-
AP: ఇక ‘ఈ–పాఠశాల’.. విద్యా రంగంలో మరో విప్లవాత్మక ముందడుగు
సాక్షి, అమరావతి: విప్లవాత్మక సంస్కరణలతో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోనుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్ అందిస్తున్న ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీఈఆర్టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్ను సిద్ధం చేయిస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్ను రూపొందించే పనిలో ఎస్సీఈఆర్టీ నిమగ్నమైంది. ప్రస్తుతం 4వ తరగతి నుంచి నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు బైజూస్ సంస్థ ద్వారా కంటెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎస్సీఈఆర్టీ అదే తరహాలో ఈ–కంటెంట్ను సిద్ధం చేయిస్తోంది. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్సీఈఆర్టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ద్వారా ఈ– కంటెంట్ను సిద్ధం చేయిస్తోంది. దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్ఫారం, ఐఎఫ్బీ ప్లాట్ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్ చానెల్)లో అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రకమైన కంటెంట్ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్ను రూపొందించి యూట్యూబ్లో పెడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు కొంత సంశయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే అన్ని అధికారిక చానెళ్లలో ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఈ–కంటెంట్ను అందుబాటులో ఉంచనుంది. బైజూస్ ఈ–కంటెంట్ ఉన్నా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే ఇది నాన్ లాంగ్వేజెస్ (మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్)కు మాత్రమే పరిమితమైంది. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ–కంటెంట్ను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించింది. వీరు 10వ తరగతి వరకు ఈ–కంటెంట్ పాఠ్యాంశాలను ట్యాబుల్లోనే చదువుకోవచ్చు. అయితే బైజూస్ ద్వారా లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఈ–కంటెంట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈసీఆర్టీ) ద్వారా లాంగ్వేజ్ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) కూడా ప్రభుత్వం ఈ–కంటెంట్ను సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా ముందు 8వ తరగతిలో లాంగ్వేజ్ సబ్జెక్టులకు ఈ–కంటెంట్ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను చేపట్టిన ఎస్సీఈఆర్టీ మరో రెండు నెలల్లో దీన్ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత వరుసగా 9, 7, 6 తరగతులకు రూపొందిస్తారు. 10వ తరగతికి 2024–25లో సిలబస్ మారుస్తామని.. ఆ తర్వాత ఈ–కంటెంట్ను రూపొందిస్తామని ఎస్సీఈఆర్టీ అధికారులు వివరించారు. వచ్చే ఏడాది నాటికి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్కు అనుగుణంగానే పాఠ్యాంశాలు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఎన్సీఈఆర్టీ సిలబస్కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పాఠ్యాంశాలు ఉండేలా ఎస్సీఈఆర్టీ చర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెనుకబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ఈ–కంటెంట్ రూపకల్పనలో యథాతథంగా అనుసరిస్తున్నారు. జాతీయ కరిక్యులమ్ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేటప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరాగా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు. చదవండి: ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభం -
తర‘గతి’ లేకున్నా పట్టదా?
పాఠశాల ఆవరణలో భవనం కుట్టుశిక్షణకు కేటాయింపు వరండాలో చదువుతో అవస్థలు పడుతున్న విద్యార్థులు ప్రజాప్రతినిధి పంతానికి తలవంచిన కార్పొరేషన్ అధికారులు విద్యాకమిటీ కాదన్నా... తల్లిదండ్రులు వద్దన్నా... హెచ్ఎం అభ్యంతరం చెప్పినా... చివరకు ప్రజాప్రతినిధి పంతమే నెగ్గింది. తరగతి గదిలేక పిల్లలు ఎండ వేడిమి, వర్షం తాకిడి తట్టుకుంటూ వరండాలోనే చదువుతున్నా పట్టించుకోకుండా ఖాళీగా ఉన్న హాలును ఓ కుట్టు శిక్షణ కేంద్రానికి కేటాయిస్తూ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీస్తోంది. ఇలా అయితే టీసీలు తీసుకుని వెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా బేఖాతరు చేస్తూ అధికారులు ఆ ప్రజాప్రతినిధిని సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యం ఇచ్చిన తీరు వివాదానికి ఆజ్యం పోస్తోంది. కాకినాడ : కాకినాడ రామకృష్ణారావుపేటలో మదర్థెరిస్సా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవలే ఈ స్కూల్ను ఈ – పాఠశాలగా ప్రకటించి ఆధునిక విద్యాబోధనకు కూడా శ్రీకారం చుట్టారు. 5 కేఎన్ కంప్యూటర్లు కూడా సమకూర్చారు. ఒకప్పుడు తెలుగు మీడియం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. దీంతో గత ఏడాది వరకు 90మందికి మించని ఈ పాఠశాలలో ప్రస్తుతం 153 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. 5వ తరగతి విద్యార్థులకు స్కూల్ వరండాలో విద్యాబోధన చేస్తున్నారు. కమ్యూనిటీ హాలు ఖాళీగా ఉన్నా.. స్కూల్ ఆవరణలో ఒకప్పుడు కమ్యూనిటీ హాలుగా వినియోగించిన భవనం ఖాళీగా ఉంది. ఈ భవనంలో ఐదవ తరగతి గది నిర్వహించుకునేందుకు హెచ్ఎం సీహెచ్ విజయలక్ష్మి కమిషనర్కు ప్రతిపాదనలు కూడా పంపారు. లెక్కచేయక... కుట్టు శిక్షణకు మొగ్గు విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఆ ప్రాంగణాన్ని కుట్టు శిక్షణ కేంద్రానికి ఇచ్చారు. మైనార్టీలకు కుట్టు శిక్షణ పేరుతో దీనిని ప్రతిపాదించినప్పటికీ ఆ సంస్థ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి అధీనంలో పనిచేస్తుందో కూడా తెలియదు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పిల్లలు ఆరుబయట చదువుకుంటున్నా పట్టని అధికారులు ఎలాంటిధ్రువపత్రాలు లేని ప్రైవేటు సంస్థకు హాలును కట్టబెట్టడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. శిక్షణ కేంద్రాన్ని వేరొక చోటకు తరలించి ఆ ప్రాంగణాన్ని తరగతిగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. ఇలాగైతే టీసీలు తీసుకుని తమ పిల్లలను బయటకు తీసుకువెళ్లిపోతామంటూ గొడవపడ్డారు. విద్యాకమిటీ సభ్యులు కూడా అదే స్థాయిలో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒకానొకదశలో స్థానికులు ఆ భవనానికి తాళాలు వేస్తే దానిని తొలగించి ఆ శిక్షణ కేంద్రానికి అప్పగించడం వెనుక స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమంటున్నారు. నిర్వాహకురాలితో వాగ్వాదం కుట్టుశిక్షణ ప్రారంభించేందుకు బుధవారం మధ్యాహ్నం వచ్చిన నిర్వాహకురాలు విజయలక్షి్మతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అనుమతి పత్రాలు చూపించాలంటూ నిలదీశారు. అవేమీ తన వద్ద లేవని, పది రోజుల్లో వస్తాయంటూ ఆమె చెప్పిన సమాధానం తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement