breaking news
ester
-
‘తల’ మూవీ ప్రీ రిలీజ్ మెరిసిన హీరోయిన్ ఎస్తర్ (ఫొటోలు)
-
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘జ్యువెల్ థీఫ్’
కృష్ణసాయి, మీనాక్షీ జైస్వాల్ జంటగా నటించిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రేమ, అజయ్, శివారెడ్డి, శ్రావణి, శ్వేతారెడ్డి నటించారు. మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ఆడియో లాంచ్ వేడుకకి ముఖ్య అతిథులుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ లవిదియ, అతిథిగా నటి ఎస్తేర్ హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కృష్ణ సాయి మాట్లాడుతూ– ‘సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’’ అన్నారు. ‘‘కృష్ణసాయికి తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది’’ అన్నారు పీఎస్ నారాయణ. ‘‘ఈ మూవీలో మంచి పాత్ర చేశాను’’ అన్నారు నటి ప్రేమ. -
ఈస్టర్ దీవి మిస్టరీ!
పసిఫిక్ సముద్రం ఆగ్నేయప్రాంతంలోని చిట్టచివరి దీవి ఈస్టర్ దీవి. ప్రస్తుతం చిలీ అధీనంలో ఉన్న ఈ దీవిలో మానవుల తలలను పోలి ఉండే అత్యంత పురాతనమైన శిల్పాలు కనిపిస్తాయి. ఈ దీవిలో ఇలాంటి శిల్పాలు దాదాపు వెయ్యి వరకు కనిపిస్తాయి. ఇవి దాదాపు వెయ్యేళ్ల కిందటివని, తొలినాళ్లలో ఇక్కడ నివాసం ఉండే ‘రాపా నుయి’ తెగకు చెందిన ప్రజలే ఈ శిల్పాలను చెక్కి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. అంతకు మించి వీటిని ఎవరు ఎందుకు చెక్కి ఉంటారో తెలిపేందుకు మరే ఆధారాలు లేవు. శిలలపై చెక్కిన ఈ మానవ శిరస్సుల వెనుకనున్న కథ ఏమిటో ఇప్పటికీ మిస్టరీనే! ఈ దీవిలో యూరోపియన్లు 1722లో తొలిసారిగా అడుగుపెట్టే నాటికి ఇక్కడ రెండువేల మందికి పైగా స్థానిక తెగల వారు ఉండేవారు. దండయాత్రలు, వ్యాధుల కారణంగా ఇక్కడి జనాభా 1877 నాటికి 111కు పడిపోయింది. చిలీ ఈ దీవిని 1888లో స్వాధీనం చేసుకున్నాక, ఇక్కడి పరిస్థితులు స్వల్పంగా మారాయి. ప్రస్తుతం ఈ దీవి జనాభా దాదాపు ఎనిమిదివేలు. యునెస్కో ఈ దీవిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1995లో గుర్తించింది. అప్పటి నుంచి ఇక్కడకు పర్యాటకుల రాక మొదలైంది. -
పునరుత్థానమే సమాధానం
‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమొనర దాల్చెను. ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవ వరములియ్య వసుధపైని’ ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. యేసు మరణించి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగిలేచాడు. క్రైస్తవులంతా పాడుకొనే ఓ అద్భుతమైన పాట ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. ‘మరణమున్ జయించి లేచెన్ మన ప్రభువు నేడు. మహిమ దేహమొనర దాల్చెను. ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవ వరములియ్య వసుధపైని’. శుభ శుక్రవారం రోజున ఝెరూషలేము లోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన యేడు మాటలు సిలువలో పలికి తన ఆత్మను అప్పగించారు. క్రీస్తు మరణము శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాది మంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసును విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆ కాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసు ప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుంచి రక్తము, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహం నుంచి నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు ధ్రువీకరించారు. క్రీస్తు సిలువపై మరణించి నప్పుడు అనేక అద్భుతాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటిలో ప్రాముఖ్యమైనది దేవాలయపు తెర చిరిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని, అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారు చేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుషులెవ్వరూ చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే ఆ తెర పైనుంచి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. యేసుప్రభువు చనిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం అరిమితయి యోసేపు అనే వ్యక్తి పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడుగుతాడు. యోసేపు యూదుల న్యాయసభలోని సభ్యుడు. సుమారు 70 మంది పెద్దలు ఆ సభలో ఉంటారు. యోసేపు తన కోసం ఒక చక్కని రాతితో తొలిపించుకున్న సమాధిని సిద్ధపరచుకున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడయిన నికోదేముతో కలిసి యేసుప్రభువు దేహాన్ని సిద్ధపరచి సమాధిలో ఆ దేహాన్ని ఉంచుతారు. ఒక రాయి పొర్లించి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోమన్ సైనికులు ఆ సమాధికి కావలిగా ఉన్నారు. దానికి కారణం యూదా పెద్దలలో కొందరు యేసు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచెదనని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని పటిష్ఠమెన కావలిని ఉంచారు. వారంతా యేసు పునరుత్థానమును అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ అది నెరవేరలేదు. ఆయన చెప్పినట్లే మరణమును జయించి మూడవ దినమున పునరుత్థానుడైనాడు. ప్రపంచంలో చాలామంది ఈరోజుకి చనిపోయి సమాధిలో పరిమితమయ్యారు గాని ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే క్రీస్తు పునరుత్థానం చెందినరోజు సమాధి ముందున్న రాయి పక్కకు తొలగించబడింది. రాయి తొలగించబడకుండా క్రీస్తు బయటకు రాలేడా? అనే ప్రశ్న కొందరికి ఉండవచ్చు. రాయి ఉన్నా యేసు బయటకు రాగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు గనుక. పీటర్ మారల్ అనే దైవజనుడు ఈ విషయాన్ని గూర్చి ఓ చక్కని వ్యాఖ్యానం చేశాడు. ‘ఆయన బయటకు రావడానికి అక్కడ ఉన్న రాయి దొర్లించబడలేదు గాని, మనము ఆయన సమాధిలోనికి వెళ్లి చూడ్డానికి ఆ రాయి పక్కకు తొలిగించబడింది’. నేటికి ఝెరూషలేములోని క్రీస్తు సమాధి తెరువబడి ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు. సమాధి లోపల ఓ దివ్యమైన సందేశం ఉంటుంది. ‘ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచియున్నాడు’ (మత్తయి 28:6). యేసుప్రభువు ఖాళీ సమాధి క్రైస్తవుల విశ్వాసానికి ఒక బలమైన పునాది. సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఈనాడు అనేకులు క్రీస్తును ప్రభువుగా విశ్వసిస్తున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయనలోని దైవత్వము మానవాళికి ప్రత్యక్షపరచబడింది. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాధినేతలు, చక్రవర్తులు, మా మాటకు తిరుగులేదు, మా శాసనాలకు ఎదురులేదు అనుకున్న చాలామంది నేటికీ సమాధిలోనే ఉన్నారు. ఎందరో కవులు, ధనికులు మృత్యువు ముందు తలవంచారు. విలియం లేన్ క్రేగ్ ఇలా అంటాడు. ‘పునరుత్థానమునందు నమ్మకము లేకుంటే క్రైస్తవ విశ్వాసము ఉనికిలోకి వచ్చియుండెడిది కాదు. శిష్యులు యేసును వారి ప్రియతమ నాయకునిగా జ్ఞాపకముంచుకోదలచినను, సిలువ మరణము ఆయనను మెస్సీయగా ఉంచుకోవడము విషయములో వారి ఆశలను నిర్వీర్యం చేసియుండేది. సిలువ ఆయన జీవిత ప్రధాన గమనమును దుఃఖ సహితముగను, అవమానకరముగను ముగించి యుండేది. గనుక క్రైస్తవ పుట్టుక యేసుక్రీస్తు మృత్యువు నుంచి లేచియున్నాడనే విశ్వాసం మీద ఆధారపడియున్నది’. యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా? అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశములోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రము నిలువెత్తు జవాబుగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యములు పూసిన నారబట్ట చుడతారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని దానిమీద విస్తృత పరిశోధనలు చేశారు. ఈనాటికీ ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రం క్రీస్తు మరణ పునరుత్థానాలకు సాక్ష్యంగా ఉంది. ఈ ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. క్రీస్తు పునరుత్థానము గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. లేవీయ కాండము పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు లక్షణాలు ఆ పక్షులలో మనకు కనబడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంత వరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్నుతాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే ఆరోగ్య నిబంధన ఉండేది. కొంతకాలానికి ఆ వ్యక్తికి కుçష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే, దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనపరచుకోవాలి. ఒకవేళ రోగి దేహమును పరిశీలించి, అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుంచి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు సజీవమైన పక్షులను తీసుకు రావాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి. అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంప బడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణానికి సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల కలిగిందని విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది. అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. దేవుని దివ్య దర్శనం అతనికి కలిగింది. మొదటి శతాబ్దంలో అతడు చూసిన, విన్న విషయాలను గ్రంథçస్థం చేశాడు. అదే బైబిల్లోని చిట్టచివరి గ్రంథం ‘ప్రకటన గ్రంథం’. ఆ పెద్దలలో ఒకడు ‘ఏడవకుము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను’ (ప్రకటన 5:5). ‘వధించబడిన గొఱె -
హీరోయిన్గా అవకాశాలు లేక నోయల్ మాజీ భార్య..
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన వెయ్యి అబద్దాలు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్. ఆ తర్వాత సునీల్ సరసన 'భీమవరం బుల్లోడు సినిమాలో నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే సింగర్ నోయల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏడాది కూడా గడవక ముందే వారి పెళ్లి పెటాకులైంది. ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇరువురూ సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమతమ కెరియర్లో ముందుకు సాగారు. అయితే పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినా ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్భమ్స్లో నటించిన ఎస్తర్...కొన్ని పాటలు కూడా పాడింది. త్వరలోనే ఓ కన్నడ మూవీతో సంగీతదర్శకురాలిగానూ పరిచయం కానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్4న రివీల్ చేస్తానని వెల్లడించింది. View this post on Instagram A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) -
విడాకులు తీసుకున్నాం: నోయల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ర్యాపర్, టాలీవుడ్ నటుడు నోయల్ మంగళవారం అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. భార్య ఎస్తర్ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే డివోర్స్ కోసం దరఖాస్తు చేశామని, ఇన్నాళ్లు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసినట్లు తెలిపాడు. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎస్తర్ భవిష్యత్ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ నోట్ను షేర్ చేశాడు. ఇక ఎస్తర్ సైతం విడాకుల విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్ చేసి సుదీర్ఘ క్యాప్షన్ జతచేశారు.(చదవండి: నోయల్కు కరోనా: 'దీని గురించి తర్వాత మాట్లాడతా!') కాగా ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన 'వెయ్యి అబద్ధాలు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్- నోయెల్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా సఖ్యత చెడిందని రూమర్లు వినిపించాయి. ఇక ఈ రోజు నోయల్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో వదంతులు నిజమేనని నిరూపితమైంది. ఇక కెరీర్ విషయానికొస్తే ఎస్తర్ తెలుగు, తమిళ్, మరాఠీతో పాటు హిందీ సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అట్టహాసంగా ప్రారంభం కానున్న తెలుగు బిగ్బాస్ సీజన్ 4లో నోయెల్ పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక షో కోసం క్వారంటైన్లో ఉన్న అతడికి ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే నోయెల్ వాటన్నింటినీ కొట్టిపడేశాడు. View this post on Instagram I am Officially Divorced! After a long hard silence, today I officially announce my divorce with Ester. We were waiting for courts decision to make it public. We had our differences which led to this & finally we decided to end this only to save the grace of this beautiful relationship. God bless you Ester & may all your dreams come true, wishing you nothing but the best. I request everyone to be supportive of this at this point of time & help us to heal from it. It will always be a beautiful phase of my life & I thank God for each & every day in it. I request everyone not to bother her or my family in any ways & I want to thank my family,friends & everyone who stood by me in my dark days. But Yes God Is Good All The Time & I Believe This Is A Great New Beginning! God Bless! A post shared by Noel (@mr.noelsean) on Aug 31, 2020 at 9:27pm PDT -
గవర్నర్ ఈస్టర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునర్జన్మకు సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పర్వదినం జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈస్టర్ పండుగ సమాజంలో సానుకూల దృక్పథాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ పర్వదినం మనకు కరోనాపై పోరాడటానికి శక్తినివ్వాలని, సాధారణ జనజీవనం పునరుద్ధరించబడాలని ఈ సందర్భంగా గవర్నర్ అభిలషించారు. -
ప్రేమ పునరుత్థానం
చాలా ఏళ్ల కిందట ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒక చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకులు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చారు. విశ్వఖ్యాతిని ఆర్జించిన ఎందరో మహనీయుల కుంచెల నుంచి జాలువారిన అద్భుతమైన కళాఖండాలు, చిత్రపటాలు దానిలో ఉంచబడ్డాయి. వచ్చినవారంతా అక్కడ ఉంచబడిన వాటిని నిశితంగా పరిశీలిస్తూ ఆ చిత్రపటాలు ప్రతిబింబించే వింతైన విషయాలను శ్లాఘిస్తున్నారు. కొన్ని రోజులు ఆ చిత్రప్రదర్శన చక్కగా కొనసాగింది. చివరిరోజున కొంచెం రద్దీ పెరిగింది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చి కలియతిరిగి వారి దారినవారు వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఒక్కొక్క చిత్రపటాన్ని పరిశీలించుకుంటూ వచ్చిన ఒక యువకుడు ఒక మూల వేలాడదీసిన ఒక చిత్రపటాన్ని చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు. తన ముందున్న ఒక దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూడడం ప్రారంభించాడు. తనకు తెలియకుండానే కళ్ళు చెమర్చడం ప్రారంభించాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిన్న మూలుగు మొదలైంది.చెక్కిళ్ళ మీద నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ఏదో ఒక విషయం అతన్ని చాలా ఎక్కువగా కదిలిస్తోంది. చాలామంది అతన్ని దాటుకుంటూ ముందుకు సాగిపోయారు. తను మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోతున్నాడు. మధ్యాహ్నం గతించినా అక్కడే నిలబడి ఉన్నాడు. సాయంత్రం చిత్రప్రదర్శన ముగింపు సమయం వచ్చింది. నిర్వాహకుడు దగ్గరకు వచ్చి బయటకు వెళ్ళమని ఆ యువకుని కోరాడు. వెక్కివెక్కి ఏడుస్తూ ఆ యువకుడు బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని వేల చిత్రపటాలు ఉన్నప్పటికీ అతన్ని అంతగా కదిలించినదేమిటని ఆ నిర్వాహకుడు తన ముందున్న చిత్రపటాన్ని చూశాడు. దానిలో యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వ్రేలాడుతుండగా, అతని చేతుల్లో, కాళ్ళల్లో మేకులు కొట్టబడియున్నాయి. తలలో ముళ్ళకిరీటం ఉంది. ప్రక్కలో బల్లెపుపోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాటితో పాటు ఆ చిత్రపటంలో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ‘‘నేను నిన్ను ప్రేమించి నీ కోసం ఇదంతా చేశాను...నీవు నా కోసం ఏం చేశావు’’. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చిత్రపటాన్ని తదేకంగా చూస్తున్న యువకుడు ఈ మాటలనే ఆలోచించడం ప్రారంభించాడు. యేసు చేసిన త్యాగం అతన్ని కదిలించింది. అంతవరకు అధ్వాన జీవితాన్ని జీవించిన ఆ యువకుడు ఆ క్షణం నుంచి మంచివ్యక్తిగా జీవించడం ప్రారంభించాడు. మార్పు అనేది పరమాత్ముని గుండెల్లోనికి ఆహ్వానించడంతోనే ప్రారంభమౌతుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఓ ప్రముఖ వార్తా పత్రికలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న వ్యక్తుల జాబితా ప్రచురించింది. పురాతన, నవీన కాలాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిని గుర్తించారు. దానిలో మొదటి స్థానంలో యేసుక్రీస్తు ఉన్నారు. ‘ఆయన ఎక్కడో కుగ్రామమైన బేత్లెహేములో జన్మించినప్పటికీ ఆయన గురించి తెలియనివారెవరూ లేరు. తన జీవిత కాలంలో ఎన్నడు యుద్ధం చేయడానికి సైన్యాన్ని నడిపించలేదు... కానీ ఈనాడు అనేకుల హృదయాల్లో రాజుగా చోటు సంపాదించుకున్నారు. ఆయుధాలు ఎన్నడు ఉపయోగించలేదు... అయినా ప్రపంచాన్ని తన ప్రేమతో జయించాడు. మహోన్నతమైన జీవితాన్ని కోరుకొనేవారి కోసం క్రీస్తు ప్రభువు అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, కరుణ, త్యాగం, జాలివంటి దైవిక లక్షణాలను అలవరచుకోవడం ద్వారా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవచ్చునన్న సత్యం బోధపడింది. ఆయన జన్మ, జీవితం, బోధలు, మరణం, పునరుత్థానం ఎన్నో పాఠాలను ప్రపంచానికి నేర్పిస్తుంది. క్రీస్తు మరణం, పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది. సంవత్సరములో వచ్చే యాభై రెండు శుక్రవారాలలో ఒకదానిని శుభ శుక్రవారము (గుడ్ఫ్రైడే) అని పిలుస్తారు. ఆ రోజున యేసుక్రీస్తు సర్వమానవ పాప ప్రక్షాళన నిమిత్తం సిలువపై మరణించారు. పాపముల చేత, అతిక్రమములచేత బంధించబడిన మానవుని రక్షించడానికి, వ్యసనాల నుంచి విడిపించడానికి యేసు కలువరి సిలువపై మనిషి స్థానంలో ప్రాణమర్పించాడు. ఆ బల్యర్పణ ద్వారా సకలలోక ప్రజలకు దేవుని రక్షణ అందుబాటులోనికి వచ్చింది. క్షమాపణ కిరణాలు సిలువ నుంచి నలుదిశలా వ్యాపించాయి. దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తు ఊహించలేని ఆనందంతో జీవిస్తున్నారు. ప్రతి మంచి కార్యంవెనుక ఓ గొప్ప త్యాగం దాగిఉంటుంది. తమ బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఆశించే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలెన్నో మన కళ్ళముందున్నాయి. తండ్రి తన బిడ్డలమీద జాలిపడేలా దేవుడు కూడా తన రూపంలో సృష్టించబడిన మనుషుల మీద తన కనికరాన్ని, ప్రేమను ఎల్లవేళలా చూపిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మనుష్యాకారంలో వచ్చిన యేసు చేసిన కార్యాలన్ని తన అమూల్య ప్రేమను నిస్సందేహంగా వెల్లడించాయి. గలిలయ ప్రాంతంలో ఒక కొండమీద యేసు ప్రసంగించాడు. ఆ దివ్యసందేశం ఇప్పటికి అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంది. దానికి కొండమీద ప్రసంగం అంటారు. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను హింసించువారి కొరకు ప్రార్థించు, ఇతరులు నీకేమి చేయాలని నీవు ఆశిస్తావో వాటిని ఇతరులకు నీవు చేసి చూడు, నీ శత్రువులను కూడా ప్రేమించు’’ అని క్రీస్తు బోధించాడు. కేవలం వాటిని బోధించుటయే గాక క్రియల్లో వాటిని నెరవేర్చాడు. ఒకసారి ఒక కుష్టువ్యాధిగ్రస్తుడు ఆయన యొద్దకు వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ప్రార్థించాడు. తనకున్న వ్యాధిని బట్టి అతడు ఎవ్వరికి ఇష్టంగా లేడు అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. సమాజంచేత, ఉన్నతస్థితిలో ఉన్న మనుష్యులచేత చీదరించబడిన ఆ వ్యక్తిని ముట్టుకొని నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని చెప్పి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. అభాగ్యులను, అంటరానివారిని చేరదీసి అడుగడుగునా ప్రజలకు మేలుచేసి తన ప్రేమనంతా వారిమీద కుమ్మరించిన మహనీయుడు యేసుక్రీస్తు. అక్రమకారుల అన్యాయాలకు బలిపశువుగా మారి, విలవిలలాడవలసిన పరిస్థితులలో సైతం అత్యంత క్రూరాతి క్రూరంగా చిత్రవధ గావించబడియు ఆ కలువరి సిలువలో ఆయన పలికిన ఏడు ప్రాముఖ్యమైన మాటలు నిజంగానే ఆయన వ్యక్తిత్వం బహుశ్రేష్ఠమైనదని ఋజువుచేశాయి. ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు, చివరిమాటలు చాలా ప్రాధ్యాన్యతను సంతరించుకుంటాయి. మరణశయ్య నుంచి వెలువడే మాటలు కచ్చితంగా వారి మనసులో నుంచే వస్తాయనుటలో ఏ సందేహం లేదు. యవ్వనకాలంలోనే ప్రపంచాన్ని జయించి జగజ్జేతగా పిలువబడిన అలెగ్జాండరు తన చివరి సమయంలో కొన్ని నిజాలు మాట్లాడాడు. తన సమాధి పెట్టెకు రెండు రంధ్రాలు పెట్టి వాటినుండి తన రెండు చేతులు బయటకు వేయమన్నాడు. నేను ఈ భూమ్మీదకు ఒట్టి చేతులతో వచ్చాను...అవే ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని అందరికీ తెలియాలి. ప్రపంచాన్ని జయించినందుకు కాకపోయిన ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా అతనిని గ్రేట్ అని పిలవవచ్చు. ‘‘నా జీవితమే ఓ ప్రయోగాత్మకమైన హాస్యం’’ అని తనను గూర్చి తాను చెప్పుకున్న చార్లీ చాప్లిన్. మనిషి తన చరమాకంలో నిజాలు మాట్లాడుతాడు అనడానికి ఈ నిదర్శనాలు చాలవా? అయితే యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు విలక్షణమైనవి. క్షమాపణ, బాధ్యత, సంరక్షణ ఆయన చివరిమాటలో స్పష్టంగా గమనించగలము. ఓ దేవా! నేను పాపంలో జన్మించాను. పాపంలో జీవిస్తున్నాను. పాపంలో మరణిస్తున్నాను. నీవే శరణు కోరదగిన శరణాగత వత్సలుడవైతే నన్ను ఈ పాపము నుంచి విడిపించు అని నిత్యము ప్రార్థిస్తున్న మనిషిని విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. తన జీవిత చరమాంకంలో నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా నిరూపించగలరా అని ప్రశ్నించి తన పవిత్రతను, పరిశుద్ధతను నిరూపించుకున్నాడు. ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలన చేసి, ఏ పాపమును లోపమును కనుగొనలేకపోయిన సమాజం ఆయన అద్భుతాలు చేసి రొట్టెలు పంచితే కడుపునిండా భుజించిన భక్త సందోహం, నానావిధ రోగాలతో, వ్యాధులతో అణగారిపోయిన ఎన్నోవేల జీవితాలు ఆయన చూపుతో, స్పర్శతో, మాటతో స్వస్థతపొంది ఆనందడోలికలో ఊరేగించబడిన అభాగ్యులు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయన ప్రేమను, దైవత్వాన్ని రుచిచూసిన ప్రతిఒక్కరు ఒక్కసారిగా ఆయనకు శత్రువులుగా మారిపోయి ఆయనను సిలువమీదే కాకుండా‘‘సిలువవేయండని’’ అరవడం ద్వారా అక్కడే ఆయన మానసికంగా, ఘోరంగా గాయపరచినా క్రీస్తు తాను చేయాలనుకున్న కార్యము నుండి వెనుతిరుగలేదు.ఆయనను వెంబడించిన శిష్యుడే కాసులకొరకు ఆశపడి ఆయనను దొంగముద్దు పెట్టుకొని అమ్మివేస్తే, ఆ రాణువవారికి అప్పగిస్తే ప్రక్కలో అందరికి కనబడేటట్టు పొడవబడిన బల్లెపు పోటుకన్నా ఆ పని ఆయన గుండెల్లో దూసుకెళ్ళిన గునపపు పోటంత నొప్పయింది. నోరు తెరువక, చిరునవ్వుతో దుఃఖమునంతా పెదవి చాటున అదిమిపట్టి వారు పెట్టిన బాధలన్ని మౌనంగా భరించి... సిలువను మోసుకొని మేకులతో సిలువకు కొట్టబడి.... ఆ మండుటెండలో...ధారాపాతంగా ఒలుకుతున్న రక్తధారల సవ్వడిలో ...ఓ మాటకోసం నోరు తెరిచాడు క్రీస్తు. ∙∙ యేసుక్రీస్తు మరణించినప్పుడు ఎన్నో అద్భుత సంగతులు చోటుచేసుకున్నాయి. యెరూషలేము దేవాలయంలో ఒక పెద్ద తెర వ్రేలాడదీయబడి ఉంటుంది. సుమారుగా నాలుగు అంగుళాలు మందం కలిగిన ఆ తెర పై నుంచి కిందకు చిరిగిపోయింది. దేవుడే మనిషికి తనకు మధ్య ఉన్న తెరను తొలగించాడన్న సత్యం విశదపరచబడింది. దేవుని యొద్దకు చేరుకొనుటకు మార్గం ఏర్పడింది. సృష్టిలో విచిత్రమైన మార్పులు జరిగాయి. ఎవరైతే క్రీస్తు ప్రభువును సిలువవేయడానికి రోమన్ గవర్నరైన పిలాతు ద్వారా నియమించబడ్డాడో ఆ వ్యక్తి సిలువ ముందు మోకాళ్ళూని నీవు నిజముగా నీతిమంతుడవని ఒప్పుకున్నాడు. ఇతనియందు ఏ దోషము నాకు కనబడడంలేదని అంతకు ముందే తీర్పు తీర్చిన పిలాతు ఒప్పకోక తప్పలేదు. యేసుక్రీస్తు వ్రేలాడదీయబడిన సిలువపై ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే విలాసము ఉంచబడింది. ఆ వ్రాత ఆనాటి కాలంలో ప్రసిద్ధిగాంచిన హెబ్రీ, లాటిన్, గ్రీకు భాషల్లో వ్రాయబడింది. ఆవైపు వెళ్తున్న ప్రజలంతా దానిని చదవాలని అలా చేసారు. ఈ మూడు భాషలు క్రీస్తు యొక్క సర్వాధికారాన్ని సూచిస్తున్నాయి. క్రీస్తు సిలువపై మరణించాడనుటకు బైబిల్ ఆధారాలు మాత్రమే గాక చారిత్రక, శాస్త్రీయ ఋజువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని మనుష్యులందరి కోసం అర్పించాడు. త్యాగనిరతిని చాటిచెప్పాడు. నిజమైన ప్రేమను ఋజువు చేశాడు. అరిమతయియ యోసేపు మరియు నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువ నుంచి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిçస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునర్ అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. గుడ్ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంతోష ఆనందాలతో జరుపుకుంటారు. మరణాన్ని జయించిన క్రీస్తును కొనియాడుతూ ఆత్మలో పరశిస్తారు. యేసుక్రీస్తు ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. మొదటి శతాబ్దపు తత్వజ్ఞానుల్లో ఒకడైన పౌలు క్రీస్తు జీవితాన్ని సంపూర్తిగా అధ్యయనం చేసి ఇలా అంటాడు. ‘క్రీస్తు మృతులలోనుండి లేపబడియుండని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే’. వీరాధి వీరులు, శూరాధి శూరులు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు, గండపెండేరములు సంపాదించిన కవీశ్వరులు, విప్లవకారులు మరియు కళాకారులు ఎందరో మరణం ముంగిట తలవంచితే రెండువేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ముందు మరణమే తలవంచింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికీ ఫరోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫరోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది.క్రీస్తు పునరుత్థానము మనిషిలో ఉన్న భయాలను పోగొట్టింది. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోండంటూ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారవేత్త పిలుపునిచ్చాడు. ఆ పని జరిగిందో లేదో తెలియదు గానీ మనిషి మాత్రం భయం గుప్పెట్లోకి వెళ్ళిపోయాడన్నది గమనార్హం. ప్రతి మనిషి ఏదోక భయంతో అల్లాడిపోతున్నాడు. గత జీవితంలో చేసిన తప్పిదాల వలన, భవిషత్తులో ఏం జరుగబోతుందన్న ఆందోళన వలన, ఛిద్రమౌతున్న బంధాలను బట్టి మానవుడు విపరీతంగా కృంగిపోతున్నాడు. అన్నిటికన్నా మనిషిని భయపెట్టేది మరణం. కడపట నశింపచేయు శత్రువు మరణం. క్రీస్తు మరణాన్ని జయించి తిరిగిలేవడం వలన మరణం తరువాత కూడా మహోన్నతమైన జీవితం ఉందని ఋజువుచేశాడు. ఆదివారం ఉదయమున స్త్రీలు సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పూయాలని ఆశించగా వారక్కడ ఖాళీ సమాధిని చూశారు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచియున్నాడు. ఆకాశం భూమి గతించినా దేవుని మాటలు ఎన్నడును గతించవు. భయంతో వణికిపోతున్న స్త్రీలకు వచ్చిన వాగ్దానం ‘భయపడకుడి’. పునరుత్థానుడైన యేసు తనకు కనబడినవారికందరికి ఇచ్చిన శక్తివంతమైన వాగ్ధానం ఇదే. దేవుడు మనకు రక్షకుడుగా వెలుగుగా ఉంటాడు గనుక మనిషి భయపడనక్కరలేదు. భౌతిక ప్రపంచంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా భయం అనేది పతనానికి దారితీస్తుంది. సంకల్పశక్తి, మహాబల సంపన్నత దేవుని పాదాల చెంత లభిస్తుంది. సర్వశక్తుడు మనలో ఉన్న అచేతనాన్ని తన దివ్యశక్తి ద్వారా చైతన్యపరుస్తాడు. సూక్ష్మమైన పరమాణువులలో ఉన్న శక్తి చైతన్యపరచినప్పుడే గదా అపరిమితమైన శక్తి వెలువడుతుంది. ఇకపై వ్యాధులకు, బాధలకు, శోధనలకు, శత్రువైన సాతానుకు, భవిష్యత్తు కొరకు భయమక్కరలేదు. దేవుడు శాశ్వతకాలం తన ప్రజలతో ఉంటాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరుంది. దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. క్రీస్తు పునరుత్థానం ‘సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వతంగా సమాధి చేయలేరన్న సత్యాన్ని నిరూపించింది’. నేనే సత్యమని క్రీస్తు తెలియచేశాడు. శాస్తుల్రు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు, రోమన్లు అందరూ కలిసి క్రీస్తును హింసించి, సంహరించి సమాధిలో ఉంచారు. సత్యాన్ని సమాధి చేసేశాం అంటూ పండుగ చేసుకున్నారు. కానీ వారి అంచనాలు తలక్రిందులై పోయాయి. మరణపు మెడలు వంచుతూ, సమాధిని చీల్చుకుంటూ క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు. సమాధిముందు ఉంచబడిన రాణువవారుగానీ, రెండు టన్నుల రాయి గానీ క్రీస్తు ప్రభంజనాన్ని అడ్డులేకపోయాయి. అబద్ధం కొంతకాలమే మనిషిని ఊరిస్తుంది. సత్యం ఎప్పటికి నిలుస్తుంది. అంతిమ విజయం సత్యానిదే. క్రీస్తు పునరుత్థానం వలన సర్వలోకానికి శుభం కలిగింది. కలవరంతో, ఆందోళనతో నిండియున్న వారికి మీకు శుభమగును గాక అనే వాగ్దానం క్రీస్తు నుండి అందింది. తన భక్తులతోను తన ప్రజలతోను దేవుడు శుభవచనం సెలవిస్తాడు అనేది బైబిల్ వాగ్దానం. దేవుడు మంచివాడు గనుక తనను ఆశ్రయించినవారికి తప్పకుండా మంచి చేస్తాడు. సర్వశక్తుడు ఏ ఒక్కరికీ కీడు చేయడు. సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు మానవుడు అనుభవిస్తాడు. దేవుడు తన బిడ్డల అవసరాలు తీర్చువాడు. తన దివ్యానుభూతితో, మధురాతిశయంతో, ఆనంద పారవశ్యంతో నింపేవాడు. ఆయన పాదాలను తేరి చూచేవారికి ఏలోటూ లేదు. ఉండదు కూడా. ఆయన దివ్య తేజస్సును మనసారా ఆస్వాదించడమే జీవిత పరమార్థం. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతుంది. శాంతిగా బ్రతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బ్రతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తూ ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియనివారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థ జీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. మార్పు అనేది ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి ద్వారా ప్రారంభమవ్వాల్సిందే కదా. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే.ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. గమ్యాన్ని చేరుకోలేనేమోనన్న భయం వెంటాడుతుంది. తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలువబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను... దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికి బెదిరిపోడు... చింతించడు’. ‘తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. ఇశ్రాయేలు దేశంలో ఝెరూషలేములో యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. నిరాశ నిస్పహలతో అంతమొందే మానవ జీవితానికి ఈ ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుత్థానం గొప్ప నిరీక్షణ యిస్తున్నది. నా కొరకు ఒకరు మరణించడమే కాదు నన్ను బలపరచి నాకు ఎల్లప్పుడు తోడుగా వుండటం కొరకు మరణాన్ని కూడా జయించి తిరిగి లేవడమనేది ఎంత ఆశాజనకమైన, ఆనందకరమైన భావన!!! చివరగా ఒక్కమాట! భవిష్యత్తుమీద భయంతో, కలవరంతో జీవిస్తున్న ప్రియ మిత్రమా! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం పరలోకాన్ని విడచివచ్చి నీ స్థానాన్ని సిలువలో తీసుకొని నీకు బదులుగా మరణించాడు. దేవుడు నీకేం ఇచ్చాడని ఎవరైనా ప్రశ్నిస్తే ‘నా దేవుడు నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు’ అని చెప్పగలగడం ఎంత గొప్ప విషయం. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కొని నిరాశలో జీవిస్తున్నావా? కీడు జరుగుతుందేమోనన్న భయం నిన్ను వేదిస్తుందా? అయితే క్రీస్తు నామాన్ని స్మరించు. మధుమధురమైన ఆయన నామ స్మరణ నీకు అన్ని విషయాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. మరణాన్ని జయించిన క్రీస్తు సమస్త విషయాల్లో నిన్ను ఆశ్వీరదించగలడు. కీడు నీ పాదాలను తాకకముందే నిన్ను తన కౌగిట్లోకి లాక్కుంటాడు. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని చెప్పి నిన్ను ఊరడిస్తాడు. అంతులేని ఆనందంతో తేలియాడతావు. మహోన్నతుడైన దేవుడు నీ పట్ల కలిగియున్న ప్రణాళికలను గుర్తించి పరవశిస్తావు. నిరాశ చీకట్లు తొలగిపోయి ఆధ్యాత్మిక జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి. ప్రతి ఒక్కరికి గుడ్ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. క్షమాపణ సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు పలికిన మొదటి మాట.‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’... ఇది దైవిక క్షమాపణ ఔన్నత్యాన్ని తెలిపే మాట. దేవుడు మనలను క్షమించువాడు. మనిషికి నిజమైన ఆనందం క్షమాపణ ద్వారానే లభిస్తుంది. కొన్నిసార్లు మనిషిచేసిన తప్పులను, పాపాలను సొంత కుటుంబ సభ్యులే క్షమించలేకపోవచ్చు. మానవుని క్షమాపణకు కొన్ని సరిహద్దులుంటాయి. దేవుని క్షమాపణ అవధులు లేనిది. తనను అతి క్రూరంగా హింసించిన వారిని, శ్రమపెట్టిన వారిని సైతం క్షమిస్తున్న ప్రేమ దేవునిది. నీవు దేవుని కుమారుడవైతే సిలువ దిగిరా నిన్ను నమ్ముతాం అనే సవాళ్ళు వినబడుతున్నా...నీవు రాజువట గదా ఈ మాత్రం గౌరవం చాలా? లేక ఇంకా ఎక్కువ కావాలా అనే హేళన మాటలు తూటాలా గుచ్చుకుంటున్న వేళ క్రీస్తు పలికిన ఈ మా మానవ ఊహకు అందనిది. మిమ్మును హింసించువారికోసం ప్రార్థించండి అని తాను చేసిన బోధను ఆచరణలో పెట్టిన ఆయన మనస్సు ఎంత ఉత్తమమైనది. చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో తాము చేస్తున్న ఆధ్యాత్మిక మరియు సాంఘిక కార్యక్రమాలకు కృతజ్ఞత తెలపడానికి బదులు అతి కిరాతకంగా గ్రాహవ్ు స్టెయిన్స్ మరియు ఆయన ఇద్దరు కుమారులను పొట్టన పెట్టుకున్న వ్యక్తులను నేను మనసారా క్షమిస్తున్నాను అని చెప్పిన గ్లాడిస్కు స్ఫూర్తి క్రీస్తు సిలువలో పలికిన మాట కాదంటారా? ఒక మనిషిని తోటి మనిషి క్షమించకపోవచ్చు. చట్టాలు, వ్యవస్థలు క్షమించకపోవచ్చు గానీ దేవుని పాదాల చెంతకు వచ్చి ఆ తప్పిదాలను, పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. తన శాంతితో, సమాధానంతో నింపుతాడు. రక్షణ సిలువలో క్రీస్తు పలికిన రెండవ మాట ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’. ఇది రక్షణ ప్రాముఖ్యతను తెలిపే మాట. కలువరిగిరిపై క్రీస్తు సిలువవేయబడినప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు వ్రేలాయవేయబడ్డారు. వాస్తవానికి యేసుక్రీస్తు బరబ్బా అనే బందిపోటు స్థానంలో వ్రేలాడవేయబడ్డాడు. ఎడమప్రక్కన సిలువవేయబడినవాడు క్రీస్తును దూషించాడు. అయితే కుడి ప్రక్కన సిలువవేయబడిన దొంగ పశ్చాత్తాపంతో క్రీస్తును వేడుకున్నాడు. మరణం తరువాత మరొక జీవితం ఉందని...ఆ రాజ్యాన్ని క్రీస్తు ప్రభువు ప్రసాదించగలడని నమ్మి యేసూ! నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అంత వేదనలో సైతం అతని పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలుకు శుభకరమైన జవాబిచ్చి... తన పరదైసులో చోటిస్తానని వాగ్దానం చేసాడు. పశ్చాత్తాపపడితే ఎంతటి హీనులనైనా తన అద్భుత రాజ్యంలో చోటుందని ప్రకటించాడు. చుట్టూ ఉన్నవారు ఎంతో సేపటి నుంచి ఏవేవో చేయమని అడిగారు. ఎడమవైపున వ్రేలాడదీయబడినవాడు కూడా రక్షించమని అడిగాడు. వారి ప్రార్థనలకు, విన్నపములకు జవాబు రాకపోవడానికి కారణం అవి హృదయపు లోతుల్లోనుండి వచ్చినవి కావు. ఒక మనిషి చేసే యథార్ధమైన మరియు నిస్వార్థమైన ప్రార్థనలకు క్రీస్తు దగ్గర ఎప్పుడూ ఓ గొప్ప సమాధానం సిద్ధంగా ఉంటుంది. కరడు కట్టిన ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభువు వెంటనే రక్షణ ప్రసాదించాడు. అది శరీర సంబంధమైనది కాదు. ఆత్మ రక్షణ ప్రసాదించాడు. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థము. రక్షణ అనగా శిక్ష నుంచి తప్పించబడుట. నశించినదానిని వెదకి రక్షించుటకు తాను ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని యేసు ఆయా సందర్భాల్లో «ధ్రువీకరించాడు. బాధ్యత సిలువలో క్రీస్తు పలికిన మూడవ మాట ‘‘అమ్మా ఇదిగో నీ కుమారుడు! శిష్యునితో ఇదిగో నీ తల్లి’’. ఇది సంబంధ బాంధవ్యాలను తెలిపే మాట. ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయవద్దు, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేవి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న విశిష్ట సత్యాలు. అంత అధికమైన సిలువ శ్రమలో సైతం తనకు శారీరకంగా జన్మనిచ్చిన తల్లికి ఆదరణ కనుపరచి ఆమె యెడల బాధ్యతను వ్యక్తం చేశాడు. ఎడబాటును తట్టుకోలేక దుఃఖిస్తున్న తన తల్లికి ఆదరణిచ్చాడు. తనకు ప్రాణప్రదంగా ప్రేమించిన శిష్యుణ్ణి అనా«థగా వదలక తన తల్లినే అతనికి తల్లిగా అందించాడు. తనను నమ్మకంగా వెంబడించి, తన చిత్తాన్ని నెరవేర్చేవారిని అనాథలుగా చేయనని వారిని ఆదుకొనే దేవుడనని ఋజువుచేశాడు. తల్లిదండ్రుల ఆస్తులను చేజిక్కించుకొని వారిని నడిరోడ్డుల మీదనో, వృద్ధాశ్రమాల్లోనో విడిచి వారి బాగోగులు పట్టించుకోని మూర్ఖస్వభావులకు క్రీస్తు చూపిన మార్గం ఎంతో గొప్పది. సహవాసం సిలువలో పలికిన నాల్గవ మాట ‘నాదేవా! నాదేవా! నన్నెందుకు చేయి విడిచితివి’. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవితం అత్యంత విలక్షణమైనది. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సిలువమీద శ్రమనంతటిని సంపూర్ణ మానవుడుగా అనుభవించాడు. ఏ బేధము లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవుచున్నారు. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మనిషిని పతనం చేసింది. దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా మానవుడు ఎడబాటును అనుభవిస్తున్నాడు. అందువలననే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనిషికి నిత్యానందము లభించుట లేదు. ఆ సందర్భంలో క్రీస్తు సర్వలోక పాపములన్నింటినీ భరిస్తున్నాడు. ఆయన పాపి కాదుగాని మనుష్యులందరి కోసం పాపముగా చేయబడ్డాడు. పాపము ద్వారా ఏర్పడిన భయంకరమైన ఎడబాటు తీవ్రతను క్రీస్తు వ్యక్తం చేశాడు. తండ్రికి తనకు వున్న అన్యోన్యత పాపియైన మానవుని రక్షించే కార్యముతో తెగిపోవుటతో ఎంతో వ్య«థకు గురై తన తండ్రికి తనకు వున్న సంబంధాన్ని, ఆయన చిత్తము చేయుటలో తను చూపించిన ఆ కర్తవ్యాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేయగలిగాడు. దేవునితో సహవాసము కలిగియుండుటకు మానవుడు కోరిక కలిగియుండాలన్న సత్యాన్ని యేసు విశదీకరించాడు. మానవునికి దేవునితో సత్సంబంధం ఎంతో అవసరం. పరమాత్ముని కృప మరియు సహకారం లేకుండా మనిషి ఏమియు చేయలేడు. సహనం సిలువలో క్రీస్తు పలికిన ఐదవ మాట ‘‘దప్పిగొనుచున్నాను’’. సమరయలోని సుఖారు అను గ్రామంలో పాపపు వాంఛ కలిగిన స్త్రీతో యేసు మాట్లాడుతూ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెన్నడు దప్పిగొనడు అని చెప్పాడు. మరి సిలువలో ఆయకున్న దాహం ఏమిటి? శారీరకంగా యేసుకు దాహం ఉంది. గెత్సెమనే తోటలో ఆయన్ను పట్టుకున్న దగ్గర నుండి ఎంతో భయంకరంగా హింసించారు. యెరూషలేము రోడ్లమీద సిలువను మోస్తూ అతి తీవ్రంగా అలసిపోయాడు. ఆ సమయంలో దాహం సహజమే. అయితే శారీరక దాహం కన్నా యేసులో మరొక దాహం ఉంది. మనుష్యులందరూ పాపపు సంకెళ్ళ నుంచి విడుదల పొందాలనే కోరిక. సమసమాజ నిర్మాణం జరగాలన్న ఆకాంక్ష. మమతాను రాగాలతో ప్రజలంగా వర్ధిల్లాలనే ఆశ. శాపపు కాడి నుండి ప్రతి ఒక్కరూ విడుదల పొంది స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే కోరిక. కుల మత వర్గ బేధాలు లేకుండా ప్రజలంతా శాంతి సంతోషాలతో జీవించాలనే తపన. విజయం సిలువలో క్రీస్తు పలికిన ఆరవ మాట ‘సమాప్తమైనది’. అందరూ క్రీస్తు జీవితం సమాప్తమైనదని తలంచారు. లోకరక్షణార్థం తాను చేయాలనుకున్న పుణ్యదానం సమాప్తమైనది. మనుష్యులందరి కోసం దేవుడు తలపెట్టిన నిత్య బలియాగం సంపూర్తి చేయబడింది. సృష్టికర్తయైన తాను ఏ ఉద్దేశంతో సృష్టిగా మారి వచ్చాడో ఆ కార్యం నెరవేరింది. సిలువపై తాను మరణించుట ద్వారా మనిషికున్న దాస్య శృంఖలాలు తెగిపోయాయి. విరోధియైన అపవాది తల చితికిపోయింది. శత్రు బలమంతటి మీద అఖండ విజయం అనుగ్రహించబడింది. మనిషి దుఃఖానికి, నిట్టూర్పులకు ముగింపు లభించింది. గోనెపట్టలు విప్పబడ్డాయి. సంతోష వస్త్రాలు బహుకరించబడ్డాయి. నిర్లక్ష్యం, నిర్లిప్తత తొలగిపోయాయి. ఆనందం సిలువలో క్రీస్తు పలికిన ఏడవ మాట ‘తండ్రి ! నా ఆత్మను నీకప్పగించుకొనుచున్నాను’. దేవుడు మనిషిని ఎంతగా తనకు దగ్గరగా చేర్చుకున్నాడో తెలియచేసే మాట. క్రీస్తునందు విశ్వాసముంచు ఎవ్వరైనా సర్వోన్నతుడైన దేవున్ని తండ్రీ అని సంబోధించవచ్చును. ఇది విడదీయరాని ఓ అనిర్వచనీయమైన బంధం. పన్నెండు సంవత్సరాలు రక్తస్రావరోగంతో బాధపడుచున్న స్త్రీని యేసు కుమారి అని సంబోధించాడు. అది ఆమెకు ఎంతో ఊరటనిచ్చిన పిలుపు. మానవుడు అనగా పైకి కనిపించే శరీరం కాదు. వాస్తవానికి మానవుడు ఆత్మయై యన్నాడు. అతనికి ప్రాణం ఉంది. ఆత్మ, ప్రాణం శరీరంలో నివశిస్తున్నాయి. ఏనాడైనా శరీరం మృతమైతే ఆత్మ నిత్యత్వంలో నిత్యజీవం, నిత్యనరకం అనే రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి చేరుకోవాలి. ఈ భూమ్మీద ఉండగానే మానవుడు దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో సహవాసం చేస్తే నిత్యత్వంలో ఆయనతో యుగయుగాలు జీవిస్తాడు. ఇది శుభకరమైన నిరీక్షణ. -
సునీల్ బర్త్ డే పన్ క్షన్