disney world
-
ఐదేళ్ల చిన్నారికి కార్డియాక్ అరెస్టు..20 సెకన్ల పాటు..!
యూఎస్లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్లోని థీమ్ పార్క్ వాల్డ్ డిస్నీ వరల్డ్లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్కోస్టర్ను రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ముగిసిన వెంటనే తన కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం. ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?) -
ఆర్టిఫిసికల్ ఇంటిలిజెన్స్ ద్వారా క్రికెటర్స్ డిస్నీ క్యారెక్టర్స్ ఎపుడైనా చూశారా?
-
బతకాలనే కోరిక.. సాటి మనుషులపై నమ్మకం
ఫ్లోరిడా : అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అదే అడిగితే ఎవరో ఒకరు స్పందిస్తారు. తమకు తోచిన సాయం చేస్తారు. అందుకు ఈ ఘటన చక్కటి ఊదాహరణగా నిలుస్తోంది. సహాయాన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కోరతారు. కొత్త ఆలోచనతో సరికొత్త పద్థతిలో సహాయాన్ని కోరి విజయం సాధించాడు లీబౌట్జ్. శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీ సక్రమంగా పనిచేయక, కొన్ని రోజుల్లోనే మరణిస్తామని తెలిసినప్పుడు ఎవరైనా కుంగిపోతారు. కానీ లీబౌట్జ్ మాత్రం తన కిడ్నీ 5 శాతమే పనిచేస్తుందని తెలిసినా.. ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. కిడ్నీ దాతల కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. బతకాలనే కోరిక చావలేదు. చివరికి సాటి మనుషులపై ఉన్న నమ్మకంతో వినూత్న ప్రయత్నం చేశాడు. తన బాధను ఇతరులతో పంచుకోవాలని, వారి నుంచి సహాయం పొందాలని భావించాడు. ఇందుకు ఎల్లప్పుడూ సందర్శకులతో రద్దీగా ఉండే డిస్నీ వరల్డ్ని ఎంచుకున్నాడు. తన అవస్థని ఇతరులకు తెలుపడానికి విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన టీషర్ట్ పైన బ్లడ్ గ్రూపు 'ఒ' పాజిటివ్ అని, తనకు కిడ్నీ కావాలని సందేశాన్ని తెలుపుతూ తన ఫోన్ నెంబర్ని రాశాడు. ఆ టీషర్ట్నే వేసుకుని, అక్కడే వారం రోజులపాటు తిరుగుతూ ఉన్నాడు. దీనిని గమనించిన కొందరు సందర్శకులు అతని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పుడే అతని ప్రయత్నానికి ముందడగు పడింది. ఒక్క రోజులోనే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్క రోజులో 32వేల షేర్లు, వారం రోజుల్లో 90వేల షేర్లు వచ్చాయి. మానవత్వం బతికే ఉందటూ లీబౌట్జ్కు కిడ్నీ ఇవ్వడానికి వందలాది మంది దాతలు ముందుకొచ్చారు. వారిలో నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా... అందులో రిచీ సల్లీ అనే వ్యక్తి శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు డాక్టర్లు చెప్పారు. కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. కానీ జీవితంపై ఆశతో లీబౌట్జ్ చేసిన ప్రయత్నం విజయం సాధించింది. కాగ, లిబౌట్జ్ దాదాపు 15 ఏళ్లుగా ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. -
ఇర్మా ఎఫెక్ట్.. వాల్ట్ డిస్నీవరల్డ్ మూత
ఫ్లోరిడా: అమెరికాలో విధ్వంసం సృష్టిస్తున్న హరికేన్ ఇర్మా సెగ ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీవరల్డ్ రిసార్ట్కు కూడ తగిలింది. ఇర్మా తుఫాను ప్రభావంతో వాల్ట్ డిస్నీవరల్డ్ రిసార్ట్ రెండు రోజులు మూసివేశారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న ఔత్సాహికులకు రిసార్టు అధికారులు డబ్బుల తిరిగిచ్చేశారు. అయితే కొన్ని థర్డ్ పార్టీ కంపెనీలు మాత్రం డబ్బులు తిరిగివ్వలేదు. గత 45 ఏళ్ల చరిత్రలో డిస్నీవరల్డ్ మూతబడటం ఇది ఆరోసారి మాత్రమే. భద్రతా కారణాల దృష్ట్యా రిస్టార్ట్ను ఆది, సోమవారం మూసివేస్తున్నట్లు, తిరిగి మంగళవారం తెరుస్తామని రిసార్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇక గత అక్టోబర్లో కూడా హరికేన్ మాథ్యూ దెబ్బకు ఈ రిసార్ట్ గేట్లు మూతబడ్డాయి. సౌత్వెస్ట్ ఓర్లాండోలో 25వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ రిసార్ట్లో మ్యాజిక్ కింగ్డమ్, ఈపికాట్, యానిమల్ కింగ్డమ్, హలీవుడ్ స్టూడియోలతో నాలుగు మెయిన్థీమ్ పార్కులున్నాయి. ఇంకా వాటర్ పార్క్లు, హోటల్స్, ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లున్నాయి. థీమ్డ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ గతేడాది రిపోర్టు ప్రకారం మ్యాజిక్ కింగ్డమ్ పార్కు ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందినది. 2016లో ఈ పార్కును 20 మిలియన్ల మంది సందర్శించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇక రిసార్ట్ ఉద్యోగుల సంఖ్య 73,000. డిస్నీవరల్డే డిస్నీ కంపెనీకి ముఖ్యమైన రెవెన్యూ ఆధారం. హరికేన్ ఇర్మా డిస్నీకి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. -
హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే!
-
హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే!
అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. తన విధానాలను స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్1బి వీసాలతో వచ్చిన విదేశీయులు పనిచేయడానికి తాను ఏమాత్రం అనుమతించేది లేదని చెప్పారు. డిస్నీ వరల్డ్ సహా పలు అమెరికన్ కంపెనీలలో చాలామంది భారతీయులు హెచ్1బి వీసాలతో వచ్చి పనిచేస్తున్నారు. అలాంటి కంపెనీలపై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు. కేవలం వీసాల విషయాన్ని ప్రస్తావించడమే కాక, డిస్నీలాండ్ లాంటి కొన్ని కంపెనీల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తాను కొంతమంది అమెరికన్లను కలిసినప్పుడు... తమ ఉద్యోగాలు పీకేశారని, తమ స్థానంలో విదేశీయులను నియమించుకుంటున్నారని వాళ్లు చెప్పారని ట్రంప్ అన్నారు. ఇలాంటివి ఇక ఏమాత్రం జరగనిచ్చేది లేదని హెచ్చరించారు. దాంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు మార్మోగించారు. ఉద్యోగాలు పీకేయడమే కాక.. కొత్తగా వచ్చేవాళ్లకు ట్రైనింగ్ ఇస్తే తప్ప చివర్లో ఇవ్వాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వలేదని, ఇది మరింత దారుణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. డిస్నీ వరల్డ్, మరో్ రెండు ఔట్సోర్సింగ్ కంపెనీలపై వాటిలో ఇంతకుముందు పనిచేసిన టెక్నాలజీ సిబ్బంది కేసులు దాఖలు చేశారు. తమ ఉద్యోగాలు పీకేసి, తక్కువ జీతాలకు హెచ్1బి వీసాలపై వచ్చే విదేశీయులను నియమించుకున్నారని, వాళ్లలో ఎక్కువ మంది భారతీయులేనిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డిస్నీవరల్డ్లో మొత్తం 250 మందిని 2015 జనవరిలో ఇలా పీకేశారు. హెచ్సీఎల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కూడా ఇలా చేసిన కంపెనీల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ ట్రంప్ తేబోయే కొత్త చట్టాలతో ఇబ్బంది పడక తప్పదు. -
దాన్ని చంపేశారు!
ఆర్లెండో: డిస్నీ రిసార్ట్లో రెండేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్న మొసలిని అమెరికాలోని అధికారులు అంతమొందించారు. చిన్నారి ప్రాణాలు తీసిన మొసలిని పట్టుకుని చంపేశామని ఫ్లోరిడా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 15న విహారం కోసం తల్లిదండ్రులతో కలిసి డిస్నీ గ్రాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాకు వెళ్లిన లేన్ గ్రేవ్స్(2)ను మొసలి నీళ్లలోకి లాక్కుపోయింది. 16 గంటల తర్వాత చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మొసలి తినేయడం వల్లే చిన్నారి మృతి చెందినట్టు గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ ప్రాంతంలో ఆరు మొసళ్లను పట్టుకుని వేరే ప్రదేశానికి తరలించారు. మృతుడి దేహం నుంచి సేకరించిన డీఎన్ఏతో దాడి చేసిన మొసలిని గుర్తించి దాన్ని చంపేశారు. ఈ విషయాన్ని ఫ్లోరిడా వన్యప్రాణి సంరక్షణ అధికారులు ధ్రువీకరించారు. తమ కొడుకు మరణానికి కారణమైన మొసలిని చంపడంపై లేన్ గ్రేవ్స్ తల్లిదండ్రులు ఎటువంటి కామెంట్ చేయలేదు. మరోవైపు డిస్నీ రిసార్ట్లో ఎక్కడిక్కడ జాగ్రత్త సూచికలు పెట్టారు. -
రాచకొండలో డిస్నీ వరల్డ్
* ‘సాక్షి’తో పేర్వారం రాములు * తెలంగాణ పర్యాటకాభివృద్ధి * సంస్థ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ * రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తెస్తా * కేబీఆర్ పార్కులో‘లండన్ ఐ’ నిర్మిస్తాం * హుస్సేన్సాగర్, నాగార్జునసాగర్లలో వాటర్వరల్డ్ సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి వేళ ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల చిత్రవిచిత్ర ఆకృతులు అలరిస్తాయి. గోరుకొయ్యలు, సప్తరుషి మండలం, ధ్రువతార... ఇలా వాటికి పేర్లెన్నో. రాత్రివేళ కొన్ని పక్షులు కిలకిలారావాలతో పలకరిస్తాయి. వాటితోపాటు ఇతర జంతుజాలం చేసే శబ్దవిన్యాసాలు ఆస్వాదిస్తూ నక్షత్ర భ్రమణాన్ని పరికిస్తుంటే ఆ అనుభూతే వేరు. కానీ నేటితరానికి వాటి మజానే తెలీదు. వీలు చిక్కితే సెల్ఫోన్లతో గడిపే యువత కు ఆ అనుభూతిని కలిగించాలనేది నా ఆకాంక్ష. దాన్ని పర్యాటక రంగ పురోగతితో ముడిపెట్టి ముందుకు తీసుకెళ్తా’ అని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పేర్వారం తన ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిస్నీవరల్డ్ను తెలంగాణకు తెప్పించటం, అద్భుతాల్లో అద్భుతంగా భావించే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్ను ఆవిష్కరించటం ఆయన ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. కేంద్రం అందించే పర్యాటక నిధులను గరిష్ట స్థాయిలో పొంది, రాష్ట్రప్రభుత్వ నిధుల వాటాను పెంచి రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తేవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... * రాచకొండను ఫిల్మ్ స్టూడియోగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపు 2 వేల ఎకరాల్లో డిస్నీ వరల్డ్ ఏర్పా టు చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని ఇక్క డ సాకారం చేసే ప్రతిపాదన చేస్తున్నాం. * దాదాపు 565 అడుగుల ఎత్తుతో ఉండే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్ను కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేయాలని ఉం ది. ఆరు ఎకరాల స్థలం దీనికి అవసరం. ఇందుకు 40 కోట్ల వరకు ఖర్చవుతుంది. * భువనగిరి, రామగిరి ఖిల్లా, వికారాబాద్ అనంతగిరుల్లో పారాగ్లైడింగ్ ఏర్పాటు చేస్తాం. * ఆదిలాబాద్-ఖమ్మం మధ్య గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న గుట్టల్లో ట్రెక్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. * మెదక్ జిల్లాలోని ఝరాసంగం, ఏడుపాయల గుడులను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. * హుస్సేన్సాగర్ ప్రక్షాళన తర్వాత అందులో, నాగార్జునసాగర్లో నీటి అంతర్భాగంలో వాటర్ వరల్డ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. * వరంగల్ జిల్లాలోని రామప్ప, పాకాల, లక్నవరం చెరువుల్లో వాటర్ స్కీయింగ్ ఏర్పాటు చేస్తాం. * రాణీ రుద్రమదేవి కన్నుమూసిన నల్లగొండ జిల్లా చెందుపట్లను, కంచర్ల గోపన్న జన్మస్థలం నేలకొండపల్లిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం. -
షూటింగ్ మహాల్స్
సినిమా షూటింగ్లు అనగానే.. అయితే ఇన్డోర్ లేదంటే అవుట్డోర్లో జరుగుతాయి. ఇన్డోర్ అన గానే ఫేమస్ స్టూడియోలు నగరంలో ఉండనే ఉన్నాయి. అవుట్డోర్ విషయానికి వస్తే.. కథ డిమాండ్ను బట్టి ఇక్కడి పల్లెటూరు నుంచి అమెరికాలోని డిస్నివరల్డ్ వరకూ లొకేషన్లే లొకేషన్లు. ఇక పాటల సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ అటుంచితే ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్లకు అదిరిపోయే ఇళ్లు సినిమాలకు సెట్టింగ్లుగా మారుతున్నాయి. యజమానుల అభిరుచికి తగ్గట్టుగా.. అడుగడుగునా అందంగా తీర్చిదిద్దిన లోగిళ్లు సినిమా వాళ్ల మనసులను కట్టిపడేస్తున్నాయి. తమ కలల సౌధాన్ని మెచ్చి షూటింగ్ కోసం వచ్చిన సినీజనులకు కాదనకుండా కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు ఆ ఇంటి యజమానులు. అందమైన ఇల్లు, ఇంటి ఆవరణ వంటి దృశ్యాలకు ప్రత్యేకంగా సెట్లు వేయాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. సమయం కూడా చాలా వృథా అవుతుంది. అందుకే రిచ్గా ఉండే హౌస్లను నమ్ముకుంటున్నారు నిర్మాతలు. నగరంలో ఇలాంటి ఇళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి ఇళ్లను కొన్ని రోజులు బుక్ చేసుకుని తక్కువ మొత్తంలోనే పని కానిచ్చేస్తున్నారు. సినిమాలపై అభిమానం, వెండితెరపై తమ ఇల్లు కనిపిస్తుందన్న ఆశ.. పెపైచ్చు ఆర్థికంగా కూడా లాభసాటిగా ఉండటంతో ఇళ్ల యజ మానులూ షూటింగ్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. రిచ్ అండ్ రియల్.. అరుంధతి సినిమాలో ‘డోలారే డోరాలే ధమ్’ సాంగ్ గుర్తుందా.. ఆ పాట చిత్రీకరించిన అందమైన లోగిలిని ఒక్కసారి రీకాప్ చేసుకుని చూడండి..! సెట్టింగ్ అదరహో అనిపిస్తుంది కదా..! అది సెట్టింగ్ కాదండి బాబు.. రియల్ హోమ్. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి బ్యాక్సైడ్ ఉంటుంది. పద్నాలుగేళ్ల కిందట షూటింగ్ లొకేషన్గా మారిన ఆ ఇంటి పేరు ‘అనూప్ హౌస్’. ‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవికి, జయప్రకాశ్నారాయణకు మధ్య జరిగే ఫైట్ సీన్ కూడా ఈ ఇంట్లో షూట్ చేసిందే. ‘సింహా’ మూవీలో కూడా ఈ ఇంటి అందాలు మనకు కనిపిస్తాయి. ఇంద్రభవనాన్ని తలపించే ఈ రెండంతస్తుల బిల్డింగ్లో వందలాది సినిమాల షూటింగ్లు జరిగాయి. ఇంటి ఆవరణలో రకరకాల పూలమొక్కలు.. ఫుల్ రిచ్గా ఉంటుందా లొకేషన్. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే ఖరీదైన సోఫాలు.. ఎదురుగా మెట్లు.. ఆకర్షణీయమైన అలంకరణ వస్తువులతో.. అదరహో అనిపిస్తుంది. హై బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అనూప్ హౌస్ దాదాపు సినిమావాళ్లందరికీ సుపరిచితమే. ఆ ఇంటి యజమాని అనూప్ ఓ డాక్టర్. సినిమాలపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఎంతో మక్కువతో తన ఇంటిని షూటింగ్లకు ఇస్తుంటారు. క్లాస్ అండ్ క్లాసిక్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ‘సాయితేజ’ అపార్ట్మెంట్ టై తరచూ సినిమా లొకేషన్గా మారిపోతుంటుంది. పది రోజుల కిందటే ఈ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ‘ఎర్రబస్సు’ సినిమా చిత్రీకరణ చేసుకుంది. ఈ అపార్ట్మెంట్ యజమాని రవీంద్రారెడ్డి. వృత్తిరీత్యా బిల్డర్ కావడంతో తన ఇంటిని అందరికంటే భిన్నంగా, చాలా అందంగా డిజైన్ చేసుకుని కట్టుకున్నారు. టె ర్రస్పై విశాలంగా ఇంటిని నిర్మించుకోవడంతోపాటు అక్కడే గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా చేయించుకున్న వాల్ మ్యూరల్స్ ఈ గార్డెన్ కు ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు అడుగడుగునా శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. రాత్రిపూట టై మొత్తం రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతుంటుంది. రెండేళ్లుగా ఈ ఇంట్లో ఇరవైకి పైగా సినిమాలు చిత్రీకరించారు. ఇంటి లోపల లేటెస్ట్గా డిజైన్ చేసిన ఓపెన్ కిచెన్, విశాలమైన హాల్ కూడా షూటింగ్లో పాలుపంచుకుంటున్నాయి. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 26లో ఉన్న ‘ఛత్రపతి హౌస్’లో కూడా షూటింగ్లు చాలా జరుగుతుంటాయి. ఛత్రపతి సినిమాలోని చాలా సీన్లు ఆ ఇంట్లో షూట్ చేయడం వల్ల ఆ ఇంటి పేరు అలా నిలిచిపోయింది. హౌస్ ఈజ్ బ్యూటిఫుల్ ఈమధ్యే విడుదలైన లౌక్యం సినిమాలోని కొన్ని సీన్లు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72, ఇంటి నంబర్ 96-3లో చిత్రీకరించారు. ఆ ఇంటి యజమానికి కూడా సినిమాలంటే ఇష్టం. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేసుకున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, పైసా, పవిత్ర, ఓ లైలా కోసం వంటి సినిమాల్లోని ఇంటి లోపల సీన్లు చాలా వరకూ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ లొకేషన్కు తగ్గట్టుగా ఈ ఇంట్లో నిజమైన చెట్లతో పాటు వాటికి అతికించిన ఆర్టిఫిషియల్ మొక్కలు అందర్నీ ఆకర్షిస్తాయి. అందుకే ఈ ఇల్లు సినిమా లొకేషన్గా మారింది. - భువనేశ్వరి ఫొటోలు: సృజన్ పున్నా