-
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం
భోపాల్: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ రవి విజయ మలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అడ్వకేట్ యూనియన్ ఫర్ డెమొక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్ కోరారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్ -
ఉద్యోగాల భర్తీలో EWS వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంపు
-
‘ఈడబ్ల్యూఎస్’ సర్టిఫికెట్ల జారీపై ఈనాడు తప్పుడు కథనాలు..
సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలో జారీ చేసిన దాదాపు లక్ష సరిఫికెట్లు కళ్లెదుటే కనిపిస్తున్నా కబోదుల్లా నటిస్తూ మభ్యపుచ్చే కథనాలు ప్రచురించే వారిని ఏమనాలి? అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల సంఖ్య ఇదీ! రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సజావుగా జారీ అవుతుంటే అసలు ప్రొఫార్మా సైతం రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలకు చేరలేదంటూ ‘ఈనాడు’ యథావిధిగా తనకు అలవాటైన రీతిలో పచ్చి అబద్ధాలను వండి వార్చింది. సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల పోలీసు నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈడబ్ల్యూఎస్ సదుపాయాన్ని వినియోగించుకోగలమా? అని మథనపడుతున్నట్లు శోకాలు పెట్టింది. జనవరి నుంచే జారీ ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చేసిన చట్టానికి అనుగుణంగా వీటిని జారీ చేస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటికోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీ వరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కోసం 1,04,961 లక్షల మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 93,348 జారీ అయ్యాయి. 7,608 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 4,005 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మరి ప్రొఫార్మాలే రెవెన్యూ కార్యాలయాలకు చేరకుంటే ఇన్ని లక్షల సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయి? ఇదీ ప్రక్రియ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళుతుంది. అక్కడి నుంచి వీఆర్వో, ఆర్ఐ ద్వారా తహసీల్దార్ వద్దకు చేరుతుంది. ఇందుకోసం రూ.50 సర్వీస్ చార్జీ చెల్లించాలి. దరఖాస్తుతోపాటు నోటరీ అఫిడవిట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో జత చేయాలి. దరఖాస్తును 30 రోజుల్లోపు కచ్చితంగా క్లియర్ చేస్తారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే అర్హులైన అగ్రవర్ణ పేదలకు నిబంధనల ప్రకారం వీటిని జారీ చేస్తారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవడంలేదని, దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఈనాడు దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, చైనాతో ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు, దేశ ఆర్థిక స్థితిగతులు, చైనాతో సరిహద్దు సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ండటం తదిరాలను సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ శనివారం పార్టీ నాయకురాలు సోనియాగాంధీ నివాసంలో సమావేశమైంది. విపక్షాలతో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తామని పార్టీ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈసారి సమావేశాలకు దూరం కానున్నారు. నా వ్యాఖ్యల వక్రీకరణ: ఖర్గే అహ్మదాబాద్: ప్రధాని మోదీని రావణుడని తాను ప్రత్యేకంగా అనాల్సిన పని లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గుజరాత్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మోదీ ముఖమే. అలా అనేలా చేసుకుంది వాళ్లే’’ అన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఆప్ ప్రయత్నిస్తోందన్నారు. -
‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?
రిజర్వేషన్లు, అవినీతి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలనే అభిప్రాయం ద్విజ న్యాయవ్యవస్థలో బలంగా పాతుకుపోయింది. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు’ (ఈడబ్ల్యూఎస్) కోటా విషయంలో సుప్రీంకోర్టులో మెజారిటీ తీర్పు దీన్నే ప్రతిఫలించింది. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వే షన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. తమ యువతకు లబ్ధి చేకూర్చుతుందని నమ్ముతూ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్ర వర్గాలు దీన్ని సమర్థిస్తున్నాయి. కానీ అంతిమంగా ద్విజ వర్గాలే దీని నుంచి లబ్ధి పొందుతాయనేది నిజం. అన్ని స్థాయుల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న వర్గాల్లోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్పై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చలకు దారితీసింది. దళిత, ఆదివాసీ, ఓబీసీల సామాజిక ఆర్థిక మార్పునకు సంబంధించిన కోణంలోంచి చూస్తే అది తిరోగమన తీర్పా లేక పురోగమన తీర్పా అనేదే ఆ చర్చల సారాంశం. 2022 నవంబర్ 10న ఆల్ బార్ అసోసియేషన్ (ఏబీఏ) న్యాయవాదులు, అఖిల భారత వెనుకబడిన మైనారిటీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య కార్యకర్తలు ఒక ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ఇప్పటికీ తమ చారిత్రక వెనుకబాటుతనాన్ని, తమపై నియంత్రణను అధిగమించలేకపోయిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉత్పాదక ప్రజారాశులను తప్పుదోవ పట్టిస్తున్న న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని సవాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం కోసం అవసరమైన కొత్త దృక్పథాన్ని ఈ సెమినార్ పరిశీలించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 3–2 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ దృక్పథాన్ని మెజారిటీ న్యాయమూర్తులు ఎత్తిపట్టారు. ఇక పోతే నాటి చీఫ్ జస్టిస్ యుయు లలిత్తో కూడిన ఇద్దరు జడ్జీల మైనా రిటీ కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సంస్థాగతంగా ఉన్న కులాన్ని నిర్మూలించి సమతావాద సమాజం వైపు పురోగమిం చాలని రాజ్యాంగం నిర్మాణాత్మకంగా మాట్లాడలేదన్న అభిప్రా యాన్ని ‘ఏబీఏ’ న్యాయవాదులు వ్యక్తపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మాత్రమే కులం గురించి పేర్కొంది. ప్రజానీకంలోని బలహీన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించాలని చెప్పింది. పైగా సామాజిక అన్యాయం నుంచి, అన్ని రకాల దోపిడీ నుంచి వారిని కాపాడాలని సూచించింది. ఇక్కడ కూడా కులానికి సంబంధించిన భావనను షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే ఉద్దేశించడం చూడవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా శూద్ర, ఓబీసీలను కుల పీడనను ఎదుర్కొంటున్న వారిగా గుర్తించలేదు. వీరిని ఒక వర్గంగానే గుర్తిం చారు. ప్రస్తుతం ఇతర వెనుకబడిన వర్గం రిజర్వేషన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల చర్చా పరిధిలోనే ఏర్పర్చారు. ఇది రిజర్వేషన్ వ్యతిరేక రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, మీడియా వ్యక్తులకు విస్తారమైన పరిధిని ఇచ్చింది. 103వ రాజ్యాంగ సవరణతో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద్వారా వర్గ ప్రాతిపదిక రిజర్వేషన్ను ముందుకు తెచ్చే వీలు కల్పించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా దీనికి ఆమోద ముద్ర వేసింది. న్యాయవ్యవస్థలోని చాలామంది జడ్జీలు వర్గ (ఆర్థిక కేటగిరీ) పరమైన రిజర్వేషన్ థియరీని అనుసరిస్తున్నారు. అన్ని కులాలనూ దీంట్లో పొందుపరుస్తున్నప్పటికీ ద్విజ కులాలే ఎక్కువగా అదనపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఆర్థిక వర్గీకరణ ప్రాతిపదికన ఉండే ఏ రిజర్వేషన్ అయినా ఇప్పటికే ప్రతిభ పేరుతో ప్రతి సీటును, ఉద్యో గాన్ని పొందగలుగుతున్న ద్విజ కులాలతోపాటు సాపేక్షంగా పేదలే అయినప్పటికీ, సామాజికంగా అదే స్థాయికి చెందిన శక్తులను విద్యా, ఉద్యోగ మార్కెట్లోకి తీసుకొస్తుంది. 1990 మండల్ రిజర్వేషన్ పోరాట రోజులనుంచి కులప్రాతి పదికన ఉన్న నిరక్షరాస్యత, దారిద్య్రం, అసమానత్వం, అణచివేత, దోపిడీ వంటి అంశాలను తక్కువచేసి చూపడానికి వామపక్షాలు, ఉదారవాదులు, హిందుత్వవాదులు అందరూ రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదికను కూడా తేవాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. న్యాయ మూర్తులు, న్యాయ నిపుణులు రాజ్యాంగానికి చేస్తూ వచ్చిన వ్యాఖ్యా నాలు చాలావరకు వర్గ కేంద్రంగానే ఉంటూ వచ్చాయి. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వేషన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. మన న్యాయవ్యవస్థలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రవేశాన్ని దామాషా ప్రాతిపదిక కింద చొప్పించడం ఎలా అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. న్యాయపరమైన వ్యాజ్యాలలో పాలు పంచుకోవడాన్ని సాధా రణ ప్రజానీకం అర్థం చేసుకోలేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచి పోటీపడే సమర్థతలు కలిగిన సుశిక్షితులైన న్యాయ నిపుణులు మాత్రమే న్యాయ పోరాటాలలో తలపడగలరు. చట్టాలను వ్యాఖ్యా నించడంలో న్యాయవ్యవస్థ అత్యంత శక్తిమంతమైన విభాగంగా ఉంటున్నందున, అన్ని స్థాయిల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న నేపథ్యంలోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే న్యాయవ్యవస్థలో ఈ వర్గాల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఈ సమరంలో ఇంగ్లిష్ పాత్ర చాలా కీలక మైంది. న్యాయ వ్యవస్థను అదుపు చేస్తున్న యంత్రాంగాలను మార్చా లంటే వీధిపోరాటాలు లేదా పార్లమెంటరీ గావుకేకలు సాయపడవు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంపీలు సంఖ్యరీత్యా మెజా రిటీగా ఉన్నప్పటికీ, అగ్రవర్ణ పేదలకు కోటా వంటి అంశాల్లో పాలక వర్గాలు చట్టాలను లేదా రాజ్యాంగ సవరణలను శరవేగంతో రూపొం దిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరిగినప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజారిటీ ఉన్నందున వీటిని మరింత తెలివిగా అమలు చేస్తూవస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై రివ్యూ పిటిషన్ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నప్పటికీ, చాలావరకు అదే తీర్పును భాషాపరమైన మార్పులతో తిరిగి రాయడమే జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య మరెక్కడో ఉంది. బార్లో కానీ, ధర్మాసనంలో కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మేధావులు పెద్దగా ఉండటం లేదు. లేదా న్యాయపరమైన జిత్తులను అర్థం చేసుకోలేనంత బలహీనంగా ఉంటున్నారు. వీటిని సరిగా అర్థం చేసుకుని, ఉత్పాదక కులాలు ఇంతకాలం సాధించింది ఏమీలేదని దేశం మొత్తానికి నచ్చజెప్పగలిగిన అంబేడ్కర్ లాంటి ప్రతిభావంతు లైన న్యాయ నిపుణులు ఈ కులాల్లోంచి పుట్టుకురావలసిన అవసరం ఉంది. జాట్, పటేల్, రెడ్డి, కమ్మ, వెలమ, నాయర్, బెంగాల్లోని నామ్శూద్రుల వంటి ఓబీసీ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రుల విషయంలో సమస్య ఏమిటంటే, తమ యువతకు కాసిన్ని సీట్లు, ఉద్యోగాలు వస్తాయని ఆశించి వారు ఇలాంటి విధానాలను బల పరుస్తున్నారు. కానీ గత రెండేళ్లుగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, కేంద్ర స్థాయిలో సీట్లు, ఉద్యో గాలకు సంబంధించిన డేటాను చూసినట్లయితే వారు నిజంగా లబ్ధి పొందినట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఎగువ తరగతి శూద్రు లపై విద్యాపరమైన ఆధిక్యత కలిగిన ద్విజ కులాలవారే లబ్ధి పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో శూద్ర ఎగువ తరగతి కులాలు పాలిస్తున్నప్పటికీ జాతీయ మేధారంగాల్లో వీరు ఎలాంటి నిర్ణయాత్మక పాత్రను పోషించడం లేదు. చివరకు 8 లక్షల ఆదాయ పరిమితితో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కూడా పూర్తిగా ద్విజులే ఉపయోగించుకుంటారు. ఇకముందు కూడా అనేక సంవత్సరాల పాటు విద్యారంగంలో ఓబీసీ క్రీమీ లేయర్, ఇతర శూద్ర కులాల వారు కూడా ద్విజ యువతతో పోటీ పడలేరన్నది వాస్తవం. రిజర్వేషన్లు, అవినీతి అనేవి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు అంటూ ద్విజ న్యాయవ్యవస్థలో పాతుకుపోయిన బలమైన అభిప్రాయాలనే సుప్రీంకోర్టులో మెజారీటీ తీర్పు ప్రతిఫ లించింది. కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థను క్రమంగా ఎత్తివేయా లని వీరు చెబుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారు తిండి తింటే బల హీనపడతారు, వీరు ఆకలి దప్పులతో ఉంటే దేవుడు వారికి మరింత శక్తిని ఇస్తాడు అని వారిచేతనే నమ్మింపజేస్తారు. చాలామంది ఇలాంటి థియరీలను నమ్ముతున్నారు కూడా. సైన్స్ ఒక మూఢనమ్మకం, రాజ్యాంగం ఒక బ్రాంతి అనే భావాలను కూడా వీరు వ్యాప్తి చెంది స్తారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు దీనికి ఒక ఉదాహరణ. ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement