-
ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా..
ఉత్తర డకోటా: ధూమపానం, మద్యపానం హానికరం అంటుంటారు. కానీ వీటిని మించిన అనర్థాలు సోషల్ మీడియా వల్ల పుట్టుకొస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ దీనికి బానిసలవుతూ ఎక్కువ కాలం ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ఉత్తర డకోటాకు చెందిన 29 ఏళ్ల కలేబ్ బర్క్జిక్.. తన మాజీ బాస్కు డిసెంబర్ 24న ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడు కావాలని చేశాడో, పనిలో పడి మర్చిపోయాడో తెలీదు కానీ ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయకుండా మిన్నకుండిపోయాడు. రెండు రోజులు గడిచినా ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం కలేబ్ సహించలేకపోయాడు. 'నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చెయ్, లేదంటే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను' అంటూ బెదిరింపులకు దిగాడు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!) దీంతో ఆ మాజీ బాస్ కోపంతో ఈ సారి మాత్రం కావాలనే కలేబ్ను ఫ్రెండ్ లిస్టులో చేర్చుకోలేదు. ఇది అస్సలు సహించలేకపోయిన కలేబ్ అతడి చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆవేశంగా ఆయన ఇంటికి వెళ్లి ధడేలుమని తలుపు తన్ని మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాదు, స్నాప్చాట్ వంటి ఇతర సోషల్ మీడియాల్లోనూ పలురకాలుగా వేధింపులకు గురి చేశాడు. దీంతో సహనం నశించిన బాస్ పోలీసులకు ఆశ్రయించాడు. వారు బర్క్జిక్ను అదుపులోకి తీసుకోగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 27న ఈ కేసు విచారణకు రానుంది. (చదవండి: ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..) -
భారత వాయుసేనలోకి ‘డకోటా’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన(ఐఏఎఫ్)లోకి పురాతన డగ్లస్ డీసీ 3 విమానం వచ్చి చేరనుంది. పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన ఈ విమానాన్ని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖరన్ ఐఏఎఫ్కు బహుమతిగా ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధాల్లో దీన్ని వినియోగించారు. ఈ సమయంలో డకోటా అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానానికి చంద్రశేఖరన్ తండ్రి పైలట్గా వ్యవహరించారు. డకోటాతో ఉన్న అనుబంధానికి గుర్తుగా బ్రిటన్ నుంచి చంద్రశేఖరన్ దాన్ని కొనుగోలు చేశారు. ఆరేళ్లుగా లండన్లో మరమ్మతులు చేయిస్తున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే డకోటాను ఐఏఎఫ్కు బహుమతిగా ఇచ్చేందుకు చంద్రశేఖరన్ ప్రతిపాదన చేశారు. అయితే, చంద్రశేఖరన్ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. బీజేపీ హయాంలో చంద్రశేఖరన్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం ఐఏఎఫ్లో డకోటా చేరేందుకు అన్ని రకాల క్లియరెన్సులను పూర్తి చేస్తున్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. మరికొద్ది నెలల్లో యూకే నుంచి విమానం భారత్కు వస్తుందని చెప్పారు. -
మళ్లీ వాయుసేనలోకి డకోటా
న్యూఢిల్లీ: 1947 భారత్–పాకిస్తాన్ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన డకోటా యుద్ధ విమానం మార్చిలో తిరిగి వాయుసేనలో చేరనుంది. పూర్తిగా పాతబడిపోయిన ఈ విమానాన్ని బెంగళూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కొని బ్రిటన్లో ఆరేళ్లు మరమ్మతులు చేయించి వాయుసేకు బహుమతిగా అందిస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మంగళవారం ఢిల్లీలో ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాకు అందించారు. ఉత్తరప్రదేశ్లోని హిండన్ వైమానిక స్థావరంలో దీనిని ఉంచనున్నారు. డకోటాగా పిలిచే డగ్లస్ డీసీ3 విమానాలను 1930ల్లో వాయుసేనలో ప్రవేశపెట్టారనీ, లడఖ్తోపాటు ఈశాన్య ప్రాంతంలో ఇవి ప్రధానంగా సేవలందించేవని ధనోవా గుర్తుచేశారు. డకోటా యుద్ధ విమానాల వల్లే జమ్మూ కశ్మీర్లోని పూంచ్ ఇంకా మనదగ్గర ఉందని మిలిటరీ చరిత్రకారుడు పుష్పీందర్ సింగ్ గతంలో అన్నారు. ఈ విమానానికి భారత్ ‘పరశురామ’ అని నామకరణం చేసింది. ప్రస్తుతం బ్రిటన్లో ఉన్న ఈ విమానం వచ్చే నెలలోనే భారత్కు చేరుకోనుంది. ఈ విమానాన్ని కొని మరమ్మతులు చేయించడంలో తనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని చంద్రశేఖర్ తెలిపారు. చంద్రశేఖర్ తండ్రి గతంలో డకోటా విమానాలకు పైలట్గా పనిచేయడం విశేషం. -
శిథిలావస్థలో ‘డకోటా’
భువనేశ్వర్: రాష్ట్ర చరిత్రలో బిజూ పట్నాయక్ ధీరునిగా స్థానం సాధించారు. ధీరత్వ కార్యశైలిలో అడుగడుగునా అనుక్షణం డకోటా విమానం తోడుగా ఉండడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదో స్మారక చిహ్నంగా వెలుగొందాల్సిన అద్భుత నమూనా. మౌలిక ఆదరణకు దూరమై కోల్కత్తా విమానాశ్రయంలో మరుగున పడి ఉంది. ఈ అపురూప డకోటా విమానాన్ని అపురూపంగా పదిలపరచుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీని వైపు దృష్టి సారించకపోవడం విచారకరం. భారత విమానాశ్రయాల విభాగం రాష్ట్రానికి మేల్కొలిపింది. దివంగత ముఖ్యమంత్రి ధీరత్వానికి ప్రతీకగా ప్రతిబింబించాల్సిన డకోటా విమానం ఆదరణపట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభ్యర్థించింది. ఈ అభ్యర్థనతో రాష్ట్ర ప్రభుత్వం చైతన్యవంతమైంది. రాష్ట్రానికి తక్షణమే తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అనుబంధ విభాగాలు, వర్గాలతో సంప్రదింపులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో బిజూ పట్నాయక్ డకోటా విమానం రాష్ట్రానికి తరలివస్తుంది. ఆశ్రయం ఎక్కడ? అపురూపమైన డకోటా విమానం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ప్రతీకగా రాష్ట్రానికి తరలివస్తుంది. రాష్ట్ర ప్రజలతో పాటు పర్యాటకులు, సందర్శకులు తిలకించేందుకు అనుకూలమైన ప్రాంతంలో దీనిని ప్రదర్శించడం అనివార్యంగా భావిస్తున్నారు. అటువంటి అనుకూల ప్రాంతంపట్ల తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో దీనిని పదిల పరిచే యోచనతో బిజూ జనతా దళ్ వర్గాలు యోచిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జన్మ స్థలం, సొంత భవనం కటక్ నగరంలో ఆనంద భవన్ మ్యూజియంగా వెలుగొందుతోంది. ఈ ప్రాంగణంలో డకోటా విమానాన్ని ప్రదర్శించాలనే యోచన పార్టీ శ్రేణుల్లో బలంగా కనిపిస్తోంది. అయితే అందుకు అవసరమైనంత స్థలం ఈ ప్రాంగణంలో అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. అంతర్జాతీయ పర్యాటకుల కోసం ప్రియతమ నాయకుని అద్భుత విహంగ విన్యాసాల్ని ప్రతిబింబించే డకోటా విమానం స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఉండాలనే ఆకాంక్ష పలువురి హృదయాల్లో ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ విమాన యాన పర్యాటకుల దృష్టిని ఆకట్టుకుంటుందని ఈ వర్గం అభిప్రాయం. నిర్వహణ శైలి కూడా ఉన్నతంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బిజూ పట్నాయక్కు చేదోడు వాదోడుగా ఉపయోగపడిన డకోటా విమానం భద్రపరిచేందుకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికార వర్గాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోల్కత్తా విమానాశ్రయంలో మరుగున పడిన బిజూ పట్నాయక్ డకోటా విమానంపట్ల శ్రద్ధ వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్రో తెలిపారు. ఈ లేఖపట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రవాణా చేసేందుకు అనుబంధ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు త్వరలోనే ప్రభుత్వ అధికారి కోల్కత్తా సందర్శించి డకోటా తరలింపు వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం బదులు లేఖ రాసినట్లు వివరించారు. పరిశోధకుల మాట పెడ చెవిన రాష్ట్ర కీర్తి చిహ్నంగా నిలవాల్సిన బిజూ పట్నాయక్ మిత్రుని లాంటి డకోటా విమానం మరుగున పడి ఉండడంపట్ల పరిశోధకుల వర్గం హృదయాల్ని కలిచి వేస్తోంది. బిజూ పట్నాయక్ చారిత్రాత్మక విజయాలకు ఈ విమానం సారథిగా నిలిచింది. అటువంటి అపురూప విమానం నేడు పొరుగు రాష్ట్రం విమానాశ్రయంలో శిథిలమవుతోంది. తక్షణమే సంరక్షించి రాష్ట్రంలో సురక్షిత ప్రాంతంలో పదిల పరచాలి. ప్రధానంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో దీనికి స్థానం కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు యుద్ధ పరిశోధకుడు అనిల్ ధీర్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ 5 ఏళ్ల నుంచి నిరవధికంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయన అభ్యర్థనలపట్ల ముఖ్యమంత్రి పెడచెవి ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఘనం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జీవిత చరిత్రలో డకోటా విమానం పాత్ర ఎంతో ఘనం. చరిత్రకారులు దీని పాత్రను అనన్యంగా పేర్కొంటున్నారు. శత్రు వర్గాలతో తలపడిన, వైరి వర్గాల స్థావరాల నుంచి స్వాతంత్ర సమర యోధుల్ని మాతృ భూమికి తరలించాల్సిన అపురూప సందర్భాల్లో డకోటా విమానమే బిజూ పట్నాయక్ వ్యూహాత్మక కార్యశైలికి సారథిగా నిలిచింది. ఇండోనేషియా స్వాతంత్ర సమరం, శ్రీనగర్ ఎదురు కాల్పులు, భారత సేనకు ఆహార సరఫరా వగైరా క్లిష్ట పరిస్థితుల్లో డకోటా సహాయంతో బిజూ పట్నాయక్ సాహస కృత్యాల్ని విజయవంతంగా నిర్వహించి జాతికి వన్నె తెచ్చిన చరిత్రని ఆవిష్కరించారు. ఈ ఘన చరిత్రకు డకోటా విమానమే వారధిగా చరిత్రకారులు పేర్కొంటారు. బిజూ బాబు సాహసానికి ఇదే ప్రేరణగా పేర్కొంటారు. బిజూ పట్నాయక్ వీర గాథ గుర్తు వస్తే డకోటా విమానం పాత్ర విస్మరించడం ఎవరి తరం కాదు. ఇది బిజూ పట్నాయక్ కళింగ ఎయిర్ లైన్స్లో ఒకటి. పాకిస్థాన్ శత్రువలయాన్ని ఛేదించి శ్రీనగర్లో బందీలుగా ఉన్న భారత సైన్యాన్ని విమానం గుండా దేశానికి తరలించిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డకోటా విమానం బిజూ పట్నాయక్కు సహకరించింది. సేనకు అవసరమైన ఔషధాలు, గుర్రాలు వగైరా రవాణా, ఇండోనేషియా ప్రధాన మంత్రిని డచ్ కబ్జా నుంచి విముక్తి కలిగించి ఆ దేశానికి అప్పగించడంలో డకోటా సేవలు అనన్యం. కోల్కత్తా నేతాజీ విమానాశ్రయం డంపింగ్ యార్డులో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ధైర్య సాహసాలు ఆయన సొత్తు ధైర్య సాహసాలతో సంక్లిష్ట పరిస్థితుల్ని అవలీలగా ఎదురీదిన ధీరునిగా దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మిగిలారు. బిజూ జీవితం పలు సాహస కృత్యాలకు ప్రతీకగా ప్రతిబింబిస్తుంది. పైలెట్గా ఆకాశ వీధుల్లో ఆయన సాధించిన ఘన విజయాలు అత్యద్భుతం. ఆయన సాహస కృత్యాలకు ప్రతీకగా ఇండోనేషియా భూమి పుత్రునిగా స్వీకరించింది. నేటికి ఆయన కుటుంబీకుల ఆత్మీయ, అనురాగాల్ని పంచుకుంటోంది. -
అబ్బో... అదుర్స్!
ఫిల్మీ దునియాలో అందాల భామలు కుర్రకారుకు యమ కిక్కెస్తున్నారు. లిప్లాక్లు... నగ్న ‘చిత్రాల’తో ఒకరికి ఒకరు పోటీపడి మరీ బిగ్ స్క్రీన్పై రొమాన్స పంట పండిస్తున్నారు. విషయానికి వస్తే... హాలీవుడ్ నట వారసురాలు డకోటా జాక్సన్ ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’లో అందాల విందు చేసింది. తాజాగా రిలీజ్ అయిన సినిమాలోని మ్యూజిక్ వీడియో ‘ఎర్న్డ్ ఇట్’లో ఈ సెక్సీ తార దాదాపు న్యూడ్గా నటించేసింది. మాంచి రొమాంటిక్ సీన్లతో ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన ఈ సినిమా... లేటెస్ట్ వీడియోతో మరింత క్రేజీ అయిపోయింది. ఈ మూవీకి దర్శకుడు శామ్ టేలర్. డాన్ జాన్సన్, మెలానీ గ్రిఫిత్ల ముద్దుల కుమార్తె డకోటా!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement