breaking news
crores money
-
లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!
చైనాలో 28 ఏళ్ల వ్యక్తి 680 మిలియన్ యువాన్స్ (రూ. 795 కోట్ల కంటే ఎక్కువ) లాటరీ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చైనా దేశంలో ఇదే అతి పెద్ద లాటరీ కావడం గమనార్హం. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించిందని చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ వెల్లడించింది. చైనాకు చెందిన ఓ చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్పై బెట్టింగ్ చేశాడు, దీంతో అతని ప్రతి టిక్కెట్కు 5.16 మిలియన్ యువాన్స్ బహుమతి లభించిందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే విజేత వివరాలను సంస్థ బయటపెట్టలేదు. లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఈ నెల 7న బహుమతి స్వీకరించారని, ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. ఇంత డబ్బు లాటరీ గెలిచాననే ఆనందంలో అతనికి నిద్ర పట్టలేదని, ఉద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. మొదట్లో తనని తానె నమ్మలేదని, ఇది నిజమా.. కాదా అని నమ్మడానికి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నట్లు తెలిపారు. చైనా నిబంధనల ప్రకారం గెలుచుకున్న బహుమతిలో ఐదోవంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: రెస్టారెంట్గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్ చైనాలో ఇప్పటి వరకు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ ఇదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2012లో బీజింగ్కు చెందిన ఒక వ్యక్తి 570 మిలియన్ యువాన్లు, గత ఏడాది తూర్పు జియాంగ్జి ప్రావిన్స్కు చెందిన వ్యక్తి 200 మిలియన్ యువాన్లను లాటరీలో గెలుచుకున్నారు. -
లక్కీ ఫెలో.. భార్య వద్దన్నా లాటరీ టికెట్ కొన్నాడు.. ఇలా జాక్పాట్..
ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భటిండా జిల్లాకు చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్ కొనడంతో రోషన్ భార్య తరచూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందడంతో రోషన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మొదట బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్కు డీలర్ నుంచి ఫోన్ కాల్ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై పన్నులన్నీ తీసాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: బైక్పై లవర్స్ హల్చల్.. వీడియో వైరల్ -
ఓట్లు.. నోట్లు.. కోట్లు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఖర్చు హద్దు మీరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు రూ.కోట్లలో డబ్బులు వెదజల్లారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఎన్నికలు కావడంతో పదవులపై మరింత క్రేజ్ పెరిగింది. ఉన్న పదవులను నిలుపుకోవడానికి సిట్టింగ్లు, ఎలాగైనా చట్టసభల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కొత్తవారు పోటాపోటీగా రూ.కోట్లు కుమ్మరించారు. మొత్తంగా లెక్కేస్తే జిల్లావ్యాప్తంగా అభ్యర్థుల ఖర్చు రూ.200 కోట్లు దాటిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో జగిత్యాల కోరుట్ల, నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 168 మంది, పార్లమెంట్ స్థానాలకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు 40 మంది దాకా ఉన్నారు. ఎంపీ స్థానాలకు మరో ఆరుగురు పోటీలో నిలిచారు. మిగిలిన వారిలో రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో ఐదుగురు స్వంతంత్ర అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఎనిమిది సెగ్మెంట్లలో ఒక్కో అభ్యర్థి రూ.2కోట్ల నుంచి రూ.10 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మానకొండూర్, చొప్పదండి, ధర్మపురి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఎనిమిది నియోజకవర్గాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.45 కోట్ల వరకు అభ్యర్థులు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెట్టడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థులు రూ.78 లక్షలు ఖర్చు మాత్రమే ఖర్చు చేయాలి. దీంతో దొడ్డిదారిన కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థులు కాగితాల్లో మాత్రం తమ ఖర్చులను రూ.లక్షల్లోనే చూపించడం గమనార్హం. ఎన్నికల బరిలో నిలిచిన బడా వ్యాపారవేత్తలు, కోటీశ్వరులు నామినేషన్ అఫిడవిట్లో కొండంత ఆస్తులను గోరంత చూపినట్టుగానే ఖర్చుల లెక్కలను తలకిందలు చేసి సమర్పించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. మంథనిదే అగ్రభాగం నువ్వా.. నేనా.. అన్నట్టు ప్రధాన పార్టీల అభ్యర్థుల ముఖాముఖి పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. ఎలాగైనా సరే ప్రత్యర్థిని చిత్తు చేసి పైచేయి సాధించాలనే కాంక్షతో అభ్యర్థులు రూ.కోట్లు కుమ్మరించేందుకు ఏమ్రాతం వెనుకాడలేదు. ఈ కోవలో మంథని నియోజకవర్గం ఎన్నికల అగ్రభాగాన నిలిచింది. తర్వాత స్థానంలో కరీంనగర్, కోరుట్ల, రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాలున్నాయి. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో బడా వ్యాపారవేత్తలే ఆయా పార్టీల తరపున బరిలోకి దిగడం కూడా ధన ప్రవాహానికి కారణమైంది. అసలు డబ్బులు పెట్టే ఒప్పందంపైనే వారికి టికెట్లు ఇచ్చారనే ప్రచారం కూడా ఆయా పార్టీల శ్రేణుల నోళ్లలో నానుతోంది. ఇందుకు తగినట్లే సదరు అభ్యర్థులు పోటీపడి డబ్బులు ఖర్చు చేసినట్టు సమాచారం. నగదు.. నగలు.. మందు.. చీరెసారెలు.. చాలా చోట్ల అభ్యర్థులు ఓటుకు నోటు విధానాన్నే అనుసరించారు. ఒకరు ఓటుకు రూ.500 ఇస్తే.. మరొకరు రూ.1000 వెయ్యి ఇచ్చి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. తప్పదనుకున్న చోట ఇంటికి రూ.5వేలు, రూ.10వేలు సైతం ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మంథని లాంటి ప్రాంతంలో బంగారు ఆభరణాలు కూడా ఓటర్లకు నేరుగా అందాయి. బంగారు రింగులు, చెవిపోగులు ఇచ్చి మహిళా ఓట్లకు గాలం వేశారు. పోలింగ్కు వారం రోజుల నుంచే డబ్బులు పంచడం మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సంఘాల ఓట్లను అభ్యర్థులు గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు అందించారు. కుల సంఘాలు, యువజన సంఘాలకు సైతం ప్యాకేజీలు ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వంట సామగ్రి కొనుగోలు చేసి ఇచ్చారు. దేవాలయాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు విరాళం ప్రకటించి సగం డబ్బులు పోలింగ్కు ముందే అందించారు. కొంతమంది అభ్యర్థులు డబ్బులు వెదజల్లి ద్వితీయ శ్రేణి నాయకులను కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో పార్టీ ఊపు రావాలంటే అక్కడి సర్పంచ్, వార్డు సభ్యులు, సింగిల్విండో చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కులసంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులను ముందుగానే మచ్చిక చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల దాకా సమర్పించుకున్నారు. ఇలా.. అసెంబ్లీ అభ్యర్థులంతా రూ.150 కోట్ల దాకా ఖర్చు చేయగా, పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చు రూ.50 కోట్లు మించిపోయింది. ప్రజాస్వామ్యం పరిహాసం ప్రలోభాలకు లొంగవద్దు.. ఓటును అమ్ముకోవద్దు.. అంటూ అధికారయంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినా ఉత్తదే అయ్యింది. ఈ ప్రచారం వల్ల పోలింగ్ శాతం పెరిగినా డబ్బు చేతులు మారకుండా ఆగలేదు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేసినా, స్పెషల్ స్వ్కాడ్లు తిరిగినా, కెమెరా కన్నేసినా, బ్యాంక్ లావాదేవీలపై నిఘా పెట్టినా ఫలితమివ్వలేదు. హైదరాబాద్ నుంచి జిల్లాకు వస్తున్న టీడీపీ ఫండ్ రూ.కోటి బొల్లారం వద్ద దొరకడం మినహాయించి, జిల్లాలో మాత్రం అలాంటి సంఘటనలు శూన్యం. ఓటరు అడుగుతున్నాడని అభ్యర్థి...అభ్యర్థి ఇస్తున్నాడని ఓటరు... ఎవరికి వారు తమను తాము సమర్థించుకోవడంతో ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషించింది.