వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’
తాడేపల్లి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళన సమావేశం జరుగుతుంది. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.