breaking news
Dandepalle
-
ఎలుగుబంటితో ఫైట్ చేశాడు
దండేపల్లి (ఆదిలాబాద్) : అడవికి వెళ్లి వస్తున్న గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. అదే సమయంలో గిరిజనుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించడంతో.. ఎలుగు పరారైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మల్లయ్య(41) వెదురు బద్దల కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన మల్లయ్య తన చేతిలో ఉన్న కత్తితో ఎలుగుపై తిరగబడటంతో.. అది తోకముడిచింది ఈ దాడిలో మల్లయ్యకు చేతికి, వీపుకు గాయాలయ్యాయి. -
తెలంగాణ ప్రజలందరూ పుణ్యస్నానాలు చేయాలి : మంత్రి జోగు రామన్న
దండేపల్లి (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని గూడెం పుష్కరఘాట్ను మంత్రి జోగు రామన్న సోమవారం సందర్శించారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రజలందరూ గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించి పుణ్యం పొందాలని సూచించారు.