breaking news
delhi crime police
-
ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం బాగుందని సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకులు తనూజ్ చోప్రా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. రెండూ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.కథేంటి..?అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ఒక ముఠాకు వ్యతిరేకంగా డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ), ఆమె బృందం చేసే పోరాటమే ఢిల్లీ క్రైమ్-3 కథ.. 2012లో జరిగిన బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కథ మొదలౌతుంది. 2012లో 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరుతుంది. బాలికను వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఆమె పుర్రె విరిగిపోయి, శరీరంపై మానవ కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి షాక్ అవుతారు. తమ కెరీర్లో ఎప్పుడు కూడా ఇంతటి ఘోరమైన కేసును చూడలేదని డాక్టర్లు చెబుతారు. దీంతో బాలిక కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. పోలీసుల ఎంట్రీతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇంతకు ఈ బాలికను ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు అనే పాయింట్ నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే అస్సాం నుండి ఒక ట్రక్లో కొన్ని వెపన్స్ వస్తున్నాయని ఆమెకు సమాచారం అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్ను ఆపుతుంది. అయితే, ఆ ట్రక్లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు వర్తికా గుర్తిస్తుంది. ఇక్కడి నుంచే ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంది ఎవరు..? ఢిల్లీలో ఈ మూఠా వెనుకున్నది ఎవరు..? హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న బాలికకు ఈ ముఠాతో ఉన్న లింక్ ఏంటి..? 15 ఏళ్ల బాలికన అంత ఘోరంగా చిత్రహింసలు చేయడానికి కారణం ఏంటి.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరు..? ఫైనల్గా ఆ బాలిక బతికిందా..? వంటి అంశాలు తెలుసుకోవాలంటే డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ చేసిన ఢిల్లీ క్రైమ్-3 ఇన్విస్టిగేషన్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..?క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగించేలా ఉండాలి. ఈ విషయంలో దర్శకులు తనూజ్ చోప్రా విజయం సాధించారు. కేవలం 6 ఏపిసోడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఈ మూఠా ఎలా టార్గెట్ చేస్తుంది అనే పాయింట్ను చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను ఆశ చూపించి కొన్ని ముఠాలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయో కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపారు. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాలు, నీళ్ల ట్యాంకర్లతో పాటు కంటెయినర్లలో ఎలా తరలిస్తారనేది దర్శకుడు ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించేందుకు పోలీసులు ఎంత రిస్క్ చేస్తారనేది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మెప్పిస్తుంది. అస్సాం, హర్యానా, మిజోరాం, సూరత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలను ప్రధానంగా టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ముఠాల నుంచి కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ క్లియర్గా చూపుతుంది.ఢిల్లీ క్రైమ్-3 రియల్ స్టోరీ. కథ చాలా బలంగానే ఉంటుంది. అయితే, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షెఫాలీ మరోసారి దుమ్మురేపింది. హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడంతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అవుతారు. కె-ర్యాంప్తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్లో దూకుడు స్వభావం గల లేడీ పోలీస్ ఆఫీసర్గా మెప్పించింది. ఈ సిరీస్కి ఒన్నాఫ్ ది హైలైట్ పాత్ర ఆమెదే అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలా థ్రిల్లింగ్ డ్రామాలా కొనసాగితే ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. కానీ, ఈ విషయంలో కాస్త మైనస్ అని చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు బాగా అంచనా వేయడంతో గొప్పగా సస్పెన్స్లకు ఛాన్స్ ఉండదు. కానీ, ఫైనల్గా అందరికీ ఢిల్లీ క్రైమ్-3 నచ్చుతుంది. -
వాస్తవ సంఘటనలతో 'ఢిల్లీ క్రైమ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 రానుంది. నవంబర్ 13న నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న ఢిల్లీ క్రైమ్-3 ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఎవరికీ అంతుపట్టకుండా సాగే వరుస హత్యలను చేధించే క్రమంలో పోలీసుల జరిపే శోధన ఎలా ఉంటుందో ఇందులో చూపారు.ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ రెండూ భారీ విజయం అందుకోవడంతో సీజన్-3ని తెరకెక్కించారు. ‘ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డు ఫర్ అవుట్స్టాండింగ్ డ్రామా సిరీస్’ అవార్డ్ను అందుకున్న తొలి భారతీయ వెబ్సిరీస్గా ‘ఢిల్లీ క్రైమ్’ నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ నటించారు. రిచీ మెహతా, తనూజ్ చోప్రా ఈ సిరీస్ని రూపొందించారు.దేశంలో ఒకప్పుడు నిర్భయ అత్యాచారం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు ఎలా ఇన్విస్టిగేషన్ చేశారనే తీరును ఫస్ట్ సీజన్లో చూపారు. వృద్ధులను టార్గెట్ చేసుకుని నగరంలో జరిగే వరసు హత్యలకు సంబంధించిన దర్యాప్తు ఆధారంగా రెండో సీజన్ రూపొందించారు. అయితే, సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించనున్నారు. -
రెజ్లర్ హత్య కేసు: సుశీల్ కుమార్ జూడోకోచ్ అరెస్ట్
ఢిల్లీ: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్ సుభాష్కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్ సుశీల్ కుమార్కు సుభాస్ జూడోకోచ్గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవలే సుశీల్ కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు తేలింది. చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు -
తీహార్ జైలుకు దినకరన్....
చెన్నై : రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టు చేసిన టీటీవీ దినకరన్ను జ్యుడీషియల్ కస్టడికి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు సోమవారం సాయంత్రం తీహార్ జైలుకు తరలించారు. అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో మూడు రోజల పాటుగా విచారణ కొనసాగించిన ఢిల్లీ క్రైమ్ పోలీసులు.... ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో దినకరన్ను ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. అతడితో పాటుగా స్నేహితుడు మల్లికార్జున్ను పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడికి న్యాయమూర్తి పూనం చౌదరి ఆదేశించారు. అయితే బెయిల్ కోసం దినకరన్ తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కాగా దినకరన్ ఆరోగ్య విషయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాదుల విజ్ఞప్తికి కోర్టు స్పందించింది. ఢిల్లీలోని ఆసుపత్రిలో దినకరన్, మల్లికార్జున్లకు జరిగిన వైద్య పరిశోధనల అనంతరం గట్టి భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు దినకరన్కు చెందిన అయిదు బ్యాంక్ల్లోని ఖాతాల్ని ఢిల్లీ పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దినకరన్ రూ. 50 కోట్లు ఇసుక కాంట్రాక్టుల ద్వారా సమీకరించి పనిలో పడ్డట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెల 25న దినకరన్ను అరెస్ట్ చేశారు. -
రాజాజీ భవన్ వద్ద పోలీసుల హడావుడి
చెన్నై: కేంద్ర ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు రెండో రోజు కూడా చెన్నైలో విచారణ నిర్వహించారు. చెన్నైలోని మూడు ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఆయన్ను గురువారం చెన్నైకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు అడయార్లోని నివాసంలో ఆయన వద్ద విచారణ సాగింది. ఇదే కేసులో అరెస్టు అయిన దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. శుక్రవారం ఈ ఇద్దర్నీ ఆంధ్రప్రదేశ్ లేదా, కేరళకు తీసుకెళ్లవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, రాజాజీభవన్లోని సీబీఐ కార్యాలయానికి ఆ ఇద్దర్నీ పరిమితం చేశారు. ఓ బృందం వీరి వద్ద విచారణ సాగించగా, మరో బృందం ఆదంబాక్కం వల్లలార్ వీధిలోని రిటైర్డ్ అధికారి మోహనరంగన్ ఇంటి వద్ద గంట పాటు విచారణ సాగింది. అలాగే పోరూర్లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్కు చేరుకుని ఆ ఇద్దరిని విచారణ చేపట్టారు. కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న హవాల ఏజెంట్ నరేష్ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.


