breaking news
deputy foreign minister
-
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
ఆ ప్రధాని వద్దకు వెళితే ఇక అంతే!
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వద్దకు రాజకీయ సందర్శకులు వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారంట. ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయడం లేదట. అదేంటి ఆయన దగ్గరకు వెళితే ఏం చేస్తారు.. కొడతారా తిడతారా లేక ప్రధాని అనే భయమా లేక అతి వినయమా అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు ఈ మధ్యనే ఆయన కైయా అనే ఓ కుక్కను తెచ్చుకున్నారు. అది కాస్త హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఆయన పక్కన ఉండగానే వచ్చిన సందర్శకులపై విరుచుపడుతుందట. తొలుత ఒకరిని కరిచిన ఆ కుక్క రక్తం రుచి పంటికి తగిలిందికాబోలు ఇక ఎవ్వరినీ వదిలిపెట్టకుండా ఒక్క నెతన్యాహును తప్ప అందరిని కరిచేందుకు లగెత్తుకు వెళుతోందట. డిప్యూటీ విదేశాంగమంత్రి భర్తను కూడా ఆ కుక్క కరిచిందంటే ప్రధాని నెతన్యాహు కోసం ఎంతటి అతి వినయంగా ప్రవర్తిస్తుందో మీరే ఊహించుకోండి. బుధవారం ఏం చక్కా ఆయన క్యాండిల్ లైట్ లో డిన్నర్ ఏర్పాటు చేయగా అందులో కూడా ఇద్దరిపై దాడి చేసి కరిచేసిందట. దీంతో ప్రధాని కుక్కపై పలువురు, మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. దాని సపర్యలు చూసేవారు మాత్రం అదంతా ఉత్తదేనని, కావాలనే మీడియా దుష్పచారం చేస్తుందని అంటున్నారు. కైయా ఎంతోమంది ప్రముఖులను కూడా కలుసుకుంది. వారిలో యూఎస్ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ కూడా ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు అప్పుడు కెర్రీని కైయా ఏమీ అనలేదు.


