breaking news
devaloped by
-
అభివృద్ధిలో యువత పాత్ర కీలకం
కాజీపేట రూరల్ : ప్రపంచ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల అన్నారు. కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాస శిక్షణ కేంద్రంలో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ కథోళిక వ్యవసాయం, గ్రామీణ ఉద్యమం (ప్రెంచ్ భాషలో మీజార్క్) సదఽస్సులను ఉడుముల బాల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకు ముందు ఉడుముల బాల మీజార్క్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉడుముల బాల మాట్లాడుతూ మీజార్క్ అంతర్జాతీయ సదస్సులు ఓరుగల్లు నగరంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. మీజార్క్ వరల్డ్ ప్రెసిడెంట్ కుమ్మరి కృష్ణాకర్ మాట్లాడుతూ 1954లో ప్రారంభమైన మీజార్క్లో 4 ఖండాల్లోని వివిధ దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. 18 వరకు జరిగే ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోని వాతావరణ మార్పులు, ఆకలిలేని ప్రపంచం, శాంతి, న్యాయం, పేదరిక నిర్మూలన, ఉపాధికి తగిన వేతనం, మంచి ఆరోగ్యం, విలువలతో కూడిన విద్య, స్వచ్ఛమైన తాగునీరు అనే అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. భీమారం మీజార్క్ యువత సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మీజార్క్ వరల్డ్ చాప్లిన్ ఫాదర్ ఒబినో, వరంగల్ నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ మనోరంజన్, మీజార్క్ ప్రధాన కార్యదర్శి క్లేయర్, యూత్ డెలిగేట్ కేరళ కరోల్స్, మీజార్క్ ఆసియా ఖండం చాప్లిన్ ఫాదర్ మాథ్యూ, తెలుగు మీజార్క్ ప్రతినిధి దుంపాల బాలస్వామి, భారతమిత్ర డైరెక్టర్ ఫాదర్ ఐజక్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి జెన్కో కృషి
టీఎస్ జెన్కో డైరెక్టర్ సి.రాధాకృష్ణ ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా విజేతలకు బహుమతులు అందజేత పాల్వంచ : టీఎస్ జెన్కో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు యాజమాన్యం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.రాధాకృష్ణ అన్నారు. స్థానిక టీఆర్సీ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా సాగుతున్న టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ టీం ఈ వెంట్లో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీపీ(భూపాలపల్లి) ద్వితీయ, కేటీపీఎస్ 5వ దశ తృతీయ స్థానంలో నిలిచాయి. క్యారమ్స్ టీం ఈ వెంట్లో విద్యుత్ సౌధ (హైదరాబాద్) ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, కేటీపీఎస్ 5వ దశ తృతీయ, టెన్నికాయిట్ టీం ఈవెంట్లో కేటీపీఎస్ 5వ దశ ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, కేటీపీఎస్ ఓఅండ్ఎం తృతీయ, చెస్లో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీఎస్ 5వ దశ ద్వితీయ, శ్రీశైలం తృతీయ, టేబుల్ టెన్నిస్లో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీపీ ద్వితీయ, విద్యుత్ సౌధ తృతీయ, టేబుల్ టెన్నిస్ పురుష విభాగంలో కేటీపీఎస్ ఓఅండ్ఎం ప్రథమ, కేటీపీఎస్ 5వ దశ ద్వితీయ, కేటీపీపీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. మహిళా క్రీడల్లో సీహెచ్.అనంత లక్ష్మి చాంపియన్షిప్ సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలను డైరెక్టర్ రాధాకృష్ణ అందజేశారు. ఈ పోటీలకు కె.హిజ్కియరాజ్, బి.వీరునాయక్, వి.జాకబ్, ఎస్కె.సోందు, బి.సత్యనారాయణ, ఎన్.వెంకటేశ్వర్లు, వంశీ, వెంకట్ రిఫరీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీఈలు వి.మంగేష్కుమార్, పి.రత్నాకర్, స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, వై.వెంకటేశ్వర్లు, డి.సారయ్య, నరసింహారావు, అనుమంతరామ పాల్గొన్నారు. (30కెజిఎం272) : అనంతలక్ష్మికి ట్రోఫీ అందిస్తున్న డైరెక్టర్ రాధాకృష్ణ (30కెజిఎం273) : విజేతలకు బహుమతులు అందిస్తున్న రాధాకృష్ణ