breaking news
doulathabad
-
‘దక్కన్ తాజ్ మహల్’ ఎవరు కట్టించారో తెలుసా?!
తాజ్ మహల్లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్ మహలూ కాదు. తాజ్మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం.పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగాబాద్లో ఉంది. అందుకే దక్కన్ తాజ్గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్ మహల్లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్మహల్కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్రాస్ బానుబేగమ్ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్ కొడుకు అజమ్ షా దగ్గరుండి కట్టించాడు. మొఘల్ ఆర్కిటెక్చర్ శైలిని ప్రతిబింబిస్తుంది, ప్రధాన భవనం ముందు పెద్ద కొలను, నాలుగు వైపులా విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు, పాలరాతి పూలలో పర్షియన్ లాలిత్యం ప్రతిదీ తాజ్మహల్ను పోలి ఉంటుంది. తలెత్తి ఓసారి పై కప్పును చూస్తే ఇక ఒక నిమిషం పాటు తల దించుకోలేం. తోటల నుంచి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉన్న విశాలమైన వరండాలు, ఆర్చ్ల మధ్య తిరుగుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఇక్కడే బీబీ కా మఖ్బారా... మహారాష్ట్ర, ఔరంగాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు దక్కన్ కోసం పోరాడి పోరాడి దక్కన్లోనే మరణించాడు. బీబీ కా మఖ్బారాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఖుల్దాబాద్లో అతడి సమాధి ఉంది. ఈ ట్రిప్లో శివాజీ మ్యూజియాన్ని కలుపుకోవచ్చు. ఆ మ్యూజియంలో శివాజీ ఆయుధాలు, నాణేల ప్రదర్శన ఆసక్తిగా ఉంటుంది. ఇవి కూడా చూడవచ్చు! 16 కిమీల దూరంలో దౌలతాబాద్ కోట 30 కి.మీల దూరంలో ఎల్లోరా గుహలు 50 కి.మీల దూరంలో పైథాన్ ఉంది. అక్కడి చేనేతకారులు నేసే చీరలను పైథానీ చీరలంటారు. మహిళల మనసు దోచే పైథానీ చీరలు గత దశాబ్దకాలంగా నడుస్తున్న ట్రెండ్. కాబట్టి ఒక్క చీరనైనా తెచ్చుకుంటే ఈ ట్రిప్కు గుర్తుగా ఉంటుంది. ధర పదివేల నుంచి మొదలవుతుంది. బస: ఔరంగాబాద్లో బస చేయవచ్చు. ఉత్తరాది, దక్షిణాది ఆహారం దొరుకుతుంది. – వాకా మంజులారెడ్డి చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు -
8 నెలలుగా వేతనాల్లేవ్..!
దౌల్తాబాద్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్వీపర్లు, అటెండర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎనిమిది నెలల వేతనాల్లేక పండుగ పూట పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందని స్వీపర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్టైం పేరుతో వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం పాఠశాలల్లో 8గంటల పాటు పనిచేస్తున్నారు. గతంలో కనీస వేతనంగా రూ.6,700లుగా గుర్తించిన ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా వీరికి మాత్రం నామమాత్రంగా రూ.1,623 మాత్రమే వేతనంగా చెల్లిస్తుంది. పెరిగిన నిత్యవసర ధరలతో వేగలేక పోతున్న సిబ్బందికి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా తొమ్మిది నెలల వేతనాలు చెల్లించలేదు. అసలే నామమాత్రపు జీతాలతో సతమతమవుతుంటే దాన్నీ సక్రమంగా చెల్లించకపోవడంతో వారి కష్టాలు చెప్పనలవి కావు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారులు నిర్లక్ష్యం కారణంగా వారికి తిప్పలు తప్పడంలేదు. గతంలో వీరికి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాగితాలకే పరిమితమైంది.