-
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లింది.. చివరికి ఏమైందంటే!
గాంధీనగర్: ఇటీవల గుజరాత్లోని దాహోద్లో టూవీలర్పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సును ఓవర్టేక్ చేస్తూ ప్రమాదం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే మరోసారి దాహోద్లో చోటుచేసుకుంది. ఈసారి ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దహోద్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి బైక్ ఒక మహిళ, చిన్నారితో కలిసి వెళ్తున్నాడు. రోడ్డుపై వర్షపు నీరు చేరి ఉండటంతో నీటిలో గుంత కారణంగా వారి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు కుడివైపుకు పడిపోయారు. అంతలోనే బైక్పై ఉన్న ముగ్గురు పక్కన వెళ్తున్న ట్రాక్టర్ కింద పడిపోయారు. అయితే ట్రాక్టర్ టైర్ ఫోర్స్కు మహిళ, శిశువు దూరంగా నెట్టివేయబడ్డారు. కానీ ఆ వ్యక్తి తలపై మాత్రం ట్రాక్టర్ వెనక టైర్ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. అది కూడా పక్కకు జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో అతడు మరణించి ఉంటాడని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #Gujarat: A man had a narrow escape in #Dahod when the wheel of a tractor trolley passed on his head. The man was wearing a helmet which is believed to have rescued him. This is the second incident of its kind in Dahod in as many days. pic.twitter.com/v3n39MSU1B — TOI Vadodara (@TOIVadodara) September 15, 2021 చదవండి: రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! -
చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. భయానక వీడియో వైరల్
గాంధీ నగర్: జీవితాన్ని కోల్పోడానికి రెప్పపాటు సమయం చాలు. కళ్లు మూసి తెరిచేలోపు ఎన్నో ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ప్రమాదం అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గోపి మనియార్ ఘంగర్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో టూవీలర్పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సును డీకొట్టడంతో అతను టూవీలర్నుంచి కింద పడిపోయాడు. ఈ క్రమంలో బస్సు కిందకు యువకుడు దూసుకెళ్లాడు. అయితే వెంటనే బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకొని బస్సు మధ్యలోకి వెళ్లాడు. బస్సు కింద పడిన వ్యక్తిని గమనించిన డ్రైవర్వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో సదరు యవకుడు ఏలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చి తన బైక్ను తీసుకొని వెళ్లిపోయాడు ఈ భయంకర ఘటన సోమవారం మధ్యాహ్నం దాహోద్ జిల్లాలోని జలోద్ రహదారిపై సంభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఇన్స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. చివరికి తాపీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు.. -
చిరుతను పట్టుకున్నాం
-
మొత్తానికి చిరుతను పట్టుకున్నాం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement