breaking news
cow stomach
-
ఆవు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్.. ఆపరేషన్ చేసి
సాక్షి, ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో పశువైద్యాధికారి గోవింద్ నాయక్ ఆవుకు ఆపరేషన్ చేసి దాని కడుపులోని 20కిలోల ప్లాస్టిక్ను తొలగించారు. మండలంలోని అడేగామకే గ్రామానికి చెందిన ఆశన్నకు చెందిన రైతు ఆవు కడుపు ఉబ్బింది. దీంతో ఆవును పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లగా పశువైద్యాధికారి పరిశీలించి ఆపు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆవుకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య -
మూగజీవి వేదన.. కడుపులో 15 కిలోల ప్లాస్టిక్
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి నివాసి తాళాసు కృష్ణకు చెందిన ఆవు కడుపులో 15కిలోల ప్లాస్టిక్ సంచులున్నట్లు వై ద్యులు గుర్తించారు. ఆవుకు పరీక్షలు నిర్వహించిన తిలారు పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్కుమార్ శుక్రవారం శస్త్రచికిత్స చేసి 15కిలోల ప్లాస్టిక్ సంచులు, దారాలు, ప్లాస్టిక్ తాళ్లను తొలగించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆవును రక్షించిన డాక్టర్ను పలువురు అభినందించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న వైద్యుడు దేశీయ పశుజాతులతో లాభాలు శ్రీకాకుళం రూరల్: దేశీయ పశు జాతులతో అ నేక లాభాలు ఉన్నాయని, వాటిని రైతులు అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి ముఖ్య కార్యనిర్వహణ అధికారి దామోదరనాయుడు పిలుపు నిచ్చారు. మండల పరిధి లోని తండేవలస గ్రామంలో శుక్రవారం జాతీ య కృత్రిమ గర్భోత్పత్తి పథకంలో భాగంగా పుట్టిన దేశీయ పశు దూడలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశీయ పశుసంపదలైన గర్, సాహివాల్, రెడ్సింధి, పుంగనూరు, ఒంగోలు మొదలైన జాతుల ఆవశ్యకతను, లాభాలను పాడి రైతులకు ఆయన వివరించారు. దేశీయ జాతులు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయని, పాల ఉత్పత్తి అధికంగా ఉంటుందని, రైతులు వీటిని పెంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా గల రైతు భరోసా కేంద్రాలను సందర్శించి సిబ్బందికి తగు సూచనలు అందించారు. కార్యక్రమంలో పశుసంవర్దక సంచాలకులు ఎం.కృష్ణ, ఉప సంచాలకులు జగన్నాథం, రాగోలు పశువైద్యాధికారి దిలీప్ తండేవలస సర్పంచ్ పొన్నాన కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆవు కడుపులోంచి 40 కిలోల ప్లాస్టిక్ కవర్లను వైద్యులు బయటకు తీశారు. స్థానిక ఎల్లమ్మ గుట్టకు చెందిన న్యాలం భాస్కర్ అనే రైతుకు చెందిన ఆవు కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఆహారం కూడా తీసుకోవటం లేదు. వెటర్నరీ డాక్టర్ రాజేష్ ను సంప్రదించగా పొట్టలో ప్లాసిక్ కవర్లను గుర్తించారు. దీంతో రైతు అంగీకరించటంతో బుధవారం ఆపరేషన్ చేసి దాదాపు 40 కిలోల ప్లాస్టిక్ కవర్లను బయటకు తీసి ఆ మూగజీవి ప్రాణాలు కాపాడారు.