breaking news
doubles rankings
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్లో నిలిచాడు. రామ్కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్లో నిలిచారు. -
ATP Rankings: నంబర్వన్ బోపన్న
లండన్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ భారత ప్లేయర్ నంబర్వన్ ర్యాంక్ను అధిరోహించాడు. సోమవారం విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్లో రోహన్ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్లో నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెన్నిస్ చరిత్రలోనే నంబర్వన్ ర్యాంక్ను అందుకున్న అతిపెద్ద వయసు్కడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గత శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోరీ్నలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గి తన కెరీర్లో పురుషుల డబుల్స్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో బోపన్న, ఎబ్డెన్ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోరీ్న లు ఆడినందుకు బోపన్నకు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, ఎబ్డెన్ రెండో ర్యాంక్లో నిలిచాడు. చివరిసారి భారత్ నుంచి లియాండర్ పేస్ 2000 మార్చి 13న ... మహేశ్ భూపతి 1999 జూన్ 14న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా నిలిచారు. బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్ సాధించడంతోపాటు 504 మ్యాచ్ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. -
టాప్–100లోకి అనిరుధ్
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో అనిరుధ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి సరిగ్గా 100వ ర్యాంక్లో నిలిచాడు. గతవారం అమెరికాలో జరిగిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)తో కలిసి ఆడిన అనిరుధ్ డబుల్స్లో సెమీఫైనల్ చేరుకోవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. వెటరన్ రోహన్ బోపన్న ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్లో ఉండగా... యూకీ బాంబ్రీ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 60వ ర్యాంక్లో, సాకేత్ మైనేని నాలుగు స్థానాలు పురోగతి సాధించి 77వ ర్యాంక్లో నిలిచారు. జీవన్ నెడుంజెళియన్ 91వ ర్యాంక్లో, శ్రీరామ్ బాలాజీ 94వ ర్యాంక్లో ఉన్నారు. మరోవైపు సింగిల్స్ ర్యాంకింగ్స్లో సుమిత్ నగాల్ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 178వ ర్యాంక్లో నిలిచాడు. -
సానియా టాప్ ర్యాంక్ పదిలం
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా ఐదో వారం తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. మాడ్రిడ్ ఓపెన్లో తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోనే ఓడినప్పటికీ సానియా ర్యాంక్లో ఎలాంటి మార్పురాలేదు. మరోవైపు హింగిస్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్కు చేరుకుంది. సోమవారం మొదలైన రోమ్ ఓపెన్లో టాప్ సీడ్గా బరిలోకి దిగుతున్న సానియా-హింగిస్ జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో రోహన్ బోపన్న 21వ స్థానానికి చేరుకొని మరోసారి భారత డబుల్స్ నంబర్వన్ ప్లేయర్గా నిలిచాడు. లియాండర్ పేస్ 24వ ర్యాంక్లో ఉన్నాడు. భారత్ నుంచి ఈ ఇద్దరే టాప్-100లో ఉన్నారు. సింగిల్స్లో సోమ్దేవ్ 173వ ర్యాంక్లో, యూకీ బాంబ్రీ 180వ ర్యాంక్లో నిలిచారు. -
టూత్ బ్రష్ కూడా పట్టుకోలేకపోయా!
విజయమైనా, వివాదమైనా భారత టెన్నిస్లో సానియా మీర్జా ముద్ర స్పష్టం. ఆమె స్థానం పదిలం. దశాబ్ద కాలానికి పైగా భారత నంబర్వన్గా కొనసాగుతున్న ఈ హైదరాబాదీ అంతర్జాతీయ టెన్నిస్లోనూ తన గుర్తింపును చాటుకుంది. ముఖ్యంగా మహిళల డబుల్స్లో గత కొన్నాళ్లుగా ఆమె తిరుగులేని విజయాలు సాధిస్తోంది. తాజాగా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఆమె ఐదో ర్యాంక్కు చేరుకుని అత్యుత్తమ స్థాయికి చేరింది. చాలా కాలం క్రితమే సింగిల్స్కు దూరమైనా తాను ఎంచుకున్న విభాగంలోనే 28 ఏళ్ల సానియా దూసుకుపోతోంది. అయితే దాదాపు నాలుగేళ్ల క్రితమే సానియా తన కెరీర్ ముగించాలని భావించింది. గాయాలను తట్టుకోలేక ఇక చాలనుకుంది. అయితే మొండి పట్టుదలతో ఆమె పోరాడింది. తన కెరీర్ను నిలబెట్టుకుంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది ఒకప్పుడు సానియా మీర్జా భారత్ తరఫున సింగిల్స్లోనూ సూపర్ స్టార్. కానీ ఎక్కువకాలం ఈ విభాగంలో నిలకడ చూపలేకపోయింది. అదృష్టం బాగుంటే రెండో రౌండ్, లేదంటే తొలి రౌండ్లో పరాజయం... ఒక దశలో సానియా సింగిల్స్ మ్యాచ్ ఫలితం అంటే ఇంతే అన్నట్లుగా ఉండేది. డబ్ల్యూటీఏ సర్క్యూట్లో ఉన్న పోటీని సానియా అందుకోలేకపోయింది. మరోవైపు చూస్తే డబుల్స్లో అప్పుడప్పుడు కొన్ని మెరుపు విజయాలు దక్కుతున్నాయి. ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నా... చివరకు సింగిల్స్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకుంది. ‘పూర్తిగా ఆడలేనని కాదు. సింగిల్స్లో 60-70 మధ్య ర్యాంకుల్లో ఉన్నాను. డెరైక్ట్ ఎంట్రీ కూడా లభిస్తోంది. కానీ నా ఆట గురించి నాకు తెలుసు. గాయాల తర్వాత సింగిల్స్ ఒత్తిడిని నా శరీరం భరించే స్థితిలో లేదు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’ అని సానియా చెప్పింది. అయితే ఆ నిర్ణయం ఆమెకు ఎంతో మేలు చేసింది. పూర్తి స్థాయిలో డబుల్స్పై దృష్టి పెట్టేలా చేయగలిగింది. ‘ఆటను మొదలు పెట్టినప్పుడు అత్యుత్తమ స్థాయికి చేరాలని భావించాను. ఇప్పుడు ఐదో ర్యాంక్ అందుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడి దాకా వచ్చినదాన్ని నంబర్వన్ను కూడా కాగలను‘ అని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. భాగస్వాములు మారినా... సాధారణంగా డబుల్స్లో ఒకే భాగస్వామితో ఎక్కువ కాలం ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయంటారు. కానీ సానియా ఇది తప్పని నిరూపించింది. తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుంది. గతంలో బెథాని మాతెక్తో కలిసి వరుస విజయాలు సాధించిన ఆమె ఇప్పుడు కారా బ్లాక్తో కలిసి అదే జోరును కొనసాగిస్తోంది. 2013లో సానియా ఐదుగురు వేర్వేరు భాగస్వాములతో ఐదు టైటిల్స్ గెలవడం విశేషం. ‘భాగస్వామి మారకుంటే మంచిదే. కానీ అదే ముఖ్యం కాదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. పక్కన ఎవరు ఉన్నా సమన్వయానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బ్లాక్తో నాకు అలాగే జత కుదిరింది’ అని సానియా వెల్లడించింది. సింగిల్స్తో పోలిస్తే డబుల్స్కు పెద్దగా గుర్తింపు ఉండదనేది వాస్తవం. అయితే సర్క్యూట్లో డబుల్స్ను తక్కువ చేసి చూడటం కూడా ఉండదు. ప్రపంచంలో టాప్-30లో చాలా మంది క్రీడాకారులు డబుల్స్ ఆడటం దీనిని సూచిస్తోంది. ‘భారత టెన్నిస్కు గుర్తింపు తెచ్చిన పేస్, భూపతి కూడా ఆ ఘనతలన్నీ డబుల్స్లోనే సాధించారనేది మరచిపోవద్దు. అయినా సింగిల్స్లో ఎంత మందికి గ్రాండ్స్లామ్ గెలిచే అవకాశం ఉంటుంది. అది అంత సులువు కాదు’ అని ఈ హైదరాబాదీ తన మనోభావం వెల్లడించింది. మిక్స్డ్ డబుల్స్లో సానియా ఖాతాలో రెండు గ్రాండ్స్లామ్లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం నరకం క్రీడాకారుల జీవితంలో చాలాసార్లు గాయాలు భాగంగా మారిపోతాయి. అయితే అవి కెరీర్పై ప్రభావం చూపించేవిగా ఉంటేనే సమస్య. సానియాను ఒకసారి కాదు మూడుసార్లు ఈ సమస్య వెంటాడింది. మోచేతికి గాయం, మూడు సర్జరీలు ఆమె ఆటను ఆపేశాయి. కనీసం టెన్నిస్ రాకెట్ కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఇక మళ్లీ కోర్టులోకి దిగడం కష్టమే అనిపించింది. అయితే ఈ సమయంలోనూ ఆమె పట్టుదల కోల్పోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్ఫూర్తితో ఆమె మళ్లీ బరిలోకి దిగింది. ‘టెన్నిస్ రాకెట్ సంగతేమో కానీ కనీసం టూత్బ్రష్ను కూడా నా చేతితో పట్టుకోలేని పరిస్థితి. ఇక ఆట ఏం ఆడతాం. రిటైర్ కావడమే మిగిలింది అనిపించింది. అయితే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిద్దామని నిర్ణయించుకున్న సమయంలో నా మనసు చాలా బాధపడింది. కానీ ఇంట్లోవాళ్లు ‘ఒక ప్రయత్నం చేసి చూడవచ్చు కదా’ అన్నారు. దీంతో ఆరు నెలలు మళ్లీ శ్రమించాను. అది ఇప్పుడు ఫలితాన్నిస్తోంది’ అని సానియా గర్వంగా చెబు తోంది. ఈ ఘనతను ఆమె తన తండ్రి ఇమ్రాన్ మీర్జాకే ఇస్తోంది. ఎందుకంటే ఇంత సుదీర్ఘ కెరీర్లో సానియా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వ్యక్తిగత కోచ్లను నియమించుకోలేదు. పరిమిత సమయానికి ఒకరిద్దరు ట్రావెల్ కోచ్లుగా పని చేసినా వారి అవసరం పెద్దగా రాలేదని, తన తండ్రే సూపర్ కోచ్ అనేది ఆమె నిశ్చితాభిప్రాయం. ఆట మినహా అన్నీ దూరం ఒకప్పుడు సానియా మీర్జా అంటే ఆమె వెంట వివాదం కూడా నడిచొచ్చేది. మక్కా మసీదులో షూటింగ్తోనో... జాతీయ పతాకానికి అవమానం అనో... లేదంటే ఏదో వ్యాఖ్య చేసో, తన డ్రెస్సింగ్తోనో ఆమె ఆటకంటే ఇతర అంశాలతోనే వార్తల్లో నిలిచేది. అయితే ఇప్పుడు చాలా కాలంగా సానియా వీటికి దూరంగా ఉంది. ఆమె మ్యాచ్ల ఫలితాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. ‘మీడియా నా వెంట పడటం, నా గురించి పట్టించుకోవడం మానేసిందేమో. అందుకే ఎలాంటి వార్తలు పుట్టడం లేదు. ఎందుకంటే నేను చేసిన దానికంటే మీడియా అనవసరపు ప్రచారంతోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది’ అని సానియా నవ్వుతూ చెప్పింది. అన్నట్లు ఇప్పుడు సానియా మీర్జా తన అకాడమీలో మరింత మంది యువ ఆటగాళ్లను తీర్చి దిద్దే పనిలో ఉంది. ఫలితాల సాధనకు ఏడాది కాలం చాలా చిన్న సమయమని, భవిష్యత్తులో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేస్తానంటూ టెన్నిస్ ప్రపంచానికి సానియా హామీ ఇస్తోంది.