-
ఎంత క్యూట్గా రిక్వెస్ట్ చేశాడో..!
చిన్న పిల్లలతో విమానయానం చేసే వారి కష్టాలు చూడాలి. పాపం అనిపిస్తుంది. మాటలు రాని వయసులో ఆకలి, బాధ వంటి వాటిని ఏడుపు ద్వారానే తెలియజేస్తారు చిన్నారులు. కానీ అర్థం చేసుకోలేని వారు ఏంటీ గోళ అని విసుక్కుంటారు. అంతటితో ఊరుకోక ప్రయాణం మధ్యలోనే దించేస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలను చాలానే చూశాం. వీటి గురించి ‘లోకం తెలయని పిల్లలు.. కాస్తా ఓపిక పడితే ఏం పోతుంద’ని కొందరు.. ‘పిల్లలు ఏడుస్తూంటే ఇబ్బందిగా ఉండదా’ అని మరి కొందరు వాదించారు కూడా. ఏం చేస్తాం రెండు నిజమే. అయితే ఈ సమస్యను కాస్తా సృజనాత్మకంగా పరిష్కరించింది ఓ తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మహిళ తన నాలుగు నెలల పసికందుతో కలిసి అమెరికా వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్నారి వల్ల కలిగే ఇబ్బందిని పెద్ద మనసుతో అర్థం చేసుకోండంటూ కోరుతూ.. క్యాండీస్,ఇయర్ప్లగ్స్ ఉన్న ప్యాకెట్ను తోటి ప్రయాణికులకు పంచింది. ఇలా విమానంలోని దాదాపు 200 మంది ప్రయాణికులకు ఈ బ్యాగ్స్ను అందజేసింది. గిఫ్ట్ ప్యాక్ల కంటే కూడా వాటి మీద ఉన్న స్టోరి ప్రయాణికులకు తెగ నచ్చింది. గిఫ్ట్ ప్యాక్ మీద ‘హలో.. నా పేను జున్వూ.. నా వయసు నాలుగు నెలలు. ఈ రోజు నేను మా అమ్మ, నానమ్మతో కలిసి మా ఆంటీని చూడ్డానికి అమెరికా వెళ్తున్నాను. ఇదే నా తొలి విమానయానం. అందువల్ల కాస్తా నెర్వస్గా, భయంగా ఫీలవుతున్నాను. సో నాకేమన్నా ఇబ్బందిగా అనిపించినప్పడు ఏడుస్తాను.. బాగా గొడవ చేస్తాను. వెంటనే ఏడుపు ఆపేస్తానని మీకు ప్రామిస్ చేయలేను. ముందు జాగ్రత్తగా మా అమ్మ ఈ గిఫ్ట్ ప్యాక్లను మీకు ఇస్తుందన్నమాట. నేను బాగా గొడవ చేసినప్పుడు మీకిచ్చిన ప్యాకెట్లో ఉన్న ఇయర్ప్లగ్స్ను వాడండే. మీ ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటూ చిన్నారి జున్వూ’ అని ఉంది. ఈ స్టోరిని ఫేస్బుక్లో షేర్ చేసిన డేవ్ కరోనా ఆ 200 మంది ప్రయాణికుల్లోఒకరు ఉన్నారు. ఈ తల్లి ప్రయత్నం నా హృదయాన్ని హత్తుకుందన్నారు కరోనా. అంతేకాక గిఫ్ట్ ప్యాక్ల మాట ఏమో కానీ.. జున్వూ రిక్వెస్ట్ మాత్రం ప్రయాణికులకు తెగ నచ్చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం జున్వూ సోషల్ మీడియాలో చిన్న సైజు హీరో అయ్యాడు. ‘చాలా మంచి ప్రయత్నం’.. ‘విమానంలో ప్రయాణించే వారు చిన్నారుల పట్ల కాస్త దయగా వ్యవహరిస్తే బాగుంటుందం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
సమ్మర్లో స్విమ్మింగ్ అంటే అందరికీ ఇష్టమే.. మరి జాగ్రత్తలు?
స్విమ్మింగ్కు వెళ్లే వారు చెవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చెవుల్లోకి ప్రవేశించి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్ప్లగ్స్ పెట్టుకోవాలి. ఈత పూర్తయ్యాక పొడిబట్టతో చెవులు శుభ్రం చేసుకోవాలి. స్విమ్మింగ్పూల్స్లో క్రిమిసంహారిణిగా క్లోరిన్ వంటి రసాయనాలు కలుపుతుంటారు. ఈ క్రిమిసంహార రసాయనాలు కొందరి చర్మంపై దుష్ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. ఈత కొట్టే సమయంలో చాలా మంది మునిగి ఈత కొడుతూ నీళ్లలోపల కళ్లు తెరుస్తుంటారు. సాధారణంగా దీని వల్ల సమస్య లేకపోయినా... ఒక్కోసారి నీళ్లను శుభ్రంగా ఉంచేందుకు వాడే క్లోరిన్ వంటి రసాయనాలు కళ్లలోకి వెళ్లడం వల్ల కంటికి మంట రావచ్చు.ఒక్కోసారి బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రత వల్ల కూడా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి. నీళ్లలో ఎక్కువసేపు నానుతూ ఉండటం వల్ల శరీరంలోని లవణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటిప్పుడు చర్మం ముడతలు పడిపోయే అవకాశాలు ఉండవచ్చు. దీన్ని నివారించాలంటే ఈత పూర్తయిన వెంటనే చర్మానికి మాయిష్చరైజింగ్ క్రీమ్ రాయాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement