-
బ్రిజేశ్ ముందుకు బ్రహ్మాస్త్రం!
ట్రిబ్యునల్ ముందు స్వయంగా వాదనలు వినిపించనున్న కేసీఆర్! - హాజరుకావాల్సిందిగా ఆహ్వానించిన అధికారులు, న్యాయవాదులు - దీనిపై ముఖ్యమంత్రితో ప్రాథమిక చర్చలు - కేసీఆర్ దాదాపుగా ఓకే చెప్పినట్లు నీటి పారుదల వర్గాల వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదం, నీటి లెక్కలు, తెలంగాణకు దక్కాల్సిన వాస్తవ వాటాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట సీఎం కె.చంద్రశేఖర్రావు స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ అంశంలో అధికారుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తుది వాదనల సమయంలో కచ్చితంగా ట్రిబ్యునల్ ముందు హాజరై వాదనలు వినిపిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణా జలాల్లో వాస్తవ కేటాయింపులు, జరుగుతున్న వినియోగం, ఉమ్మడి ఏపీలో జరిగిన నష్టం, కొత్త ప్రాజెక్టులకు వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు, నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై ముఖ్యమంత్రితో చర్చలు సైతం జరిపినట్లు తెలిసింది. కేంద్రం, ట్రిబ్యునల్ల తీరుతో నిరాశ కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలంటూ మూడున్నరేళ్లుగా రాష్ట్రం విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. కేంద్రం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ కృష్ణా జలాల పంపిణీపై విచారణను తెలంగాణ, ఏపీలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా తెలంగాణ గోడును ఏమాత్రం వినిపించుకోవడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు జరిపిన నికర, మిగులు జలాల కేటాయింపుల జోలికి వెళ్లకుండా.. కేవలం క్యారీ ఓవర్ జలాలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు కేంద్ర నిర్ణయం, ఇటు ట్రిబ్యునల్ తీరు రెండూ తెలంగాణకు అశనిపాతంగా మారాయి. ‘పూడిక’ లెక్కలు తీద్దాం! ఇక నాగార్జున సాగర్ నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలుకాగా పూడిక కారణంగా సామర్థ్యం ప్రస్తుతం 312 టీఎంసీలకు తగ్గిపోయిందని.. శ్రీశైలంలోనూ 312 టీఎంసీల నుంచి 215 టీఎంసీలకు తగ్గిందని కేసీఆర్ అధికారులకు వివరించినట్లు తెలిసింది. రెండు ప్రాజెక్టుల్లో పూడికతో తగ్గే నీటిని పాలమూరు, డిండి ప్రాజెక్టులకు మళ్లిద్దామని ప్రాతిపాదన చేద్దామని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలపై తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు వస్తానని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బోర్డు ముందు ముఖ్యమంత్రి ఏ హోదాలో హాజరవుతారు? దానికి ముందుగానే బోర్డు అనుమతి తీసుకోవాలా? అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నా.. అవి ఇరు రాష్ట్రాలు సమ ర్పించిన అఫిడవిట్లు, కౌంటర్లు కేంద్రంగా ఉండనున్నాయి. దీంతో తీర్పు వెలువరించే ముందు పూర్తిస్థాయిలో జరిగే తుది వాదనల సమయంలో ముఖ్యమంత్రి హాజ రయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్యాయాన్ని ఎండగడదాం.. కృష్ణా జలాల అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని... పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని అయినా కేటాయింపులు పెంచాల్సిందేనని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్కు 12 టీఎంసీలు ఇచ్చి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించిన అంశాన్ని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో సైతం ఈ అంశాలను లేవనెత్తినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందు తేల్చుకోవాల్సిందేనని నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులు ఇటీవల ముఖ్యమంత్రికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. చివరి అస్త్రంగా మీరే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు రావాలని వారు కేసీఆర్ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు నీటి పారుదల ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి. -
దామాషా పద్ధతిన పంచాలి
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గినప్పుడు దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా దామాషా పద్ధతిలో నీటి పంపిణీ అమలయ్యేలా చూడాలని. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్(కార్యనిర్వాహక నియమావళి) ముసాయిదా రూపకల్పన కోసం ఏర్పాటైన ఏకే బజాజ్ కమిటీకి సైతం ఈ లేఖను పంపనుంది. ఇక ఈ ఏడాది నీటి లభ్యత బాగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొందని.. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టు ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసేలా కేంద్ర జోక్యం ఆవశ్యకమని భేటీలో బోర్డు, తెలంగాణ, ఏపీలు అభిప్రాయపడ్డాయి. ఎగువన భారీ వర్షాలు కురిసినా.. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలోని అమరావతిలో మంగళవారం కృష్ణా బోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ ఎస్కే శ్రీవాత్సవ, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్కుమార్, ఈఎన్సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్లు ఇందులో పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి.. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండాయని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అయినా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని.. కేటాయించిన జలాలకన్నా అధికంగా వినియోగించుకుంటున్నాయని వివరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికి మించి తగ్గిపోయాయని పేర్కొన్నారు. నీటి లభ్యత తగ్గిన సందర్భాల్లో.. దిగువ రాష్ట్రాలకు న్యాయం జరిగేలా దామాషా పద్ధతిలో నీటి పంపిణీని అమలు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని బోర్డును కోరారు. ఈ ప్రతిపాదనతో ఏకీభవించిన బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ.. కేంద్రానికి లేఖ రాస్తామని, అవసరమైతే స్వయంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు. టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుపై విభేదాలు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఇరు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు తొలిదశలో 18 చోట్ల టెలిమెట్రీ మీటర్లను బోర్డు ఏర్పాటు చేయగా.. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. తెలంగాణ పోతిరెడ్డిపాడు వద్ద అదనంగా టెలిమీటర్లను ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించింది. కానీ రెండో దశలో మరో 29 ప్రాంతాల్లో టెలిమీటర్ల ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనపై మాత్రం ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏర్పాటు చేసిన టెలిమీటర్ ద్వారా తమ నీటి వినియోగం లెక్కలు తేలాక.. వెలిగోడు, గాలేరు–నగరి, సోమశిల, కండలేరు జలాశయాల వద్ద టెలిమీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, దిగువ కాలువ ద్వారా నీటి వినియోగం లెక్కలను తుంగభద్ర బోర్డు ఎప్పటికప్పుడు ప్రకటిస్తోందని.. అలాంటప్పుడు అక్కడ టెలిమీటర్ల ఏర్పాటు అనవసరమని పేర్కొంది. వీటితోపాటు ఏపీలోని మరో 17 ప్రాంతాల్లో టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదననూ ఏపీ వ్యతిరేకించింది. అసలు టెలిమీటర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని.. ఆ తర్వాతే రెండో దశ టెలిమీటర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించింది. దీంతో టెలిమెట్రీ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు వచ్చే నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్లో సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది. డీపీఆర్లు సమర్పించాలన్న బోర్డు కృష్ణా పరీవాహక ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టారంటూ ఏపీ, తెలంగాణలు ఒకరిపై ఒకరు కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేప థ్యంలో నెల రోజుల్లోగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు ఇవ్వా లని ఇరు రాష్ట్రాల అధికారులను ఎస్కే శ్రీవాత్సవ కోరారు. ఇక చిన్ననీటి వనరుల కింద నీటి వినియోగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన సబ్కమిటీ తేల్చాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కృష్ణా బోర్డు నిర్వహణకు అయ్యే వ్యయాన్ని చెరి సగం భరించేందుకు ఆమోదం తెలిపాయి. అయితే 52 మంది సిబ్బందిని సమకూర్చాలన్న బోర్డు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. 25 మంది సిబ్బందికి ఓకే చెప్పాయి. కాగా ఏకే బజాజ్ కమిటీ నివేదిక మేరకే కృష్ణా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ను ఖరారు చేయాలని ఇరు రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. అదే నిష్పత్తిన పంపిణీ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున చేసిన తాత్కాలిక సర్దుబాటు పంపిణీనే ఈ ఏడాది కూడా అమలు చేయాలని బో ర్డు నిర్ణయించింది. 812 టీఎంసీల కన్నా అధికంగా నీటి లభ్యత ఉంటే.. ఇదే నిష్పత్తిన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసా ్తమని పేర్కొంది. కేంద్రం దీనిని పునఃసమీక్షించే వరకు గానీ, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యే వరకుగానీ ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement