వారందరూ శ్వాస అందక ఇబ్బంది పడ్డారు. సరైన సమయంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ముగ్గురు ఉద్యోగులను ప్రాణాపాయ స్ధితి నుంచి కాపాడారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
38 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
పోలవరం: గోదావరి వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 38 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న తవ్వు కాలువ వద్ద రెండు భారీ విద్యుత్ స్తంభాలు వరద నీటికి పడిపోయాయి. ఈ కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 18, తూర్పుగోదావరి జిల్లాలోని 20 గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం ఉదయం విద్యుత్శాఖ ఏడీ నరసింహమూర్తి పడవలో స్తంభాలు పడిపోయిన ప్రదేశానికి సిబ్బందితో వెళ్లారు. నీటిలో స్తంభాలు పడిపోయి.. వాటిని పైకి లేపే పరిస్థితి లేకపోవడంతో వారంతా అక్కడ నుంచి వెనుదిరిగారు. గోదావరి వరద తగ్గితే తప్ప చేయగలిగింది ఏమీ లేదని, తమ ప్రయత్నం తాము చేస్తామని ఏఈ సీవీకే వేమన చెప్పారు. గురువారం ఉదయం కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అధికారులు మిన్నకుండిపోయారు.


