-
వాగ్దానాలు సరే.. మా బతుకులు మారేదెప్పుడు..?
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ అస్మిత.. బెంగాల్ సంస్కృతి... ఈ మాటలు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఎంసీ, బీజేపీ నాయకుల మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ దూసుకువెళ్తున్నప్పటికీ, రాష్ట్రంలోని అనేకమంది సామాన్యులు ఇప్పటికీ పూట గడవటమే కష్టంగా కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. అలాంటి సామాన్యుల్లో బెంగాల్కు వన్నె తెచ్చిన తేయాకు తోటల్లో కష్టపడి పనిచేస్తున్న కూలీల వ్యధను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాలు, చేసే వాగ్దానాలు తమ పొట్ట నింపే పరిస్థితి ఏమాత్రం లేదనేది తేయాకు తోటల్లో పనిచేస్తున్న కూలీల మాట. ఇన్నేళ్ళుగా అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, నేటికీ బెంగాల్లో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. పొట్ట నిండేందుకు సరిపడా ఆహారంలేక, తల దాచుకొనేందుకు బలమైన పైకప్పు ఉన్న ఇళ్ళు లేక కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వీటన్నింటికి తోడు తేయాకు తోటల్లో ఆకులు తీసేటప్పుడు తరుచుగా అడవి జంతులవుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే వారు ఉన్నారు. 3.5 లక్షల మంది కూలీలు ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం డార్జిలింగ్, జల్పాయిగురి, అలీపురద్వార్ల్లో కలిపి మొత్తం 302 తేయాకు గార్డెన్లు, మరికొన్ని చిన్న తేయాకు తోటలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని 15 తేయాకు తోటలు మూతబడ్డాయి. వీటన్నింటిలో కలిపి సుమారుగా మూడున్నర లక్షల మంది కూలీలు ప్రతీరోజు పనిచేస్తుంటారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల రోజువారీ వేతనాలు సైతం ఇతర పనులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం కార్మికులకు రోజుకు రూ.202 మాత్రమే కూలీ లభిస్తుంది. ఇది కనీస వేతనం కంటే చాలా తక్కువ. ఒకవేళ తేయాకు తోటలు మూసివేస్తే, కార్మికుల జీవనోపాధికి మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంది. తక్కువ వేతనాల కారణంగా చాలీ చాలని ఆహారంతో చాలా మంది కార్మికులు పోషకాహార లోపానికి గురవుతున్నారు. తేయాకు తోటల్లో కార్మికులు వారానికి ఆరు రోజులు తోటల పెంపకం చేయాల్సి ఉంటుంది. ప్రతి కార్మికుడు రోజుకు 25 కిలోల తేయాకు తీయాల్సి ఉంటుంది. ఈ 25 కిలోల తేయాకు తీసేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది. ఒకవేళ కూలీలు తెంపిన తేయాకు రోజువారీ బరువు కంటే తక్కువగా ఉంటే కిలోకు మూడు రూపాయల చొప్పున వారికి ఇచ్చే వేతనంలో కోత ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 25 కిలోల కంటే అధికంగా తెంపితే మాత్రం వారికి కిలోకు రూపాయిన్నర మాత్రమే వారి వేతనంతో కలిసి చెల్లిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చోట్ల తేయాకు తోటలు మూసివేస్తుండడంతో కూలీలకు సకాలంలో వేతనాలు అందట్లేదనే ఫిర్యాదులు కార్మిక శాఖకు వస్తుంటాయి. ప్రభుత్వాలు ఇలాంటి కార్మికుల విషయంలో దృష్టి సారించక పోవడంతో పోషకాహార లోపం, ఇతర వ్యాధులతో బాధపడుతున్న కార్మికులకు అవసరమైన కనీస ఆరోగ్య సదుపాయాలు కూడా లేవని అనధికారిక వర్గాల సమాచారం. హామీలే... అమలేది? ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రం హామీలు ఇచ్చి, ఆ తర్వాత పట్టించుకున్న వారే కరువయ్యారని కూలీలు వాపోతున్నారు. ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తేయాకు తోటల్లో పనిచేసే కూలీల అభివృద్ధికి జై జోహార్, చాయ్ సుందర్ సహా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇటీవల క్లోజ్డ్ గార్డెన్స్ కూడా తెరుస్తున్నారు. మరోవైపు కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని బీజేపీ నాయకులు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, తేయాకు తోటల యజమానుల వైఖరి కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల హక్కులను యజమానులు కాలరాస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ప్రచారాంశంగా మారే తేయాకు తోటల కూలీల అభివృద్ధి అంశం కాస్తా, ఎన్నికలు పూర్తయిన తరువాత మరుగున పడిపోతుందనేది వాస్తవమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: టీఎంసీలో చేరిన టీమిండియా ఆటగాడు కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
రూ. లక్ష దాటిన కిలో టీ పౌడరు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే, ముఖ్యంగా యూరప్ దేశాల్లో గూర్ఖాలాండ్ రాజధాని డార్జిలింగ్ తేయాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ రాష్ట్ర ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుండడంతో తేయాకు రెండో పంట పూర్తిగా దెబ్బతిన్నది. తేయాకును తెంపే కూలీలు పనిలోకి రాకుండా ఆందోళన చేస్తుండడంతో స్థానిక టీ కంపెనీలన్నీ మూతపడ్డాయి. యూరప్ దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారతీయ కరెన్సీలో ఐదువేల రూపాయలకు కిలో పలికే డార్జిలింగ్ టీ పొడి ధర ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో లక్ష ఇరవై వేల రూపాయలు పలుకుతోంది. మరికొంతకాలం అయితే అసలు సరకు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తేయాకు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాం తేయాకుకన్నా డార్జిలింగ్లో పండే తేయాకు ప్రత్యేకమైనది, భిన్నమైనది. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. అందుకనే అస్సాం టీ పొడి కిలో 130 రూపాయలు పలికితే డార్జిలింగ్ టీ పొడి ధర ఐదువేల రూపాయల వరకు పలుకుతుంది. డార్జిలింగ్ తేయాకు పంటను మేలో ప్రారంభిస్తారు. అదే జూన్ నెలలో తీవ్రస్థాయికి చేరుకుంటంది. సెప్టెంబర్తో పూర్తిగా ముగిసిపోతుంది. అన్నింటికన్నా జూన్ నెల కీలకమైనది. ఆకులను తెంపి వేయడం వల్ల మళ్లీ వచ్చే ఆకులు బలంగా ఉంటాయి. జూన్ నెలలో తేయాకు ఆకులను తెంపడం ఆపిస్తే ఆ తర్వాత ఆకులు కూడా చేతికి అందకుండా పోతాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ గూర్ఖాలు జూన్ 9వ తేదీ నుంచి తేయాకు తోటల్లోకి పనులకు రావడం లేదు. డార్జిలింగ్ తేయాకు రెండో పంట దాదాపు పూర్తిగా తుడుచుపెట్లుకుపోయినట్లేనని స్థానిక ‘గూడ్రిక్ గ్రూప్’ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎన్ సింగ్ తెలిపారు. 40 శాతం రెవెన్యూ పూర్తిగా నష్టపోయామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఆ కంపెనీకి 260 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే వాటిల్లిందని డార్జిలింగ్ టీ అసోసియేషన్ కార్యదర్శి కౌషిక్ బసు మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో దాదాపు వంద మంది ఎగుమతిదారులకు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తోంది. జర్మనీకి చెందిన హల్స్సేన్ అండ్ ఆంప్, లియాన్, లండన్కు చెందిన యూనిలివర్, యూకేకు చెందిన టైపూ, ట్వినింగ్స్, టెట్లీ కంపెనీలు డార్జిలింగ్ టీ పొడిని ఎక్కువగా కొనగోలు చేస్తాయి. ఇప్పట్లో ఆందోళన సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు గూర్ఖా ఆందోళనకారులు మరణించారు. పలువురు గాయపడ్డారు. 1980 దశకంలో ఆందోళన తీవ్రంగా జరిగినప్పుడు దాదాపు 1200 మంది ఆందోళనకారులు మరణించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement