breaking news
death sentence to dog
-
షాకింగ్: రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఎందుకంటే
కరాచీ: మనుషులకు మరణశిక్ష విధిస్తారన్నది తెలిసిన విషయమే. కానీ ఓ దేశంలో విచిత్రంగా రెండు కుక్కలకు మరణ విధించారు. వినడానికి కాస్తా ఆశ్చర్యంగానే ఉన్న నిజంగానే పాకిస్థాన్లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు. కరాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయన్న కారణంగా రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలకు మరణశిక్ష విధించడం గమనార్హం. మీర్జా అక్తర్ అనే సీనియర్ లాయర్ గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. అక్కడ ఓ రెండు కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతటి కౄరమైన కుక్కలను ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇక అక్తర్ లాయర్ కావడంతో అతను కోర్టుకు వెళ్లాడు. అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్ ఖాన్ రాజీకి వచ్చాడు. కానీ రాజీకి అంగీకరిస్తూనే లాయర్ అక్తర్ యాజమానికి పలు షరతులు పెట్టాడు. ఇంతటి దారుణం జరిగినందుకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దని, అలాగే తనపై దాడి చేసిన ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని సదరు యజమానికి లాయర్ అక్తర్ షరతులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో సమర్పించారు. అయితే ఈ ఒప్పందంపై హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. Violent #Dogattack in #DHA Phase 7, Street number 14. #Karachi.#Pakistan pic.twitter.com/TxFhq6TiQL — Asad Zaman 🇵🇰 (@asadweb) June 27, 2021 -
కుక్కకు మరణశిక్ష
పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ పిల్లవాడిని కరిచినందుకు ఓ కుక్కకు మరణశిక్ష విధించారు. పంజాబ్ రాష్ట్రంలోని భక్కర్ కలోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ రజా సలీమ్ ఆ కుక్కకు ఈ శిక్ష విధించినట్లు జియో టీవీ పేర్కొంది. మానవీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆ కుక్కకు ఈ శిక్ష వేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ సలీమ్ తెలిపారు. పిల్లవాడిని కుక్క గాయపరిచిందని, అందువల్ల దాన్ని చంపేయాల్సిందేనని ఆయన ఆదేశించారు. కుక్క రిజిస్ట్రేషన్ను తనిఖీ చేయాల్సిందిగా ఓ అధికారికి సూచించారు. ఒకవేళ అది రిజిస్టర్ అయితే, దాని యజమానిని కూడా విచారించాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రమైన శిక్ష విషయంలో అదనపు డిప్యూటీ కమిషనర్ వద్ద కుక్క యజమాని అప్పీలు దాఖలు చేసుకున్నారు. కుక్కపై బాధిత బాలుడి కుటుంబం ఫిర్యాదు చేయడంతో అది ఇప్పటికే వారం రోజుల జైలుశిక్ష అనుభవించిందని, అందువల్ల ఇప్పుడు మళ్లీ మరణశిక్ష వేయడం సరికాదని కుక్క యజమాని జమీల్ అన్నారు. తన కుక్కకు న్యాయం జరిగేందుకు తాను అన్ని కోర్టులకూ వెళ్తానని కూడా ఆయన చెప్పారు.