breaking news
defections in tdp
-
భస్మాసుర హస్తమవుతున్న ఫిరాయింపులు
ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పక్షంలో విలీనమవడంతో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చ తెరపైకి వచ్చింది. ఒక పార్టీనుంచి గెలిచిన ప్రజాప్రతినిధి మరో పార్టీలో చేరితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోతుందనే ఉద్దేశంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది. కానీ అధికారంలో ఉన్న పార్టీలు నిర్లజ్జగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల దృష్టిలో ఎన్నికలు పలచనవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ, తెలం గాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు బాబు ఏమి చేశారు? రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొని, నోళ్ళు నొక్కే దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇప్పుడా సెగ వారికి తగులుతోంది. తీవ్ర ప్రమాదంలో పడిపోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేస్తే ఎదురులేదనుకున్నారు కేసీఆర్. గతంలో టీడీపీ, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఎంఎల్ఏలను తనలో కలిపేసుకున్న కేసీఆర్, ఈ అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొం తుల మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను తమ పార్టీలోకి విలీనం చేసుకున్నారు. పార్లమెంటు ఎన్నికలలో తెలం గాణలో అనూహ్యంగా కాంగ్రెస్కు 3, బిజెపికి 4 సీట్లు రావడంతో ఖంగు తిన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలం గాణలో వచ్చిన ఫలితాలతో ఇప్పుడు బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్ పని పట్టనున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు లేకుండా తిరుగులేని శక్తిగా ఎదుగుదామనుకున్న మమతా బెనర్జీకి చుక్కెదురై 18 సీట్లతో బీజేపీ పాగా వేయడంతో తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా పరిస్థితులు తారుమారయ్యాయి. అక్కడ వామపక్షాలు, కాంగ్రెస్లను తొక్కేసిన మమత, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనుంచి అదే పరిస్థితి ఎదుర్కోబోతుంది. చంద్రబాబు కూడా ఏపీలో పార్టీ పిరాయింపులకు పెద్ద పీట వేయ్యడంతో ఆయన కూర్చున్న కొమ్మను ఆయనే నరుక్కున్నట్లు అయింది. ఆయన అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని కొందరికి మంత్రిపదవులు కట్టబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల దెబ్బతిన్న జగన్ తాను అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులను ప్రోత్సహించనని ప్రకటిం చడం ఆహ్వానించదగిన పరిణామం. కానీ ఏపీ అసెం బ్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ అక్కడ ఫిరాయింపు ప్రక్రియ ద్వారా బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోందని చెబుతున్నారు. చెరపుకురా చెడెదవు అనే సామెతను పాలకులు గమనిస్తే మంచిది. వామపక్షాలు మినహాయిస్తే ప్రజాస్వామ్యంలో పార్టీల ఫిరాయింపులు నిత్యకృత్యమైనాయి. టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలోకి మారడం సిగ్గుచేటు. 15 రోజుల క్రితమే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజా ప్రతినిధులు పార్టీ మారినప్పుడు విధిగా అదే రోజు వారి పదవి కోల్పోయే చట్టముండాలని అభిలషించారు. ఎన్డిఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్(యు) పక్ష నాయకుడు, రాజ్యసభ ఎంపి శరద్యాదవ్ ఆ పార్టీని వీడిన కొద్ది రోజులకే రాజ్యసభ చైర్మన్గా ఉన్న వెంకయ్య ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. దేశమంతటా ఫిరాయింపులు తామరతంపరగా జరుగుతున్న సమయంలో అత్యంత వేగంగా తీసుకున్న ఈ చర్య ద్వారా వెంకయ్య అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. కానీ టీడీపీ రాజ్యసభ సభ్యుల వ్యవహారంలో వెంకయ్య పాత్ర దేశాన్ని నిర్ఘాం తపర్చింది. మాతృపార్టీ విలీనం ఊసే లేకుండా ఆరుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఇచ్చిన లేఖ ఆధారంగా వారిని రాజ్యసభలోని బీజేపీ పక్షంలో శరవేగంగా విలీనం చేశారు. నాడు శరద్యాదవ్ పదవిని తొలగించడంలో చూపిన వేగాన్నే అధికార పక్షంలో ప్రతిపక్ష ఎంపీలను కలిపేయడంలో కూడా చూపిం చారు. ఫిరాయింపుదారుల పదవి.. పార్టీ మారిన రోజే పోవాలన్న వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఉన్న సభలో ఫిరాయింపులను ఇలా ధ్రువీకరించడం చాలా అన్యాయంగా ఉన్నది. ఇక తన్నుతాను ఒక భిన్నమైన పార్టీగా చెప్పుకునే బీజేపీ పార్టీ ఫిరాయింపుల ఆధారంగానే బలోపేతమయ్యేందుకు బాటలు వేసుకుంటోంది. గోవాలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ శాసనసభా పక్షాన్ని, జార్ఖండ్లో జార్ఖండ్ వికాస్ పార్టీ ఎంఎల్ఏలను, మణిపూర్లో కాంగ్రెస్ ఎంఎల్ఏలను బీజేపీలో కలిపేసుకున్నది. ఇక కర్ణాటకలో త్వరలో ఎన్నికల అవసరం లేకుండానే తాము అధికారంలోకి రానున్నామని ప్రకటించింది. ఇప్పటికే ప్రతిపక్షాలను అణచివేసేందుకు ఫిరాయింపులను అండగా మార్చుకున్న టీఎంసీ, టీడీపీలు దానికే ఎలా ఎరగా మారుతున్నాయో, టీఆర్ఎస్లో బీజేపీ ఎలా గుబులు కలిగిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఫిరాయింపులకు ప్రోత్సహించిన పార్టీలకే అదే భస్మాసురహస్తంగా మారుతుండడం గమనిస్తున్నాం. బీజేపీ ప్రయోగిస్తున్న ఈ అస్త్రం ఎంతో కాలం పని చేయకపోవచ్చు. ప్రజా వ్యతిరేకత ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదని చరిత్ర చెబుతోంది. వ్యాసకర్త సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ చాడ వెంకట్రెడ్డి -
బీజేపీ వైపు.. టీడీపీ నేతల చూపు
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలబోతోందా! అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీలో చేరదామనుకున్న వీరికి ద్వారాలు మూసుకుపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. పల్నాడుకు చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఒకరు విశాఖపట్నంకు చెందిన బీజేపీ నాయకుడి ద్వారా ఫోన్ చేయించుకుని బీజేపీ ముఖ్యనేతను కలిసినట్టు తెలిసింది. అక్రమ మైనింగ్ కేసుల నుంచి బయటపడటంతోపాటు, సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు సదరు నాయకుడు అధికార పార్టీలో చేరాలని చూస్తున్నట్టు గ్రహించిన బీజేపీ ముఖ్యనేత ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో కొత్తదారులు వెతుకుతున్నట్టు తెలిసింది. తనకో దారి చూపించమని బీజేపీలోని ఓ సీనియర్ నాయకుడిని ఆశ్రయించినట్టు భోగట్టా. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. వీరంతా టీడీపీకి మరో 20 ఏళ్లపాటు రాజకీయ భవిష్యత్ లేదనే నిర్థారణకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అత్యధికులు పార్టీని వీడి బీజేపీలోకి క్యూ కట్టేందుకు వెంపర్లాడుతుండటం విశేషం. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
పవన్ కళ్యాణ్ షాక్తో దిక్కు తోచని స్థితిలో టీడీపీ
-
ఏపీలో మారుతున్న రాజకీయాలు
-
జంపింగ్లను తొలగించండి
-
‘బుట్టలో పడకముందు.. బుట్టలో పడ్డాక’
సాక్షి, అమరావతి : ‘‘ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీలోనే ఉండాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటి మంచి మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలి. లేకపోతే రాజకీయాలపైన, నాయకులపైన జనంలో చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే భవిష్యత్ తరాలకు మనం మంచి మార్గాన్ని చూపాలి..’’ అని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కొన్ని నెలల కిందట ఘంటాపథంగా చెప్పారు. ఏ పార్టీ నుంచైతే తాను గెలిచానో, ఆ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. సీన్ కట్చేసే... మంగళవారం అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ వల్లే దక్కిన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె పార్టీ ఫిరాయించారు. తానెప్పుడూ అభివృద్ధినే ఆశిస్తానని, గడిచిన మూడేళ్లు కూడా దానినే కోరుకున్నానని, సారు(చంద్రబాబు) ఆహ్వానించడంతో టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు. బుట్టా రేణుక.. ‘‘బుట్టలో పడకముందు.. బుట్టలో పడ్డాక’’ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుట్టా రేణుకా పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి ఆశపడే పార్టీ మారారా?’’ అని ప్రశ్నించారు. నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి, చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారని విమర్శించారు. బుట్టలో పడక ముందు.. బుట్టలో పడ్డాక వీడియో వీక్షించండి -
'రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలని లేఖ'
అమరావతి: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి మంగళవారం లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నిరోధించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి చేర్చుకోవడం జరిగిందని, ఫిరాయించిన వారు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండా టీడీపీలో కొనసాగుతున్నారని రఘువీరా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో కూడా స్థానం కల్పించారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాల్సిన గవర్నర్, స్పీకర్ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తక్షణమే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని పార్టీ తరపున రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు.