-
పల్లెలు ఎడారులవుతున్న వేళ...!
కొద్దిమంది వృద్ధుల్ని మినహాయిస్తే, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో జనం మొత్తంగా వలస వెళ్లిపోయారు. ఇది ఒక గ్రామం కథ మాత్రమే కాదు.. భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలన్నింటి వ్యథా ఇలాగే ఉంటోంది. ఉన్న ఊరులో బతికే పరిస్థితులు లేక మొత్తం జనం పనుల కోసం వలస వెళ్లిపోతున్నారంటే.. మన గ్రామీణ ప్రాంతాలు చాలావరకు నిర్మానుష్యంగా మారుతున్నాయని అర్థం. రుతుపవనాల రాకలో జాప్యం, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రత తారస్థాయికి చేరడం ఫలితంగా భారతదేశంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో భూగర్భ జలాలు వట్టిపోతున్నాయి. సంప్రదాయక నీటి వనరుల పరిరక్షణ, అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అభివృద్ధి పేరిట అడవుల్ని, జల వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రక్రియను నిలిపివేయాలి. ‘‘అందరికీ అభినందనలు... మనం ఈ సంవత్సరం 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధిం చాము. వచ్చే సంవత్సరం 60 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధించడానికి మనం మరిన్ని చెట్లను నరికేద్దాం పదండి’’ పూర్తిగా వ్యంగ్యాన్ని చొప్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ నిజంగానే షాక్ కలిగించింది. అయితే ఈ వ్యంగ్యం ట్విట్టర్ను అనుసరిస్తున్న మెజారిటీ పాఠకుల తలకెక్కిందా లేక ఎక్కువమంది జనాలను స్థిమితంగా ఆలోచింపజేసిందా అనేది తేల్చి చెప్పడం కష్టమే. ఈ ట్విట్టర్ వ్యాఖ్య ప్రభావం ఎంత అనే చర్చ పక్కన బెట్టి చూస్తే, గత 140 ఏళ్లలో అంటే ఉష్ణోగ్రతల స్థాయిలను ప్రపంచం నమోదు చేయడం మొదలు పెట్టిన తర్వాత నాలుగో అత్యంత ఉష్ణోగ్రతా సంవత్సరంగా 2018 సంవత్సరం చరిత్రకెక్కింది. 2019 సంవత్సరంలో మరింత ఉష్ణోగ్రత ఉంటుందని నాసా అంచనా. ఇప్పటికే వేడి మనుషులను అమాంతంగా చంపేస్తోంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు రుతుపవనాలకు ముందస్తుగా కురిసే వర్షపాతం భారత్లో 22 శాతం లోటును నమోదు చేసింది. ఇది గత 65 ఏళ్లలో రెండో అత్యంత తక్కువ వర్షపాతం. ఈ ఏడు రుతుపవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు మండిస్తున్నాయి. రాజస్తాన్లోని ఛురు ప్రాంతంలో ఈ సీజన్లో ఇప్పటికే ఉష్ణోగ్రత 50 డిగ్రీల స్థాయిని మూడుసార్లు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ప్రస్తుతం 48 డిగ్రీల సెల్సియస్తో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నీటి వనరుల క్షీణతే కరువుకు కారణం ఇప్పటికే దేశ భూభాగంలో దాదాపు 43 శాతం కరువుకోరల్లో చిక్కుకుంది. దాదాపు 60 కోట్లమంది కరువు బారిన పడ్డారని అంచనా. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో నీటి వనరులు శుష్కించిపోతున్నాయి. ఎండవేడికి బీళ్లుగా మారిన నేల ఎంత ప్రభావం చూపిస్తుందో మాటల్లో వర్ణిం చలేం. గార్డియన్ పత్రిక రిపోర్టు ప్రకారం భారతదేశంలో వందలాది గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలే కాసిన్ని నీటిచుక్కల కోసం తమ ఇళ్లను ఖాళీచేసి వలస పోతున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కరువు ప్రభావం కారణంగా 50 వేలమంది పైగా రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం 500 క్యాంపులకు తరలించారు. మహారాష్ట్రలో 1,501 పశు నిర్వహణా శిబిరాలు ఉంటున్నాయి. ఇక్కడ 72 శాతం భూభాగం కరువు బారినపడింది. ఇక ముంబై నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని వార్తలు. ఇక కర్ణాటకలో 88 శాతం పైగా భూభాగం తీవ్రకరువుతో కునారిల్లిపోతోంది. ఈ రాష్ట్రం లోని 176 తాలూకాలలో 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత 18 ఏళ్లలో 12 సంవత్సరాలు కర్ణాటక కరువు బారిన పడటం గమనార్హం. 2018–19 సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయంలో మైనస్ 4.8 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. కరువు వ్యవసాయ పంటలకు భారీ నష్టం కలిగించడంతోపాటు, వ్యవసాయాధారిత ఆర్థిక కార్యాచరణ కుప్పగూలిపోయింది. ఒక కర్ణాటక మాత్రమే కాకుండా, దాదాపు సగం దేశంలో క్షీణిస్తున్న భూగర్భజల మట్టాలు చివరకు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని సామాజిక వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య నీటికి సంబంధించిన ఘర్షణలకు తోడుగా నీటికోసం క్యూలలో నిలుచున్న వ్యక్తుల మధ్య ఘర్షణలు కూడా గడచిన కొన్ని సంవత్సరాల్లో బాగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మన విధాన నిర్ణేతలు నీటి పరిరక్షణ, నీటి పొదుపు ప్రాముఖ్యతను ఇప్పుడు గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు (బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ)తోసహా 21 నగరాలు 2020 నాటికల్లా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడాన్ని చవిచూడనున్నాయని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించిన నివేదిక నిజంగానే ప్రమాద ఘటిం కలను మోగిస్తోంది. భూగర్భజలాలు దేశప్రజలకు అవసరమైన 40 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నందువల్ల, దేశవ్యాప్తంగా 60 కోట్లమంది ప్రజలు రానున్న జల సంక్షోభం బారిన పడనున్నారు. జల సంక్షోభం తీసుకువస్తున్న ఘర్షణలు అయితే భూగర్భ జల మట్టాలు క్షీణించిపోవడం నగరాలకే పరిమితం కాలేదు. నిజానికి భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడిపారేయడం వల్లే వర్షపాతం కాసింతమేరకు తగ్గినా సరే అది విధ్వంసకరమైన కరువుకు దారితీస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి భూగర్భజలాల క్షీణత రేటు 0.5 మీటర్లకు మించి నమోదవుతోంది. ఇది ఒక మీటర్ వరకు పడిపోతోంది. ఇక ఎండిపోతున్న నదుల నుంచి లభ్యమయ్యే నీరు కూడా తగ్గిపోతోంది. ఇలా నీటి సంక్షోభం ప్రభావాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యంత సమృద్దమైన జలరాశికి నిలయమైన నర్మదా నదిలో నీటి లభ్యత గత దశాబ్దకాలంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలోని 91 రిజర్వాయర్లలో నీటి మట్టం వాటి సామర్ద్యం కంటే 18 శాతం దిగువకు క్షీణించిపోయింది. పైగా, అనేక డ్యామ్ల లోని నీటిని వ్యవసాయ అవసరాలనుంచి తాగునీటితో సహా నగరప్రాంతాల అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో రైతుల నిరసనలు తీవ్రతరమై గ్రామీణ–పట్టణ ఘర్షణలకు దారితీస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నీటి పరిరక్షణ, నీటి నిల్వ, భూగర్భజలాల రీచార్జ్ నుంచి ప్రభుత్వాల ప్రాధమ్యాలు మారిపోయాయి. కరువు ముంచుకొచ్చిన సమయాల్లో కీలకపాత్ర పోషించే సంప్రదాయక నీటి బావుల పునరుద్ధరణ పనులను పెడచెవిన పెడుతూ వచ్చారు. నీటి చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల రీచార్జికి చేపట్టవలసిన చర్యలు అసంపూర్ణంగా ఉంటున్నాయి. లేదా వాటిని పూర్తిగా వదిలేశాయి. లేక చాలా నత్తనడకన సాగుతున్నాయి. దేశవ్యాప్త్గంగా ఇప్పటికీ 2 లక్షల మేరకు సంప్రదాయక చెరువులు, దిగుడుబావులు ఉంటున్నాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పంజాబ్లో 138 బ్లాక్లలో 110 బ్లాకులు డార్క్ జోన్లో ఉంటున్నాయి. అంటే వీటీలో నీటిని విపరీతంగా తోడేశారన్నమాట. 15 వేల చెరువులు, గుంతలను పునరుద్ధరించినట్లయితే భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇంతవరకు పంజాబ్లో 54 గ్రామీణ చెరువులను పునరుద్ధరించారు. ఆశ్చర్యమేమిటంటే, రాజస్థాన్లోనూ, తరాలుగా కొనసాగుతున్న అద్భుతమైన నీటి పరిరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించడానికి బదులుగా బిందు సేద్యంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో 39వేల సంప్రదాయక చెరువులు, ట్యాంకులు ఉనికిలో ఉంటున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులకు పైగా చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. వీటిలో చాలావాటిని ఇప్పటికీ పునరుద్ధరించవచ్చు. ఈలోగా కర్ణాటక రాష్ట్రం జలామృత పథకాన్ని ప్రారంభించి సంప్రదాయక నీటి వనరులను పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నం మొదలెట్టింది. ఇది చాలా మంచి ప్రయత్నమే కానీ సంప్రదాయక నీటి వనరులను పునరుత్థానం చెందించడాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంప్రదాయక జల వనరులను పునరుద్ధరించాలి సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థలు అదృశ్యమైపోయాయి. కర్ణాటక రాష్ట్రం ‘కల్యాణీస్’ అనే తనదైన సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను పరిరక్షించాలని ప్రయత్నిస్తోంది. ఒడిశా అయితే ‘కుట్టా, ముండా’ అనే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉంటోంది. వీటిలో కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉంటున్నాయి. అయితే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థల చుట్టూ ఉండే సంప్రదాయక జ్ఞానాన్ని మనం ఇప్పటికే చాలావరకు కోల్పోయాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలోని టెక్సాస్ ఏ– ఎమ్ యూనివర్శిటీకి నేను వెళ్లినప్పుడు వారు తాము అనుసరిస్తున్న తమిళనాడులోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థలను నాకు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి తనదైన సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా అనేది నాకు తెలీదు. కానీ కొంతకాలం క్రితం సెంటర్ ఫర్ సైన్స్ – ఎన్విరాన్మెంట్ సంస్థ దేశంలోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల జాబితాను పొందుపరుస్తూ ‘డైయింగ్ విజ్డమ్’ (అంతరిస్తున్న జ్ఞానం) అనే పుస్తకం ప్రచురించింది. జల వనరుల పరిరక్షణకు సంబంధించి అంతరిస్తున్న మన సంప్రదాయక విజ్ఞానాన్ని తిరిగి ఆవిష్కరించవలసిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. బోర్వెల్స్ ప్రపంచమంతటా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల వైపునకు మళ్లీ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా బోర్వెల్స్ కూడా త్వరలోనో లేక ఆ తర్వాతో వట్టిపోక తప్పదు. అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలి. అయితే యధాతథ స్థితి అనేది ఎప్పటిలాగే కొనసాగుతున్న తరుణంలో దీన్ని ఒక విడి చర్యగా చేపట్టకూడదు. అభివృద్ధి పేరిట అడవులను, జల వ్యవస్థలను, నదీపరివాహక ప్రాంతాలను విధ్వంసం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. లేకపోతే ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతుం డటం అనేది మనం ఊహించని ఉపద్రవాలకు దారితీయక మానదు. వ్యాసకర్త : దేవిందర్శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం
కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క పశువులు కబేళా దారిలో కనిపిస్తున్నాయి..వేసవికి ముందే తీసుకోవలసిన జాగ్రత్తల ఊసేలేదు..ఖరీఫ్లో వర్షాభావం దెబ్బతీసినా రబీకి ఏం చేయాలనేదానిపై కసరత్తు లేదు..కమీషన్ల కక్కుర్తే తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదు..ఇలాంటి అత్యవసర సమయంలో గ్రామీణ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీకి మంగళం పలికేశారు..ఆ పథకం నిధులన్నీ కైంకర్యం చేసి కూలీల కడుపుకొట్టారు.. అనాలోచిత నిర్ణయాలు.. అస్తవ్యస్థ పాలన ఫలితమే ఇది..ఐదేళ్లుగా ఇదే పరిస్థితి.. ఈ వేసవిలో రాష్ట్రమంతటా పరిస్థితి మరింత విషమించింది.. అనంతపురం జిల్లాలో మేత లేక కబేళాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన లేగదూడలు, గేదెలు - గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగంటిన బోర్లు (చేతిపంపులు) నుంచి నీటిని తోడుకోవాలన్నా, కిలోమీటర్ల నుంచి కాలినడకన, సైకిళ్లపై నీరు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడో వచ్చే ట్యాంకర్ల వద్ద వరుసలో నిలబడి బిందెడు నీరు దక్కించుకోవాలన్నా యుద్ధమే చేయాల్సి వస్తోంది. నీటి క్యాన్ కొనుగోలు చేయాలన్నా ఎదురు చూడాల్సి వస్తోంది. - మా ఊళ్లో చిన్నబావి దగ్గర 1,170 అడుగులు రిగ్గు వేయిస్తే చెంబెడు నీళ్లు కూడా రాలేదు, ఏ బావి, బోరులో కూడా నీళ్లు లేవు, ఏడెనిమిది గంటలు దఫదఫాలుగా మోటార్లు వేస్తున్నా ఒక ఎకరం కూడా తడవడం లేదు, అరటి తోటలు మాడిపోతున్నాయి అని వాపోయాడు కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె రైతు. - పదిహేనేళ్ల బత్తాయి తోట సార్. బాగా దిగుబడి ఇవ్వాల్సిన తోటలో ఎండిపోతున్న కొమ్మలను రోజుకు కొన్ని చొప్పున కొట్టేయలేక మొత్తం తోటే నరికేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టాడు ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రైతు వెంకటేశ్వర్లు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/సాక్షి నెట్వర్క్: ఎండిపోయిన చెరువులు, కాలువలు, బోర్లు.. పంటలు సాగు చేయక బీళ్లుగా మారిన భూములు.. కబేళాలకు తరలిపోతున్న పశువులు.. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇళ్లకు వేలాడుతున్న తాళాలు.. జనం లేక బోసిపోతున్న పల్లెలు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా ఈ రోజే తలెత్తినవి కాదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కరువు కాటకాలు కొనసాగుతున్నాయి. తాగు, సాగునీటి సమస్య వేధిస్తోంది. పశుగ్రాసం కొరతతో పశువుల డొక్కలు ఎండుతున్నాయి. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేకుండా పోయాయి. ఉన్నదల్లా కమీషన్ల కక్కుర్తి, అవినీతి, అక్రమాలు, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం. ఐదేళ్లుగా ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ భ్రమలు కల్పించడంలోనే కాలం గడిపేసింది. రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు ఆడని డ్రామాలే లేవు. ప్రాజెక్టులపై సమీక్షలు అంటూ పాలకులు కమీషన్లు వసూలు చేసుకోవడంలో తీరిక లేకుండా గడిపారు. నీరు–చెట్టు పేరిట అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు మింగేశారు తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడా పెరగలేదు. వరుస కరువుల వల్ల పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలిసినా ముందస్తు చర్యల్లేవు. పశువులకు మేత అందించాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి లేకపోవడం గమనార్హం. వర్షాల్లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, వలసలను నియంత్రించాలన్న స్పృహ సర్కారులో కొరవడింది. ఐదేళ్లుగా దుర్భిక్షంతో బాధలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, తమను కనీసం ఆదుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళానికి చేరిన భూగర్భ జలాలు రాష్ట్రంలో కరువు ధాటికి భూగర్భ జలాలు సగటున 14.71 మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఈ నెలారంభలోనే లెక్కతేలింది. 208 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. 1.65 లక్షలకు పైగా బోరు బావులు ఎండిపోయాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోనూ వేసవి ఆరంభంలోనే నీరు అడుగంటిపోయింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, 4,982 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3,494 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. రైతన్నలను ముంచేసిన ఖరీఫ్, రబీ ప్రస్తుత రబీ సీజన్లో 257 మండలాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం కూడా అందలేదు. కరువు సహాయక చర్యలు కనుమరుగయ్యాయి. పంటల నష్ట పరిహారం అటకెక్కింది. గత ఖరీఫ్లో 347 మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు వెల్లడించింది. వరుస కరువులతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రత్యేకించి 2018 రబీ నుంచి గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా అటు ఖరీఫ్, ఇటు రబీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువు నుంచి రైతులు కష్టపడి కాపాడుకున్న పంటలకు కూడా కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతుంటే ఉత్పత్తిదారులకు మాత్రం కనీస ఆదాయం రావడం లేదు. కాగా, కరవు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి చూపాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రమంగా నీరుగారిపోతోంది. దాదాపు 1,307 గ్రామాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూలీలకు పనులు కల్పించలేదని సమాచారం. ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పథకం అమలు కాక ఆయా గ్రామాల నుంచి నిరుపేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేధిస్తున్న పశుగ్రాసం కొరత పాలకుల ఉదాసీనత, పశు సంవర్థక శాఖ మొద్దునిద్ర పశువుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం మనుషులనే కాదు, పశువులను సైతం కాటేస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కాసింత మేత, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచుకున్న పశువుల ఆకలి కేకలు వినలేక రైతులు వాటిని అయినకాడికి అమ్మేస్తున్నారు. పాడి ఆవులు, గేదెలను సైతం పోషించలేక దళారులకు విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులు, సంతల నుంచి పశువులు లారీల్లో కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. రైతుల నుంచి దళారీలు తక్కువ ధరకే పశువులను కొనేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరత తీవ్రమైంది. గుంటూరు జిల్లా మొదలు రాయలసీమలోని అన్ని జిల్లాలను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో లారీ వరిగడ్డి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో వరిగడ్డి లారీలు రాయలసీమకు రవాణా అవుతున్నాయి. అంత ధర పెట్టి వరి గడ్డిని కొనలేని రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. కబేళాలకు తరలిన పశువుల సంఖ్య మూడు నెలల్లోనే రెండు లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గేదెలు, 12 లక్షల ఆవులు, 40 లక్షల గొర్రెలు, 8 లక్షల మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చూస్తామంటూ ప్రవేశపెట్టిన ‘ఊరూర పశుగ్రాస క్షేత్రాల పథకం’ ఆచరణలో విఫలమైంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 10 మండలాల్లోనే పశుగ్రాసం లభ్యమవుతున్నట్లు సమాచారం. పిట్టల్లా రాలుతున్న ‘ఉపాధి’ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో ఈ వేసవిలో పదుల సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదుగురు మరణించారు. ‘ఉపాధి’ పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడం వల్ల కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం.. వేసవిలో పనులు చేసే కూలీలకు కచ్చితంగా నీడ కల్పించాలి. ఇందుకోసం టార్పాలిన్ షెడ్లు వేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీల దాహం తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా.. ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఉదయం ఇళ్ల వద్ద నుంచి బిందెలు, సీసాల్లో తీసుకెళుతున్న నీళ్లు కొద్దిసేపటికే అయిపోతుండడంతో దాహంతో కూలీల గొంతులు ఎండుతున్నాయి. కూలీల తాగునీరుకు ప్రత్యేకంగా ఎలాంటి బడ్జెట్ను విడుదల చేయలేదు. పనుల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. నిలువ నీడ లేదు.. నీరు లేదు ఎండలు మండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు చేస్తున్న ప్రాంతంలో సేద తీరేందుకు చెట్లు లేవు. అధికారులు కనీసం టార్పాలిన్ టెంట్లు కూడా వేయడం లేదు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. తాగేందుకు మంచినీరు సైతం అందుబాటులో ఉంచడం లేదు. – రంగప్ప, కూలీ, తెర్నేకల్, కర్నూలు జిల్లా గ్లూకోజ్ నీరు ఒక్కరోజే ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న మాకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్లూకోజ్ నీటిని అందించారు. తాగునీరు లేకపోవడం వల్ల దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి బిందెతో తెచ్చుకుంటున్నాం. ఎండలు తట్టుకోలేక చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు – వేణుగోపాల్, కూలీ, రాంపురం, కర్నూలు జిల్లా పల్నాడులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ ఆర్థిక ప్రగతిలో ఇతర జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై వృద్ధి రేటు గణాంకాలను గొప్పగా చూపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సర్కారు గణాంకాలను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. మండు వేసవిలో గుక్కెడు తాగునీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ సాగు, తాగు నీరు లేక పల్నాడు ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస పోతున్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం సున్నా. పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఆరు బోర్లు ఉండగా, ప్రస్తుతం ఏ ఒక్క బోరులోనూ సరిపడా తాగునీరు లభించడం లేదు. దీంతో గ్రామంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి. చక్రాయపాలెం తండాలో 275 కుటుంబాలు నివసిస్తుండగా, ఇక్కడ తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. మేకలదిన్నె తండా, మన్నేపల్లి తండా, రెవిడిచెర్ల తదితర గ్రామాల్లోనూ బోర్లు పనిచేయడం లేదు. మండలంలో 17కు పైగా పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే మండలం పమిడిపాడు గ్రామంలో వాటర్ ట్యాంకుల వద్ద రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి మరణించాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బోర్లు వేసి అప్పుల పాలయ్యాం... గ్రామాల్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. సాగు నీరు లేక పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అందరం అప్పుల పాలయ్యాం. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. – బి.గురువయ్య, రైతు, షోలాయేపాలెం, బొల్లాపల్లి గ్రామాల్లో వృద్ధులు, పిల్లలే ఉన్నారు నేను ఎంటెక్ చదువుతున్నా. ప్రస్తుతం సెలవుల్లో సొంతూరికి వచ్చా. కరువు పరిస్థితుల వల్ల గ్రామంలో అందరూ వలస వెళ్లారు. మా తల్లిదండ్రులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వృద్ధులు, వేసవి సెలవుల్లో ఇళ్లకు వచ్చిన పిల్లలు మాత్రమే ఊళ్లో ఉన్నారు. – బాణావత్ వెంకటేశ్ నాయక్, గంగుపల్లి తండా -
జిల్లాలో 40 కరువు మండలాలు
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 228 మండలాలను తీవ్రమైన కరువు మండలాలుగా ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. తీవ్రమైన కరువు జిల్లాల్లో ప్రకాశం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్ కడప జిల్లా 43 తీవ్ర కరువు మండలాలతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రకాశం 40, చిత్తూరులో 37, కర్నూలు 33, అనంతపురం 32, విజయనగరంలో 22 మండలాలలో తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఒకమోస్తరు కరువు ఉన్నట్లు 29 మండలాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డి.వరప్రసాదు బుధవారం జీఓ ఎంఎస్ నంబర్–2 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఖరీఫ్ సీజన్లో ప్రకాశం జిల్లాలోని మొత్తం 56 మండలాలనుకరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రబీలో ఏం వర్షాలు పడి పంటలు పండాయో గాని 16 మండలాలను తాజా జాబితాలో చేర్చలేదు. వర్షపాతం కూడా పూర్తి లోటుగా ఉన్నా కరువు మండలాల ప్రకటనలో మాత్రం ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కరువు మండలాలు ఇవే.. అద్దంకి, అర్ధవీడు, బేస్తవారిపేట, సీఎస్ పురం, చీమకుర్తి, కంభం, దొనకొండ, పెదదోర్నాల, గిద్దలూరు, హనుమంతునిపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కొనకనమిట్ల, కారంచేడు, కొమరోలు, కనిగిరి, కొండపి, కొరిశపాడు, కొత్తపట్నం, మార్కాపురం, మర్రిపూడి, మార్టూరు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పీసీపల్లి, పొదిలి, పొన్నలూరు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, సింగరాయకొండ, రాచర్ల, టంగుటూరు, తర్లుపాడు, తాళ్ళూరు, ఉలవపాడు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, యద్దనపూడి, యర్రగొండపాలెం. -
‘వారి మధ్య వైరం ప్రజలకు శాపంగా మారింది’
సాక్షి, విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని అన్నారు. 522 మండలాలు డ్రై మండలాలుగా ఉన్నాయని, 347 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలను ఆదుకోవాలని కోరారు. రబీ పంట లేదని, ఖరీఫ్లో నష్టపోయారు.. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ఈ నెల 17న కర్నూలులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఇరుపార్టీల ఆధ్వర్యంలో పీపుల్స్ ఎజెండా ప్రకటించి, ఆ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. -
'ఆ నిధుల కోసం కరవును సృష్టించలేను'
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి ఆంధ్రప్రదేశ్లో కరవు పరిస్థితులను సృష్టించలేను' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని కరవును జయించామని చెప్పుకొచ్చారు. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడా కరవు జాడ లేదని చంద్రబాబు తెలిపారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement