breaking news
DMdK president vijayakanth
-
నిజ జీవితంలో.. నటించడం చేతకాదు
* ప్రజలతోనే నా పయనం * ఆ ఇద్దర్నీ బహిష్కరిద్దాం * విద్యుత్ చార్జీల పెంపుపై డీఎండీకే ఆందోళన * మదురైలో గళమిప్పిన విజయకాంత్ సాక్షి, చెన్నై: ‘నిజ జీవితంలో నటించడం చేత కాదు’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ప్రజలతోనే తన పయనం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మదురైలో శుక్రవారం జరిగిన విద్యుత్ చార్జీల పెంపు నిరసనలో డీఎంకే, అన్నాడీఎంకేలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు డీఎండీకే పిలుపు నిచ్చింది. పార్టీ వర్గాలు ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారుు. మదురై వేదికగా జరిగిన సభలో విజయకాంత్ పాల్గొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిరసనకు తరలి వచ్చారు. విజయకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. జైలు శిక్షపడ్డ జయలలిత ఏమో ప్రజా సీఎం....ప్రజా సీఎం అని పిలుస్తున్నారని, అలాంటప్పుడు పన్నీరు సెల్వం ఎవరికి సీఎం అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు మార్చిమార్చి అధికార పగ్గాలు అప్పగించడం వలన ప్రజలకు ఒరిగింది శూన్యమేనన్నారు. ప్రజల్లో మార్పు రావాలని పిలుపు నిచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలో అవినీతిలో దొందుదొందేనని, ఆ రెండు పార్టీలను బహిష్కరించే తీర్పును రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నటన చేత కాదు తాను సినిమాల్లో నటించగలనే గానీ, వాస్తవిక జీవితంలో నటన చేత కాదన్నారు. పార్టీ పరంగా తాను అందిస్తున్న సేవల్ని గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్తానని, వారి మద్దతును కూడ గట్టుకుంటానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తన సుడిగాలి పర్యటన ఉంటుందని, అందుకు తగ్గ పర్యటన వివరాల్ని త్వరలో ప్రకటిస్తానన్నారు. -
‘కరుణ’ జపం
డీఎండీకే అధినే త విజయకాంత్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి నామాన్ని జపించేపనిలో పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. * కరుణానిధి చిత్రపటాల్ని ప్రభుత్వ కార్యాలయల్లో పెట్టాల్సిందే * లేకుంటే ఆందోళనలు తప్పవు : విజయకాంత్ సాక్షి, చెన్నై: డీఎంకేపై విమర్శలు గుప్పించడంలో డీఎండీకే అధినేత విజయకాంత్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆ పార్టీ మీద కన్నా, జయలలిత మీద విమర్శల స్వరం పెంచారు. అలాగే, ఈ సారి ఏకంగా కరుణానిధి జపం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఐదు సార్లు సీఎంగా పనిచేసిన కరుణానిధి మహానాయకుడు అని, ఆయన చిత్ర పటం ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా ఉంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడం గమనార్హం. కరుణ చిత్ర పటాల్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాల్సిందే శుక్రవారం డీఎండీకే అధినేత విజయకాంత్ ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సీఎం పన్నీరు సెల్వంను టార్గెట్చేసి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే మంత్రులు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సీఎం జయలలిత, ప్రజా సీఎం జయలలిత అని జపిస్తూనే, ఆమె మార్గదర్శకంలోనే ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేయడం విచారకరమన్నారు. జైలు శిక్ష ఎదుర్కొంటున్న జయలలిత ప్రజా సీఎం అయితే, తమరు ఎవరికి సీఎం అని పన్నీరు సెల్వంను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత చిత్ర పటాల్ని ఏర్పాటుచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని అడ్వకేట్ జనరల్ సోమయాజులు మదురై ధర్మాసనంలో స్పష్టంచేసి ఉన్నారని గుర్తుచేశారు. జైలు శిక్ష ఎదుర్కొం టున్న వాళ్ల ఫొటోల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ప్రజా సీఎంలుగా ఉన్న కామరాజర్, అన్నా, ఎంజీయార్ చిత్రపటాల్ని తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయూల్లో ఏర్పాటు చేయూల్సిందేనన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, అలాంటి నాయకుడి చిత్ర పటాన్ని సైతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజలతో కలసి పోరాటాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.