breaking news
Concerned relatives
-
‘గురుకుల’ విద్యార్థినికి గర్భం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లోని గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం సృష్టించింది. అయితే.. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారుల విచారణలో తేలింది. వివరాలు.. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు ఇటీవల రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్లో పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్దారణ పరీక్షలు చేయించారు. వారికి మొదట పాజిటివ్ వచ్చింది. ధ్రువీకరణ కోసం మళ్లీ వారం తర్వాత రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే.. కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాగా, శనివారం ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది. మా కళాశాలను బద్నాం చేస్తారా? గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల పేరుప్రఖ్యాతులు భంగం కలిగేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు. -
ఆసుపత్రి ఎదుట ఆందోళన
కర్నూలు : కర్నూలు జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వివరాలు...సుబ్రహ్మణ్యం (45) అనే వ్యక్తి అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూమంగళవారం మృతి చెందాడు. దీంతో వైఎస్ఆర్ సపీ నేత కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో మృతుడి బంధువులు మంగళవారం ఉదయం ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. సేవల్లో నిర్లక్ష్యంపై కాటసాని రామిరెడ్డి వైద్యులను నిలదీశారు. -
ఆస్పత్రి ఎదుట ఆందోళన
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. మెహిదీపట్నం నాలానగర్లోని ఆలివ్ ఆస్పత్రిలో బాలూనాయక్(22) అనే యువకుడికి పది రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు. మంగళవారం రాత్రి అతనికి మళ్లీ గుండెనొప్పి రావటంతో ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి చనిపోయాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే అతడు చనిపోయాడంటూ బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంప్రవేశం చేశారు. లాఠీచార్జి చేసి, పలువురిని అరెస్టు చేశారు.