-
అనంతపురం జన ప్రభంజనం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో జనాభా ఏటా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 40,81,148కు (అనధికారికంగా ఈ సంఖ్య 44 లక్షలకు చేరుకున్నట్లు అంచనా) చేరుకుంది. ఇందులో 20,64,495 మంది పురుషులు, 20,16,653 మంది మహిళలు ఉన్నారు. దీని ప్రభావంతో ప్రజలకు కనీస సౌకర్యాలు అందకుండా పోయాయి. పెరిగిన జనాభాకు తగ్గట్లు అవసరాలు తీర్చే వనరులు లేకుండా పోయాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితమైపోతున్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవడాలు జరుగుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు 1989 నుంచి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2001 సంవత్సరంలో అప్పటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 31 లక్షలుండేది. జనాభా పెరుగుదలకు తగ్గట్లు వైద్య సేవలను అందించడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. 500 పడకల ఆస్పత్రిగా పేరున్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిని ఇటీవల 750 పడకల ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోజూ 3వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఐదు మంది రోగులకు ఒక్క స్టాఫ్నర్సు పని చేయాల్సిన చోట వంద మంది రోగులకు ఒక్కరు పనిచేయాల్సి వస్తోంది. ఇక పీహెచ్సీల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని 88 పీహెచ్సీలు, సీడీ ఆస్పత్రి, హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సీహెచ్సీల్లో రోజూ 70 వేల నుంచి 80 వేల ఓపీ ఉంటుంది. కానీ వైద్యులు, స్టాఫ్నర్సులు, క్లాస్ 4 సిబ్బంది ఆశించిన స్థాయిలో లేరు. దీంతో పాటు మందుల కొరత తీవ్రంగా ఉంది. దక్కని ఉపాధి ఉద్యోగావకాశాలు జనాభా పెరుదుల ప్రభావం ఉపాధి, ఉద్యోగావకాశాలపై ప్రత్యక్షంగా చూపుతోంది. ఉపాధి కోసం యువత ఎదురు చూడాల్సి వస్తోంది. మానవ వనరులను ఉపయోగించుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం క్లాస్ 4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. గత ప్రభుత్వం లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చి.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టింది. ఉపాధి దొరకపోవడంతో ఎంతో మంది వ్యసనాలకు బానిసలుగా మారి పక్కదారి పడుతున్నారు. నేర ప్రవృత్తి పెరిగిపోయింది. -
జనమే జనం
జనాభా పెరుగుదల, జనసాంద్రత ఎక్కువున్న జిల్లాగా రంగారెడ్డికి ప్రత్యేక స్థానముంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడే. 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు. రాజధానికి చుట్టూ విస్తరించి ఉండడం.. పట్టణీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు వలసల తాకిడితోనూ జనాభా సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాకు కొత్త ప్రాజెక్టుల రాక ఉత్సాహాన్ని నింపుతోంది. దేశంలోనే అతిపెద్ద ఔషధనగరి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. బహుల జాతి కంపెనీలు సైతం రాజధాని శివార్లలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో జనాభా పరంగా జిల్లా మరింత ముందుకువెళ్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం.. - సాక్షి, రంగారెడ్డి జిల్లా /ఘట్కేసర్ టౌన్/దోమ నేడు ప్రపంచ జనాభా దినోత్సవం జనాభా వృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. జనాభా పెరుగుదల పరంగా రాష్ర్టంలో తొలిస్థానం కైవసం చేసుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 35.75 లక్షలతో రెండోస్థానంలో ఉన్న జిల్లా 2011 నాటికి 52.96 లక్షలకు చేరుకుంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలసలు పెరుగుతుండడంతో జనసాంద్రతపై ప్రభావం చూపుతోంది. నగర శివార్లలో ఉపాధి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వలసలు, ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తున్నారు. దీంతో గత దశాబ్బంలో జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి గణనీయంగా పెరిగింది. దశాబ్దాకాలంలో జనాభా 48.15 శాతం వృద్ధి చెందింది. 1901లో 3.39 లక్షలున్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలు, 1991 నాటికి 25.51 లక్షలకు చేరుకుంది. జిల్లా జనసాంద్రత 707 కి.మీ., జిల్లా అక్షరాస్యత 78.05 కాగా పురుషులు 84శాతం, స్త్రీల అక్షరాసత్య శాతం 71.82గా ఉంది. విద్యా, ఉద్యోగం, నిరుద్యోగం తదితర కారణాలతో చాలామంది పల్లె నుంచి పట్టణాలకు మకాం మార్చినా పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉండడం విశేషం. 52.96 లక్షల జనాభాలో 34 లక్షల మంది గ్రామాల్లోనే జీవిస్తున్నారు. మూఢనమ్మకాలు, ఆడపిల్లలపై వివక్ష చూపడంతో జనా భాలో 12 లక్షల మంది మహిళలు తక్కువగా ఉన్నారు. పెరుగుతున్న సమస్యలు.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా కావడం లేదు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు రావడంతో వారికి వసతి, భద్రత, రక్షణ చర్యలు సదరు యాజమాన్యాలు కల్పించలేకపోతు న్నాయి. దీంతో రోడ్లపై జీవనం గడుపుతున్నారు. ము రికి వాడలు పెరు గుతున్నాయి. నిరుద్యోగం పెరిగి చోరీలు ఎక్కువవుతున్నాయి. రవాణ సౌకర్యం, కంపెనీలు సంఖ్య పెరిగి జల, వాయు కాలుష్యాలు పెరుగుతున్నాయి. చిన్న కుటుంబం మేలు.. జనాభా నియంత్రణ కోసం చిన్న కుటుంబాల లాభాల గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించాలి. మేమిద్దరం, మాకిద్దరు అన్న నినాదాన్ని అమలు చేస్తే పిల్లలకు విద్యా, వైద్య, ఆరోగ్య సమస్యలు తలెత్తవు. చిన్న కుటుంబంతో హాయిగా జీవిస్తున్నారని పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. పరిమిత సంతానం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అధిక జనాభాను అరికట్టాలని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, అధికారులు పరిమిత సంతానంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఎప్పటి నుంచి.. 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూలై 11న అంతర్జాతీయ జనాభా దినోత్సం నిర్వహిస్తోంది. అక్షరాస్యత జిల్లా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నా అక్షరాస్యతలో మాత్రం మహిళలు పురుషులకంటే వెనుకబడే ఉన్నారు. 2011 జనగణన ప్రకారం అక్షరాస్యతలో పురుషులు 84శాతం ఉండగా, స్త్రీలు 71.82 శాతం ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. జనసాంద్రత జిల్లాలో ఉపాధి మార్గాలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి వలసలు పెరిగిపోయాయి. ఉద్యోగాల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయం పెరుగుతోంది. 2001 2011 477 707 నివాస సముదాయాలు రంగారెడ్డి అర్బన్ విస్తీర్ణం చ.కి.మీ 1,034.27 గృహాలు 8,86,201 రంగారెడ్డి రూరల్ విస్తీర్ణం చ.కి.మీ 6,458.73 గృహాలు 3,49,140 ఎస్సీ, ఎస్టీలు తక్కువే.. రంగారెడ్డి అర్బన్లో 3.27లక్షల మంది ఎస్సీలు, 84వేల మంది వరకు ఎస్టీలు నివసిస్తున్నారు. ఎస్సీలు మొత్తం : 3,26,525 పురుషులు : 1,64,435 స్త్రీలు : 1,62,090 ఎస్టీలు మొత్తం : 84,864 పురుషులు : 44,020 స్త్రీలు : 40,844 స్త్రీ, పురుష నిష్పత్తి .. నాగరికత ఎంత పెరిగినా మహిళల విషయంలో నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. సాంకేతిక పెరిగిన తర్వాత ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే కడతేరుస్తున్నారు. భ్రూణహత్యలు పెరుగుతున్న దరిమిలా రోజురోజుకూ స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి ఆందోళన కరంగా మారుతోంది. ప్రస్తుతం ప్రతి వేయి మంది పరుషులకు 955మంది స్త్రీలే ఉన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement