breaking news
e85 fuel
-
భారత్లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..
భారతదేశం పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కొన్ని వాహన తయారీ సంస్థలు కూడా ఇథనాల్ వినియోగానికి సరిపడే వెహికల్స్ తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇప్పటికే మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లను లాంచ్ చేశాయి. ఈ బైక్లు E20 నుంచి E85 వరకు (20% నుంచి 85% వరకు ఇథనాల్ కలిగిన ఇంధనం) ఉపయోగించగలవు.ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లకు కంపెనీలు ప్రత్యేకమైన ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ భాగాలు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చాయి. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న నాలుగు ఈ85 బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హీరో స్ప్లెండర్ ప్లస్ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్సైకిళ్లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. దీని ధర రూ. 82,710 (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ స్ప్లెండర్ మోడల్ ఆధారంగా రూపొందించినప్పటికీ, ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఇంధన వ్యవస్థ, ఇంజిన్ నిర్వహణ, కొన్ని విడిభాగాల్లో మార్పులు చేశారు. ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని సమాచారం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా స్ప్లెండర్ మాదిరిగానే 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇది కూడా E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది. ఈ బైక్ ధర రూ. 72,792 (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చవకైన ఈ85 మోటార్సైకిళ్లలో ఇది ఒకటి.సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250సుజుకి సంస్థ కమ్యూటర్ విభాగానికే మాత్రమే కాకుండా.. ప్రీమియం సెగ్మెంట్లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అందించింది. ఇందులో భాగంగానే కంపెనీ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకును ఇథనాల్తో పనిచేసాల రూపొందించింది. ఇది 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ.2,00,896 (ఎక్స్ షోరూమ్).యమహా ఎఫ్జెడ్ బ్లూయమహా కంపెనీ జూలై 2026లో ఎఫ్జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడల్ను లాంచ్ చేయడంతో.. భారత ఫ్లెక్స్ ఫ్యూయల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఎఫ్జెడ్ ప్లాట్ఫారమ్ ఆధారంగా నిర్మితమైంది. ఈ బైక్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించగలదు. ఇందులో 149 సీసీ సింగిల్ సిలిండర్ బ్లూ కోర్ ఇంజిన్ అమర్చారు. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). -
ఈ85 పెట్రోల్ ఇంకా చౌక.. ఎంత తక్కువంటే..
దేశంలో ఇథనాల్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. E85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెడుతోంది. E85 ఫ్యూయల్ ధర E20 పెట్రోల్తో పోలిస్తే లీటరుకు సుమారు రూ.20 తక్కువ ఉండే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.అయితే ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చమురు సంస్థల 48 పెట్రోల్ బంకుల్లో E85 విక్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.సీఎన్ఎన్-న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధార పడటాన్ని తగ్గించడం, దేశీయ ఇథనాల్ ఉత్పత్తికి ఊతమివ్వడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇథనాల్ మిశ్రమాలపై నడిచే వాహనాలకు వారంటీ, బీమా వంటి అంశాలపై ఉన్న సందేహాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.E20పై అపోహలు అవసరం లేదుE20 పెట్రోల్ వాడితే ఇంజిన్ దెబ్బతింటుందనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. కోట్లాది ద్విచక్ర, లక్షలాది నాలుగు చక్రాల వాహనాలు ఇప్పటికే E20పై ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా నడుస్తున్నాయని, వాహన తయారీ సంస్థలు కూడా యాంత్రిక లోపాలపై విస్తృతంగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. ఇథనాల్ వల్ల మైలేజ్లో స్వల్ప తగ్గుదల ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, తక్కువ కార్బన్ ఉద్గారాలు, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం వంటి ప్రయోజనాలు మరింత ముఖ్యమని వివరించారు.E25 ఇంకా పరీక్షల దశలోనే..ఇక E25 (25 శాతం ఇథనాల్ మిశ్రమం)ను వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విస్తృత పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు వచ్చిన తర్వాత వాహన తయారీ సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చించి మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాబట్టి E25 వాణిజ్య విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకూ సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యాలతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. -
పెట్రోల్ కన్నా రూ.20 తక్కువ.. ఈ85 ఇంధనం
న్యూఢిల్లీ: ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల కోసం దేశీయంగా ఈ85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియన్ఆయిల్ రిటైల్ ఔట్లెట్లో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీన్ని ఆవిష్కరించారు.సాధారణ పెట్రోల్తో పోలిస్తే దీని ధర లీటరుకు రూ. 20 మేర తక్కువకే లభిస్తుంది. ప్రాథమికంగా ఇది ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజిన్లున్న వాహనాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. తొలుత 48 ప్రభుత్వ రంగ బంకులతో ప్రారంభించి 2026 డిసెంబర్ నాటికి 500 ఔట్లెట్స్లో, 2027 డిసెంబర్ నాటికి 5,000 ఔట్లెట్స్లోను అందుబాటులోకి తెస్తారు.80–85 శాతం ఇథనాల్, 14–19 శాతం పెట్రోల్ ఉండే మిశ్రమ ఇంధనాన్ని ఈ85గా వ్యవహరిస్తారు. ఈ20 నుంచి ఈ100 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పని చేసే ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలకు ఇది అనువుగా ఉంటుంది.


