-
‘కారు’ స్టీరింగ్ ఎవరికో..!?
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై గులాబీ నేత కేసీఆర్ మళ్లీ దృష్టి సారించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీజీగా ఉన్న ఆయన.. పార్టీ సంస్థాగత పటిష్టత కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో మళ్లీ జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించిన ఆయన జూన్ నెలాఖరువరకు పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో జిల్లా కమిటీలు వేయడానికి టీఆర్ఎస్ అధిష్టానం సన్నద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. గతేడాది వరంగల్లో జరిగిన సభలో జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గస్థాయి కమిటీలు, జిల్లాస్థాయి సమన్వయకర్తలను నియమించాలని తీర్మానించింది. సమన్వయ కర్తలను నియమించినా.. క్షేత్రస్థాయిలో వారి పనితీరు ఆశాజనకంగా లేదు. దీంతో పార్టీలో నేతలను నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో అధిష్టానం మళ్లీ జిల్లా కమిటీల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే జూన్ నెలాఖరులోగా కమిటీల తంతు పూర్తి చేసేందుకు కసరత్తు మొదలెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ప్రయోజనం లేని ‘పరిశీలకుల’ ప్రక్రియ.. అందుకే జిల్లా కమిటీలకే మళ్లీ మొగ్గు జిల్లా కమిటీల విధానానికి స్వస్తి పలికిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలకు శ్రీకారం చుట్టింది. 2017 అక్టోబర్ 26న పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పలువురు సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించారు. పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుని ఈ జిల్లాకు చెందిన వారిని పొరుగు జిల్లాకు, పొరుగు జిల్లా నేతలను ఈ జిల్లాకు నియమించారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. అదే విధంగా హుజూరాబాద్తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల అప్పగించారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను సిద్దిపేట, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఒక్కరినీ నియమించారు. జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించాక కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ‘వి–కన్వెన్షన్’లో ఓ సమావేశం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటికీ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. దీంతో పార్టీ కేడర్ నియంత్రించే సి స్టం దెబ్బతినడంతో మళ్లీ జిల్లా కమిటీలవైపే అధిష్టానం మొగ్గు చూపింది. కొత్త సారథుల ప్రకటనపై ఉత్కంఠ నియోజకవర్గం సమన్వయ, పరిశీలన కమిటీల ప్రయోగం వికటించడంతో మళ్లీ జిల్లా కమిటీలపై అధిష్టానం మొగ్గుచూపగా.. కొత్త సారథులు ఎవరనే ఉత్కంఠ పార్టీ కేడర్లో మొదలైంది. అంతకు ముందు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మానకొం డూరుకు చెందిన జీవీ.రామకృష్ణారావు పేరు ఫైనల్కు వచ్చింది. అయితే ఆయనకు ‘సుడా’ చైర్మన్ దక్కడంతో ప్రస్తుతం కరీంనగర్కు చెందిన కట్ల సతీష్, వై.సునీల్రావు, హుజూరాబాద్ నుంచి బం డ శ్రీనివాస్, తన్నీరు శరత్రావు పేర్లు తెరమీదకు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి రఘువీర్సింగ్ను జిల్లా గ్రంథాలయ సంçస్థ పదవి వరించగా.. ప్రధానంగా కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణా రెడ్డి, కోరుకంటి చందర్ పే ర్లు వినిపిస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల నుంచి కల్వ కుంట్ల గోపాల్రావు, చిక్కాల రామారావు, మో హన్రెడ్డి, ప్రవీణ్ పేర్లు వినిపిస్తున్నా.. తోట ఆగయ్యకే ప్రాధాన్యం దక్కనుందంటున్నారు. జగి త్యాల నుంచి గతంలో డాక్టర్ ఎం.సంజయ్కుమార్, జువ్వాడి నర్సింగరావు, బాదినేని రాజేందర్, మిట్టపల్లి సుదర్శన్, ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, గొడిశాల రాజేశంగౌడ్ పేర్లు వినిపించాయి. రాజేశం గౌ డ్, శ్రీకాంత్కు నామినేటెడ్ పదవులు దక్కగా.. బా దినేని రాజేందర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకుని పోలీసుకేసుల వరకు వెళ్లారు. దీంతో డాక్టర్ సంజయ్కుమార్, జువ్వాడి నర్సింగరావు మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా టీఆర్ఎస్ నియోజకవర్గ కమి టీలు, సమన్వయకర్తల నియామకంపై వెనక్కి త గ్గి జిల్లా కమిటీలను నియమించేందుకు అధిష్ఠా నం మొగ్గు చూపుతుండటంతో పార్టీలో పదవుల కోసం ద్వితీయశ్రేణి నేతలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కాలం కావడంతో చిన్న ప దవిఉన్నా చక్రం తిప్ప వచ్చునని గులాబీ తమ్ము ళ్లు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరికీ దక్కుతాయన్న చర్చ ఆ పార్టీ కేడటర్లో హాట్ టాఫిక్గా మారింది. -
ఇసుక రీచ్లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి
– జిల్లాస్థాయి కమిటీకి జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్లను జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి ఫీజు బులిటీకి అవకాశం ఉందా లేదా అనే దానిపై వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. సోమవారం రాత్రి తన ఛాంబర్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుంగభద్రలో కౌతాళం మండలం గుడికంబాలిలో మూడు, నదిచాగిలో రెండు, హొళగుంద మండలం ముదటమాగిలో రెండు రీచ్లను గుర్తించినట్లు తెలిపారు. దేవనకొండ మండలంలోని హంద్రీ, ఇతర వాగులు, వంకల్లో ఏడు రీచ్లు గుర్తించామన్నారు. వీటిలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని పరిశీలించాలన్నారు. ఇందుకు ఇరిగేషన్ ఎస్ఈ, భూగర్భ జలవనరుల శాఖ డీడీ, మైనింగ్ ఏడీ, సంబంధిత ఆర్డీఓలు రీచ్లను పరిశీలించి వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హంద్రీ వెంట 36 గ్రామాలు ఉండగా లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉన్న గ్రామాలు 15 ఉన్నాయన్నారు. వీటిలో కూడా ఇసుక తీసేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రవీందర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్రావు, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి!
ఇక జిల్లా కమిటీలు లేనట్లే టీఆర్ఎస్లో గందరగోళం ముఖ్య నేతల నారాజ్ వరంగల్ : అధికార పార్టీ టీఆర్ఎస్లో పదవుల కోసం ఎదురుచూపులకు ఇప్పట్లో తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. నామినేటెడ్, ఇతర అధికార పదవుల విషయం పక్కనబెడితే... పార్టీ పదవుల విషయంలోనూ నేతలకు నిరాశే మిగులుతోంది. జిల్లాల పునర్విభజనతో అధికారిక, పార్టీ పరంగా ఎన్నో పదవులు పెరుగుతాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పలుసార్లు చెప్పారు. జిల్లాల పునర్విభజన జరిగి వరంగల్ జిల్లా... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా మారింది. దీంతో కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటవుతాయని, పదవులు వస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. అయితే, జిల్లా కమిటీల ఏర్పాటుపై టీఆర్ఎస్ అధినేత ఇటీవల చేసిన ప్రకటనలతో పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గత నెలలోనే మొదలైంది. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు, గ్రామ పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఏప్రిల్ 12, 13వ తేదీల్లో పార్టీ మండల కమిటీలను నియమించాలని సూచించారు. అనంతరం వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. కానీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్లో టీఆర్ఎస్ అధిష్టానం... జిల్లా కమిటీలపై ఎక్కడా ప్రస్తావించ లేదు. దీంతో జిల్లా కమిటీల ఏర్పాటు ఉండదనే విషయంలో స్పష్టత వచ్చింది. జిల్లా కమిటీలే లేని పరిస్థితి ఉండడంతో పదవులు సంగతి మరిచిపోవాల్సిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫలితంగా పదవులు ఆశించిన నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అప్పుడు అలా... రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన ప్రక్రియను నిర్వహించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే టీఆర్ఎస్ కొత్త జిల్లా కమిటీల ఏర్పాటుపై పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అప్పట్లోనే ప్రకటిస్తారని భావించినా జరగలేదు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి జిల్లా పార్టీ కమిటీల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అప్పుడూ కొత్త జిల్లాల కమిటీ నియామకం జరగలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో... వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గుడిమల్ల రవికుమార్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తక్కెళ్లపల్లి రవీందర్రావు, జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఎడవెల్లి కృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది. భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. వీరితోపాటు జిల్లా కమిటీలోనూ పదవులు ఉంటాయని.. ఇలా వందల మందికి పదవులు వస్తాయని నేతలు ఆశించారు. తాజాగా జిల్లా కమిటీలు ఉండవనే విషయం బయటికి రావడంతో పదవులు ఆశించిన వారు నిరాశకు గురవుతున్నారు. -
ఐక్యతతో సాగితేనే అభివృద్ధి
వినాయక్నగర్ : ఐకమత్యంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. వంజరులను ఎస్టీల్లో చేర్చే అంశంపై సీఎం కేసీఆర్తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యాస్ భవన్లో బుధవారం వంజరి సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీఎస్ ప్రసంగించారు. తన గురువు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో వంజరులను ఎస్టీ జాబితా నుంచి ఎందుకు తొలగించారో తనకు ఇప్పటివరకు తెలియదన్నారు. వంజరులను ఎస్టీల్లో చేర్చే అంశంపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమోనని, దీనిపై సీఎం కేసీఆర్తో చర్చిస్తానని చెప్పారు. ఫలానా రాష్ట్రంలో అదే జాబితాలో ఉంచారని, తమను కూడా చేర్చాలని కోరడం సరికాదని.. జీవనం విధానం, స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వంజరి సంఘం భవనానికి 500 గంజల స్థలం కావాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యం కోరగా.. ఎంపీ కవితతో మాట్లాడి వెయ్యి గజాలు ఇప్పిస్తానని డీఎస్ హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. కార్పొరేటర్లు శ్రీవాణి, దాత్రిక రేవతి, మయావర్ సాయిరాం, లక్ష్మిపతి, రవీందర్, ఆమంద్ విజయ్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఇదే.. వంజరి సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా బోనేకర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా గంగోనె మల్లేశ్, కోశాధికారిగా నవాతె నర్సయ్య, ఉపాధ్యక్షులుగా ఎల్లయ్య, గంగోనే గంగాధర్, కానుగంటి దేవెందర్, కాసం సాయిలు, విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శులుగా కాలేరు సుభాశ్, దాత్రిక రాజేందర్, భీంకుమార్, భూమేశ్, శ్రీనివాస్, సుజాత, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వెంకటేశ్, అంజయ్య, మారుతి, సంతోష్, నందకిషోర్, ప్రచార కార్యదర్శిగా గణేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. -
త్వరలో నాయీబ్రాహ్మణుల జిల్లా కమిటీల ఏర్పాటు
చిలకలపూడి : నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి జిల్లాల వారీగా త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీల ద్వారా నాయీబ్రాహ్మణులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఆర్థిక వనరులు పెంపొందించుకునేందుకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. 11 మంది సభ్యులు ఉన్న ఒక్కొక్క సంఘానికి రూ. 7 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని, ఈ మొత్తంలో 50 శాతం సబ్సిడీగా ఇస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నాయీబ్రాహ్మణులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి నిపుణులచే శిక్షణ ఇస్తామని, డోలు, నాదస్వరానికి నాదపాఠశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని చెప్పారు. దేవాదాయశాఖలో భజంత్రీల పోస్టులు భర్తీ చేసేలా మంత్రితో మాట్లాడామని చెప్పారు. దేవాలయాల్లో ఎలక్ట్రానిక్స్ డ్రమ్స్ను నిషేధించి నాయీబ్రాహ్మణులచే వాయిద్యాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెలలో నాయీబ్రాహ్మణ సంక్షేమంపై అధ్యయన కమిటీ ఏర్పాటు చే స్తామని వివరించారు. ఫెడరేషన్ డైరెక్టర్ ఇమ్మనపూడి విజయకుమార్, సీహెచ్ వీరవసంతరావు, జి. యలమందరావు, రాయపూడి చిన్ని పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement