breaking news
dharma canvas
-
మనం చేసిన తప్పుకు మనమే బాధ్యులం
ఈ ప్రపంచంలో తప్పుడు పనులు, హింస, వంచనలతో కావాల్సినంత సంపదను పొంది సుఖంగా ఉన్నవారు ఒక వైపు ఉంటే, సదా సత్యాన్నే చెబుతూ ధర్మ కార్యాలలో ఆసక్తులై కూడా దుఃఖంతోనే జీవితాన్ని గడిపే ప్రజలు మరోవైపు ఉన్నారు. కొంతమందికి ఎన్ని మందులు స్వీకరించినా కూడా రోగం పరిహారం అవ్వట్లేదు. అయితే ఈ ఔషధాలను స్వీకరించకుండా ఆరోగ్యవంతులై బతుకుతున్నారెంతోమంది. కొంతమందికి సంపదల వాన కురుస్తుంది. అయితే డబ్బులు అవసరం ఉన్నవారికి మాత్రం ఒక చిల్లిగవ్వ కూడా లభించదు. భగవంతుడిని సర్వసమర్థుడు అంటున్నారు. అలా అయితే అతడు అందరికీ సుఖాన్ని కలిగించాలి కదా! ఎందుకు ఈ పక్షపాతం? ఇలా లోకంలో జనసామాన్యానికి కలిగే ప్రశ్నలను తీసుకొని ధర్మవ్యాధుడు ఇలా సమాధానం చెబుతున్నాడు.మన జీవితంలో ఈ లోటుపాట్లకు బాధ్యులం మనమే. భగవంతుడు కాదు. మనిషి జీవితం కేవలం ఒక జన్మ కే పరిమితం కాదు. నూరు జన్మలలో చేసిన కర్మలను ఈ జన్మలో కాని ముందు జన్మలో గాని అనుభవించాల్సిందే. అలా అని మన కష్టాలన్నింటికీ దేవుడే కారణం అని అతడిని దూషించకూడదు.లోకంలో కొందరు దుష్కర్మలను చేసి వాటిని దేవుడిపై వేస్తుంటారు. అన్నింటినీ చేయించేవాడు దేవుడే అయినప్పుడు నేను చేసే తప్పులలో నా పాత్ర ఏముంటుంది? ఇలా అహంకారంతో చేసిన చెడ్డ పనుల గురించి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతుంటారు. వర్షం అన్ని ప్రదేశాలో సమానంగా కురుస్తున్నట్లు, భగవంతుడు కూడా అనాథలైన జీవులను భూమిపైకి తెస్తాడు. తర్వాత వారి వారి స్వభావానికి అనుగుణంగా వారు పెరుగుతారు. భగవంతుడు ఎదుగుదలకు కావలసిన అనుకూలతలను మాత్రం ఏర్పాటు చేస్తాడు. -
టీటీడీ ధర్మప్రచారం భేష్
– ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ ప్రశంస సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మప్రచారం బాగా చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ )సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం వేకువజాము అర్చన సేవలో శ్రీవారిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ఎస్వీబీసీతో మీడియాతో మాట్లాడారు. «దర్మప్రచారానికి టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని కితాబిచ్చారు. భక్తులు కూడా తమ సొంత ప్రాంతాల్లో భక్తిభావం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రత్యేకదర్శనం కల్పించి , రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో సాంబశివరావు, మోహన్ భగవత్ను పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి కూడా ఆలయ అధికారులు ప్రత్యేక మర్యాదలు చేశారు. తర్వాత ఆరెస్సెస్ చీఫ్ శ్రీకాళహస్తి వెళ్లి ముక్కంటిని సందర్శించుకున్నారు.


