-
బడా నిర్మాతకు సెబీ షాక్.. ఈరోస్ ప్రమోటర్లపై నిషేధం
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షాకిచ్చింది. కంపెనీ, ప్రమోటర్లతోపాటు.. ఎండీ సునీల్ అర్జన్ లుల్లా, సీఈవో ప్రదీప్ కుమార్ ద్వివేదిపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. నిధుల అక్రమ మళ్లింపు అభియోగాల కేసులో సెక్యూరిటీల మార్కెట్ల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లుల్లా, ద్వివేదిలను ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా యాజమాన్య సంబంధ ఏ విధమైన పదవినీ చేపట్టకుండా నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ఈరోస్ ఇంటర్నేషనల్సహా అనుబంధ సంస్థలలోనూ పదవులు నిర్వహించకుండా కొరడా ఝళిపించింది. ఇక ప్రమోటర్ సంస్థలు ఈరోస్ వరల్డ్వైడ్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ, ఈరోస్ డిజిటల్ ప్రయివేట్ లిమిటెడ్కూ నిషేధం వర్తించనున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు నిధుల అక్రమ తరలింపునకు సహకరించాయన్న ఆరోపణలతో దింక్ఇంక్ పిక్చర్జ్ లిమి టెడ్, మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, స్పైసీ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా లిమిటెడ్ పుస్తకాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్ను నియమించవలసిందిగా బీఎస్ఈని సెబీ ఆదేశించింది. మూడు నెలల్లోగా ఫోరెన్సిక్ ఆడిటర్ సెబీకి నివేదికను దాఖలు చేయవలసి ఉంటుంది. -
ఈరోస్ లైబ్రరీ ఆపిల్ కొనబోతుందా!
ముంబయి: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ గ్రూప్ వివిధ సినిమాలకు, సంగీతానికి సంబంధించిన కంటెంట్ లైబ్రరీని విక్రయించనుంది. ఇందుకోసం ఆ సంస్థ ఇప్పటికే ఆపిల్ సంస్థతో ప్రాథమిక చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిని కొనుగోలు చేసేందుకు అమెజాన్, నెట్ఫ్లిక్స్వంటి సంస్థలు కూడా వరుసలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఆ చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని సదరు సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈరోస్ తన కంటెంట్ లౌబ్రరీ దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందంట. అయితే, ప్రస్తుతం దీనిపై తాము ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమంటూ ఇటూ ఆపిల్ సంస్థ అలాగే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు తెలిపాయి. అవన్నీ వదంతలు, ఊహాగానాలు అంటూ కొట్టి పడేశాయి. అయితే, ఇది ప్రైవేటు వ్యవహారం కావడంతో దీనిపై బహిరంగ ప్రకటన చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకసారి ఈ కంటెంట్ లైబ్రరీ విక్రయించిన తర్వాత యూరోస్ డిజిటల్ కంటెంట్కూడా కొనుగోలు దారుల చేతుల్లోకి వెళ్లిపోనుందట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement