-
క్రికెట్లో దొంగాట...!
కడప స్పోర్ట్స్: క్రికెట్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో తల్లిదండ్రుల బలహీనతలను క్రికెట్ అసోసియేషన్లు సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సెలెక్షన్స్కు హాజరుకాకపోయినా వైల్డ్కార్డు ఎంట్రీగా నేరుగా మ్యాచ్ల్లో దించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పారదర్శకంగా జట్లను ఎంపిక చేస్తున్నామని చెప్పుకుంటూ సెలెక్షన్ ట్రయల్స్కు పిలుస్తుంటారని, కానీ ఆయా కేటగిరీల్లో జిల్లా జట్లను ముందుగానే పేపర్పై రాసుకొని ఎంపిక చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా తాజాగా కృష్ణా జిల్లా అండర్ –14 బాలుర క్రికెట్ జట్టులో 16 మందిని ప్రధాన జట్టుకు, మరో 5గురిని స్టాండ్బైగా ఎంపిక చేసినట్లు ఈ నెల 4వ తేదీన అధికారికంగా ప్రకటించి జట్టు ఎంపికకు సెలెక్షన్స్ ట్రయల్స్ నిర్వహించి అందులో నుంచి ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రాబబుల్స్ను నాలుగు జట్లుగా విభజించి సెలెక్షన్ మ్యాచ్లు కూడా నిర్వహించి తుదిజట్టును ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–14 బాలుర అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో ఆడుతున్న కృష్ణా జిల్లా జట్టులో రెండు అక్షరాలు పేరుగల ఓ క్రీడాకారున్ని ఆడించడంపై విమర్శలు తలెత్తాయి. ఈ క్రీడాకారుడు సెలెక్షన్స్ ట్రయల్స్కు గానీ, మ్యాచ్లకు గాని హాజరుకాలేదు. కడపలో జరిగిన రెండు మ్యాచ్ల తర్వాత ఆ క్రీడాకారున్ని మూడో మ్యాచ్లో దించడంతో మిగిలిన జట్టు సభ్యులు, అలాగే వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. 11 మంది ఆడే ఆటకు స్టాండ్బైతో కలిపి 21 మందిని ఎంపిక చేసినప్పుడు వాళ్లందర్నీ కాదని, సెలెక్షన్స్ ట్రయల్స్లో పాల్గొనని వారిని తీసుకొచ్చి ఆడించడం చర్చనీయాంశమైంది. ఈ 21 మందిలో ఎవరికి వారు తమకు కూడా అవకాశం వస్తుందనే ఆశతో ఉంటారు. అలాంటిది వారి ఆశలపై ఆదిలోనే చిన్న వయసులోనే నీళ్లు చల్లడం దుర్మార్గమని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. సాక్షాత్తు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఉన్న రాజధాని జిల్లాల నుంచే ఇటువంటి ఎంపికలు జరుగుతున్నప్పుడు మిగిలిన జిల్లాల పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు. దీంతో పాటు ఓవర్ ఏజ్ క్రీడాకారులను సైతం తీసుకువచ్చి ఆడిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నైతికంగా ఏమేర కరెక్టో.. దేశీయ, అంతర్జాతీయస్థాయి మ్యాచ్లలో క్రీడాకారులు గాయాలపాలైనా.. లేదా కూర్పులో మార్పు అవసరమైనప్పుడు వారి స్థానంలో ఇతర క్రీడాకారులను రప్పించి ఆడటం మనందరికి తెలిసిందే. అయితే క్రికెట్కు పునాదిదశగా భావించే జోనల్స్థాయి అండర్–14 క్రికెట్ పోటీల్లో ఈస్థాయిలో ప్రత్యేకంగా అనుమతులు పొంది.. ఇక్కడికి రప్పించి ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అసోసియేషన్ వారు ఎంపిక చేసిన స్టాండ్బై నుంచి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఏసీఏ అనుమతి తీసుకుని ఆగమేఘాల మీద మ్యాచ్లో ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ ఆ క్రీడాకారుడు రాష్ట్రస్థాయిలో రాణించిన ట్రాక్ రికార్డు ఉంటే ఆ క్రీడాకారుడి ఎంపికలకు రాకపోయినప్పటికీ సదరు క్రీడాకారుడు పేరును జట్టుతో పాటు ప్రకటించడం ఆనవాయితీ. అయితే అండర్–14 స్థాయి నుంచే అటువంటి సంప్రదాయాలన్నింటీ పక్కనపెట్టి ఆడించడం ఏమేర సబబో ఏసీఏ పెద్దలే ఆలోచించాలి. జట్టు అవసరాల దృష్ట్యా కూర్పులో భాగంగా క్రీడాకారులను ఆడించే అధికారం జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శులకు ఉన్నాయన్న ధైర్యమే వీరిని ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా అసోసియేషన్నుంచి లేఖ వచ్చింది.. కృష్ణా జట్టు ఎంపికలు మా పరిధిలోవి కావు. కృష్ణా జిల్లా అసోసియేషన్ వారు రెండ్రోజుల క్రితం ఏసీఏ అనుమతితో క్రీడాకారున్ని జట్టులో చేర్చాలంటూ లేఖ రాశారు. దీంతో మ్యాచ్లకు మేము అనుమతించాం. ఈ విషయమై కృష్ణా జిల్లా కార్యదర్శితో మాట్లాడగా.. రెగ్యులర్ క్రీడాకారుడు కావడంతో ఏసీఏ అనుమతితో కడపలో జరిగే మ్యాచ్లకు పంపినట్లు తెలిపారు. అదే విధంగా ఓవర్ఏజ్ క్రీడాకారుల విషయంపై అన్ని జిల్లాల అసోసియేషన్లకు సమాచారం పంపించాం.– ఎం. వెంకటశివారెడ్డి, ఏసీఏఉపాధ్యక్షుడు, కడప -
లక్ష్మణ్ అకాడమీలో క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ ఉన్నా ఎదగడానికి అవకాశం లేని వర్ధమాన క్రికెటర్ల అభ్యున్నతి కోసం భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్వయంగా ముందుకొచ్చారు. తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఇందులో రాణించిన క్రీడాకారులకు ఉచిత శిక్షణను అందిస్తారు. తొలి విడతగా కరీంనగర్ జిల్లా 8 ఇన్క్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలామ్ స్టేడియంలో జనవరి 28న, నల్లగొండలోని డాన్బాస్కో అకాడమీలో 29వ తేదీన సెలక్షన్స్ జరుగుతాయి. 16 నుంచి 24 ఏళ్ల లోపు యువకులు ఈ ఎంపిక పోటీలకు అర్హులు. తొలి విడత సెలక్షన్స్లో రాణించిన క్రీడాకారులకు హైదరాబాద్లోని వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీలో రెండో విడత పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉచిత శిక్షణకు ఎంపికవుతారు. వీరికి ఏప్రిల్, మే నెలల్లో క్రికెట్లో మెళకువలు నేర్పిస్తారు. శిక్షణ కాలంలో ప్రదర్శన ఆధారంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) లీగ్ మ్యాచ్ల్లోనూ ఆడేందుకు వీరికి అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నల్లగొండ జిల్లా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం విజయ్ ప్రకాశ్ (7659945513), కరీంనగర్ జిల్లా అభ్యర్థులు కృష్ణారెడ్డి (9059818383)లను సంప్రదించాలి. -
రేపటి నుంచి క్రికెట్ సెలెక్షన్స్
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి ఇంటర్ స్కూల్ క్రికెట్ సెలెక్షన్స శుక్రవారం ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్డీఎస్జీఎఫ్) ఆధ్వర్యలో విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయ అకాడమీలో రెండు రోజుల పాటు ఈ పోటీలు జరగుతాయి. అండర్-14 బాలుర కేటగిరీలో జరిగే ఈ పోటీలకు ప్రతి స్కూల్ నుంచి ముగ్గురు అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లను పంపించాలని నిర్వాహకులు తెలిపారు. రెజ్లింగ్ సెలెక్షన్స్ కూడా క్రికెట్తో పాటు శనివారం రెజ్లింగ్ సెలెక్షన్స కూడా జరుగనున్నాయి. గన్ఫౌండ్రీలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్ వేదికగా అండర్-14 బాలురు, అండర్ -17 బాలబాలికల విభాగంలో పోటీలు జరుగుతా రుు. మరిన్ని వివరాల కోసం ఆర్గనైజింగ్ సెక్రటరీని (7075462287) సంప్రదించవచ్చు. -
నేడు, రేపు క్రికెట్ సెలె క్షన్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ ప్రీమియర్ లీగ్లో పాల్గొనే క్రికెట్ జట్ల సెలెక్షన్స్ నేడు, రేపు జరగనున్నాయి. కులీ కుతుబ్షా స్టేడియంలో అండర్-16 బాలబాలికల విభాగాల్లో ఈ ఎంపికల పోటీలు జరుగుతాయి. కేవలం హైదరాబాద్కు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ సెలె క్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ కోసం 9290452954 నెంబరులో సంప్రదించవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement