breaking news
daring event
-
AP Special: దొమ్మరివారి నేల.. నేడు దొమ్మర నంద్యాల
జమ్మలమడుగు(వైస్సార్ కడప జిల్లా): పూర్వం ఒక దొమ్మర కుటుంబం గండికోటలోని పేటలో నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబికులు దొమ్మరాటల ప్రదర్శనలు ఇస్తూ గండికోటలోని రాజులకు అతఃపుర స్త్రీలకు వినోదం కలిగించేవారు. ఆ కుటుంబాల జీవనాధారం అదే కావడంతో వాళ్లు విచిత్రమైన విన్యాసాలు, అనేక సాహస కృత్యాలను ప్రదర్శలుచేస్తూ జీవనం సాగించేవారు. (చదవండి: వేగంగా కోలుకుంటున్న ఆర్థిక రంగం) ఎతైన గడను భూమిలోనికి పాతి దానొపై నుంచిని కాసేపు పొట్టకు ఆనించి తన రెండు చేతులకు చాపి పక్షివలె ఆకాశంలో కొంత సేపే విహరించి మళ్లి నేలపై వాలేవారు. అయితే అలా ఒక రోజు దొమ్మర కుటుంబంలోని ఒక వ్యక్తి అలాంటి విన్యాసం చేస్తూండగా గండికోటలోనితూర్పు వైపు ఉన్న ఒక పల్లెలో వాలబోతు ప్రమాదవశాత్తు మరణించాడు. అతని గొప్ప విన్యాసానికీ ముగ్దుడైన రాజు ఈపల్లెను దొమ్మరలకు జాగీర్థారుగా ఇచ్చాడు. దీంతో ఆ పల్లె కాస్త దొమ్మరివారి నేలగా పిలిచేవారు. తదనంతరం కాలక్రమేణా దొమ్మర నంద్యాలగా మారిపోయింది. దొమ్మరనంద్యాల గ్రామం గండికోటకు ఈశాన్య దిశగా జమ్మలమడుగుకు సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో గ్రామ తోగట వీర క్షత్రియులు, సాలెలు, తదితర కులాల వాళ్లు ఉన్నారు. అంతేకాదు వారు చేనేతనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ప్రతి ఏడాది గ్రామ తోగట వీర క్షత్రియుల కులదైవ మైన చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను జరుపుతుంటారు. (చదవండి: ఏపీ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు) -
రికార్డు కోసం స్నేహితుల సాహసం
స్నేహితులతో కలిసి రియాలిటీ షోను అనుకరిస్తూ కొందరు యువకులు దుస్సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వార్తలు వింటున్నాం. ఈ స్నేహితుల బృందం చేసిన సాహం కూడా ప్రమాదకరమైనదే. అయితే వీరంతా సుశిక్షితులు కావటం, ప్రమాదాన్ని నివారించేందుకు అన్నిజాత్రత్తలు తీసుకోవటంవల్ల చేసిన డేరింగ్ ఈవెంట్ ప్రపంచ రికార్డుల్లో స్థానం పొందనుంది. ఏళ్లుగా రోప్ జంపింగ్ (నడుముకు తాడు కట్టుకుని లోయలు, లోతుల్లోకి దూకే సాహస క్రీడ) చేస్తూ స్నేహితుల బృందంగా ఏర్పడిన 149 మంది సాహసికులు గత ఆదివారం ఒకేసారి 98 అడుగుల ఎత్తున్న వంతెన పైనుంచి కిందికి దూకారు. బ్రెజిల్ కు చెందిన ఈ బృందం.. హోర్టోలాండియా అనే పట్టణంలోని వంతెన పైనుంచి ఈ ఫీట్ చేశారు. ఆ సాహసకృత్యం ఫొటోలేఇవి.