ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భోపాల్: ఎయిర్ ఇండియాకు చెందిన విమానం భోపాల్ లోని రాజాభోజ్ ఎయిర్ పోర్టు లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి కోచికు మంగళవారం ఉదయం బయలుదేరిన ఈ విమానం లో సాంకేతిక లోపం తలెత్తడమే ల్యాండింగ్ కు కారణమని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.