breaking news
dead bodies preserve
-
డీఎస్పీ ఆధ్వర్యంలో మృతదేహాల భద్రత..
సాక్షి, మహబూబ్నగర్: నిందితుల కుటుంబాలకు మృతదేహాల అప్పగింత వాయిదా పడడంతో జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 15మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఫ్రీజర్లు లేకపోవడంతో బయటి నుంచి తెప్పించి మృతదేహాలను అందులో ఉంచారు. ఈ క్రమంలో వసతులు లేవని, మృతదేహాలను భద్రపరిచేందుకు సరైన వసతులు లేవని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. వాయిదా పడిన అంత్యక్రియలు శవాలను పూడ్చేందుకు తీసిన గోతులు జక్లేర్లో మహ్మద్ ఆరీఫ్ పాషాను ముస్లింల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు ఆ గ్రామ మైనార్టీలు ఏర్పాట్లు చేశారు. గుడిగండ్లలో తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు నవీన్, శివ, చెన్నకేశవులు కుటుంబీకులు గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గుంతలను తవ్వించారు. అంత్యక్రియలు చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందుండి గుంతలను తవ్వించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతమైన వాతావరణంలో అంత్యక్రియలు జరపాలని పోలీసు యంత్రాంగం ప్రణాళికతో అంచనా వేసుకుంది. జాతీయ మానవహక్కుల కమిషన్, హైకోర్టు ఆదేశాలతో చివరకు మృతదేహాలు గ్రామాలకు చేరుకోకపోవడంతో అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. -
13 నెలలుగా ఆ శవం అచ్చం అలాగే...
లిమా: పెరు దేశంలోని జూనిన్ ప్రాంతానికి చెంది డాక్టర్ ఎడ్గార్ అరంద తన సోదరుడి మృతదేహాన్ని 13 నెలలపాటు చెక్కు చెదరకుండా భద్రపర్చి వైద్య రంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. కొన్ని వందల ఏళ్ల వరకు మృతదేహాలను భద్రపరిచే ఈజిప్టు మమ్మీల గురించి మనకు తెల్సిందే. మమ్మీల విషయంలో మృతదేహం జుట్టూ, గోళ్లు, చర్మం రాలిపోతుంది. అలా కాకుండా చనిపోయినప్పుడు తన సోదరుడు రామన్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అచ్చం అలాగే ఉండేలా చేయడం ద్వారా శాస్త్ర విజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణకు డాక్టర్ ఎడ్గార్ శ్రీకారం చుట్టారు. తన సోదరుడైన రామన్ మృతదేహం నుంచి రక్తాన్ని పూర్తిగా బయటకుతీసి, దానికి కొన్ని ప్రత్యేక రసాయనాలను మిలితం చేసి తిరిగి శరీరంలోకి ఎక్కిండం ద్వారా మృతదేహాన్ని భద్రంగా ఉంచగలిగానని డాక్టర్ ఎడ్గార్ తెలిపారు. ఆ రసాయనాల ఫార్ములాను మాత్రం ఇప్పుడే వెల్లడించనని, భారీ ఎత్తున మృతదేహాలను భద్రపరిచే ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత ఫార్ములాను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఆయన తాను చేసిన ఈ ప్రయోగాన్ని తన బంధువుల ముందు ప్రదర్శించారు. దాన్ని వీడియోతీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. తన సోదరుడు రామన్ ‘అన్నా, ఏ విధంగాను నీకు సహాయ పడలేక పోతున్నాను’ అంటూ తరచూ బాధపడే వాడని, చివరకు చనిపోయిన తర్వాత ఇలా తన రుణం తీర్చుకున్నాడని డాక్టర్ ఎడ్గార్ తన బంధువులతో వ్యాఖ్యానించారు. కొత్త ఆవిష్కరణకు తెరతీసిన డాక్టర్ ఎడ్గార్ను గౌరవించాల్సిందేనని బంధువులు వ్యాఖ్యానించగా, అసలు ఎందుకు ఓ మృతదేహాన్ని భద్రపర్చాలి, అవసరం ఏమిటీ? అంటూ ఫేస్బుక్లో చాలా మంది యూజర్లు ప్రశ్నించారు. చనిపోయిన వారి నుంచి వెళ్లిపోయిన ఆత్మ ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుందనే నమ్మకంతో క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులు మృతదేహాలను భద్రపరిచేవారు.