-
ఈడీ డైరెక్టర్ను కొనసాగిస్తాం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకూ పెంచేందుకు అనుమతి కోరుతూ కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 63 ఏళ్ల మిశ్రా పదవీకాలాన్ని పదేపదే పెంచడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టడం తెలిసిందే. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమీక్షకు సంజయ్ కుమార్ గైర్హాజరైతే భారత ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అందువల్ల తమ పిటిషన్పై జూలై 28లోగా విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థలో రెండు డైరెక్టర్ పోస్టుల నియామక ప్రక్రియ సోమవారం హైదరాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో జరిగింది. పోటీ పడుతున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకున్నాక ఇద్దరి ని ఎంపిక చేశారు. మణుగూరు ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డిని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్గా, ఆండ్రియాల ప్రాజెక్ట్ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ను డైరెక్టర్(ఆపరేషన్స్)గా నియ మిస్తూ సింగరేణి సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీకాలం రెండేళ్లు. కాగా, సింగరేణిలో డైరెక్టర్(పా) పోస్టు ఖాళీగానే ఉంది. -
ఆర్కామ్లో డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారని స్టాక్ ఎక్సే్ఛంజ్లకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన ఈ కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఇందులోభాగంగానే సంస్థ డైరెక్టర్గా అనిల్ రాజీనామాచేశారు. సీఎఫ్ఓ మణికంఠన్ సైతం రాజీనామాను సమర్పించారు. -
ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీకి డీల్!
హన్మకొండ : ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీపై డీల్ మొదలైంది. సీఎండీ కార్తికేయ మిశ్రాను బదిలీ చేయడం... ఓ సీజీఎంను ఇక్కడికి సీఎండీగా తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుత సీఎండీని బదిలీ చేసేందుకు గత ఏడాది కూడా సంస్థలోని పలు ఇంజినీరింగ్ యూనియన్లు భారీ ఎత్తున పైరవీలు చేశాయి. అప్పుడే రూ. 2 కోట్లకు బేరం పెట్టారు. తాజాగా .... కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. సీఎండీ, డెరైక్టర్ పోస్టు కోసం ఆశతో ఉన్న అధికారుల తరఫున ఇద్దరు మంత్రుల వద్ద ఇప్పటికే రాయబారం నడుపుతున్నారు. దీనిపై ఇప్పటికే కాంట్రాక్టర్లు ఇద్దరు మంత్రులను కలిశారు. వారి వెంట సీఎండీ కుర్చీ కోసం ఆశపడుతున్న ఓ అధికారిని తీసుకెళ్లినట్లు సమాచారం. నిజామాబాద్లో మంత్రి సన్నిహితుడిగా ఉన్న ఓ ఏడీఈ... పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించినప్పుడు మరో మంత్రితో సంబంధాలున్న ఓ ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్తోపాటు ురో సీనియర్ కాంట్రాక్టర్ ఇటీవల రాయబారం నడిపినట్లు తెలిసింది. అందుకే.. టార్గెట్ ఎన్పీడీసీఎల్లో ఇటీవల సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సందర్భంలో ధరలు పెంచాలని కాంట్రాక్టర్లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. మిశ్రా ఇందుకు ఒప్పుకోకపోవడంతో టెండర్లు ఫైనల్ కాలేదు. అంతేకాకుండా పనుల పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపులు చేయూలని, పనులు పూర్తికాకుంటే చెల్లించొద్దని సీఎండీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్లు, రాజకీయ నేతలతో కాంట్రాక్టర్లు ఆయనపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు.అయినప్పటికీ సీఎండీ ఫైళ్లను పెండింగ్లో పెడుతుండడంతో ఆయనను కాంట్రాక్టర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను బదిలీ చేయించి... తమకు అనుకూలంగా ఉండే వారిని సీఎండీగా రప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రూ. 3 కోట్ల నుంచి రూ.4 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కుర్చీ కోసం పోటీ సీఎండీ కుర్చీ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఎన్పీడీసీఎల్లో డెరైక్టర్గా పనిచేసి గత ఏడాది కేబుల్ కొనుగోలులో ఆరోపణలు ఎదుర్కొన్న డెరైక్టర్తోపాటు ప్రస్తుతం సీజీఎంలుగా పనిచేస్తున్న ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కంపెనీలోని మరో సీనియర్ డెరైక్టర్ కూడా సీఎండీ పోటీలో ఉన్నట్లు సమాచారం. జెన్కో తరహాలోనే ఎన్పీడీసీఎల్కు ఈసారి ఐఏఎస్ అధికారిని కాకుండా ఇంజినీరింగ్, నాన్ ఐఏఎస్లకు సీఎండీ పోస్టు అప్పగించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు సీఎండీ పోస్టుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా... సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీపై వెళ్లేందుకు ఇప్పటికే పలుమార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారని... ఈసారి ఎలాగైనా బదిలీ చేయించుకుంటారని.. లేనిపక్షంలో కొన్ని రోజులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement