-
బల బాంధవి
నిజామాబాద్కి చెందిన తోకల శ్రీదేవి. ఇంటర్మీడియెట్ వరకు చదువు కున్నారు. పాత కాలం నాటి పద్ధతులలో.. నాటి వంటకాల తయారీలో ప్రత్యేకతను నిలుపుకున్నారు. తక్కువ ధరకే బలవర్ధకమైన ఆహారాన్ని ఎలా తయారుచేసుకోవచ్చో పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలియజేస్తూ ‘బల బాంధవి’ అని పేరుతెచ్చుకున్నారు. ఇండియన్ డైటిక్ అసోసియేషన్ కార్యక్రమాల్లో ఆమె తయారు చేసిన పదార్థాలను పంపిణీ చేయడం విశేషం. పౌష్టికాహారం డబ్బున్న వారికి అందుబాటులో ఉంటుంది. అవగాహనా ఉంటుంది. మరి రెక్కాడితేగానీ డొక్కాడని వ్యవసాయ కూలీలు., బీడీ కార్మికులు, పేద, మధ్య తరగతి వారి మాటేమిటి.? బీడీలు చుట్టే మహిళలు రోజుకు 12 గంటల పాటు కూర్చునే పని చేయాల్సి ఉంటుంది. ఆకులోని దుమ్ము, ధూళి., ఆరోగ్యానికి హానికరమైన పొగాకుతో గంటల తరబడి పనిచేస్తుంటారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయ కూలీ పనిచేస్తే దక్కే కూలీ డబ్బులతో ఖరీదైన పౌష్టికాహారం ఎలా తినగలరు? ఇలాంటి సవాళ్లకు పరిష్కారం చూపుతున్నారు తోకల శ్రీదేవి. అతి తక్కువ ఖర్చుతో పాత తరహా వంటకాల్లో ఉండే పోషక విలువలు, వాటి తయారీ విధానంపై గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ప్రాచీన వంటకాల ఆవశ్యకత గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, బిజీ జీవితాలు గడిపే పట్టణ, నగర వాసులు కూడా సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. రెడీ టు ఈట్.. ఫాస్ట్ ఫుడ్.. పేర్లు వేరైనా ఆరోగ్యానికి హాని చేసే ఆహారంతో బీపీ, షుగర్, మధుమేహం.. వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వీరికి పౌష్టికాహారం విలువ గుర్తు చేస్తూ పాత తరహా వంటకాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. ‘మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం..’ అని ఆమె అంటున్నారు. అందుబాటులో ఉండే పదార్థాలతో... పేద మధ్య తరహా కుటుంబాలకు అందుబాటలో ఉండే దొడ్డుబియ్యం., కంది, పెసర, మినప వంటి పప్పుధాన్యాలు, రవ్వ, జీలకర్ర, ధనియాలు, రాగులు, జొన్నలు, బెల్లం, పల్లీలు వంటి చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలతో ఎంతో బలవర్థకమైన ఆహారం ఎలా తయారు చేసుకోవచ్చనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. వీటిని ఉపయోగించి చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు , మహిళలు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, స్థూలకాయులు, ఉద్యోగులు, కౌమారదశలో ఉన్న బాలికలకు ఉపయోగపడే వంటకాల తయారీని వివరిస్తున్నారు. బీడీ కార్ఖానాలు, గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు, నగరంలో ఉండే గృహిణులకు వీటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అందుబాటులో ఉండే పౌష్టికాహారం ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు వివరిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ వంటలను తయారు చేసి చూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్న శ్రీదేవికి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా గుర్తింపు దక్కింది. ఇండియన్ డైటిక్ అసోసియేషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ కాన్ఫరెన్స్లో పాల్గొని ప్రసంగించారు. నాబార్డు, ఎఫ్సీఐ, ఎన్.ఐ.ఆర్.డి, ఐకేపీ, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండియన్ నీడికల్ అసోసియేషన్ వంటి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలలో, సెమినార్లలో శ్రీదేవి పాల్గొనడంతో పాటు తను ఏ విధంగా నాటి వంటకాలను బలవర్ధకంగా తయారుచేస్తుందో చేసి చూపించారు. పదేళ్లుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీదేవికి రాష్ట్ర ప్రభుత్వ మహిళ, శిశు సంక్షేమశాఖ నుంచి, ఫ్యాప్సీ సంస్థల నుంచి ఉత్తమ ప్రతిభా పురస్కారాలు వచ్చాయి. స్థానిక స్వచ్ఛంద సంçస్థలు నవోజ్యమీ సక్సెస్ఫుల్ మెంటర్ అవార్డు అందిం చాయి. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కూడా శ్రీదేవి సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్లు అందజేశారు. అనారోగ్యం పాలు కావద్దనే.. పేద, మధ్య తరగతి వారికి పౌష్టికాహారంపై అవగాహన ఉండదు. తినే ఆహారంలో పోషకాల గురించి వారికి తెలియదు. అలాంటి వారికి అందుబాటులో ఉండే తృణ, చిరు ధాన్యాలతో తయారు చేసుకోగల వంటకాలను వివరిస్తున్నాను. ఈ అవగాహన వల్ల తక్కువ ఖర్చుతోనే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోగలుగుతారు. దీంతో వారు వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. సరైన ఆహారం లేక నిరుపేదలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారు. వైద్యం కోసం చేసే ఖర్చు తగ్గుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఏ దశలోనూ అనారోగ్యం సమస్య దరి చేరదు. – టి.శ్రీదేవి – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
టీవీ వంటల ప్రోగ్రామ్తో కనువిందే చేసుకోండి
మీకు టీవీల్లో వంటల కార్యక్రమాలు చూసే అలవాటుందా? అవి చూశాక వాటిని ఇంట్లో తయారు చేసుకునే అలవాటు కూడా ఉందా? అలా అయితే కాస్త జాగ్రత్త అని చెబుతున్నారు పరిశోధకులు. వీళ్ల అధ్యయన వివరాలన్నీ ‘ఎపిటైట్’ అనే హెల్త్ జర్నల్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం... 20 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న దాదాపు 500 మంది మహిళలను ఎంపిక చేశారు ఈ అధ్యయనవేత్తలు. వీళ్లను రెండు వర్గాలుగా విభజించారు. వారే... వ్యూవర్స్ అండ్ డూవర్స్. అంటే కేవలం వంటల కార్యక్రమాన్ని చూసేవారూ, చూసినవి చేసేవారు అని వర్గీకరించారు. చూసి ఆనందించేవారితో పోల్చినప్పుడు, వాటిని ఇంట్లోనూ వండి తినే వారు చాలా కొద్ది సమయంలోనే సగటున దాదాపు 5 కిలోల (పదకొండు పౌండ్లు) బరువు పెరిగినట్లు గమనించారు. ఈ బరువు చాలా ఎక్కువనీ, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పైగా చూసినవి, చేసుకుని తినేవారిలో చాలామందికి పొట్టపెరగడం (సెంట్రల్ ఒబేసిటీ) పెరిగిందట. ఇది గుండెజబ్బులు మొదలుకొని ఆరోగ్యానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని ‘ఎపిటైట్’ జర్నల్లో హెచ్చరించారు సదరు పరిశోధకులు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement