-
ఆన్లైన్ గ్రీవెన్స్
ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటు కార్యాలయాలకు వెళ్లే భారానికి చెక్ ఇప్పటికే 55 ప్రభుత్వ శాఖలకు ఐడీలు {పతీ ఫిర్యాదుకు నంబర్ ఏ స్థారుులో ఉందో తెలుసుకునే అవకాశం వరంగల్ రూరల్ : ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ సెల్(ప్రజావాణి)లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడమంటే పెద్ద ప్రహసనమేనని చెప్పాలి. అరుుతే, ప్రజలకు పాలనను దగ్గర చేయాలన్న భావనతో రాష్ట్రప్రభుత్వం తాజాగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఈ మేరకు ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రీవెన్ససెల్ను తీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్సకు రావడం ఇబ్బందే అరుునా తప్పని పరిస్థితుల్లో ప్రజలు వస్తున్నారని గుర్తిం చారు. వారికి వ్యయప్రయాసాలు తగ్గించాలన్న భావనతో డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజావాణిని రెండు వారాల క్రితం ప్రారంభించారు. అరుుతే, ఆ వారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్సకు ఏ మాత్రం రద్దీ తగ్గలేదు. కొంచెం ప్రచారమైతే జిల్లా కేంద్రానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందనే భావనకు వచ్చారు. మొత్తం తగ్గించేందుకు.. కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్ససెల్కు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడ్డాక మొదటివారం 75, రెండో వారం 170, మూడో వారం 75, నాలుగో వారం 120 ఫిర్యాదులు అందారుు. ఇలా కలెక్టరేట్కు వచ్చే వారి సంఖ్య తగ్గించేందుకు మం డల స్థారుులో రెండు వారాలుగా గ్రీవెన్స నిర్వహిస్తున్నారు.అరుుతే, జిల్లా, మండల కా ర్యాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గించేందు కు తాజాగా ‘ఆన్లైన్ గ్రీవెన్ససెల్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్ లేదా స్మార్ ఫోన్ ఉంటే చాలు ఇం ట్లో కూర్చునే శాఖల వారీగా మనం ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం 55 శాఖలకు ప్రత్యేక ఐడీలు కేటారుుంచారు. ఈ మేరకు ప్రజలు ఛిఞజట్చఝట.్టట.జీఛి.జీ సైట్లోకి వెళ్లి మన జిల్లా, ఫిర్యాదుకు సంబంధించి శాఖ తదితర వివరాలతో పాటు ఫిర్యాదు చేసే వివరాలు నింపి సబ్మిట్ చేస్తే ఆ ఫిర్యాదుకు ఓ ప్రత్యేక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ద్వారా ఫిర్యాదు ఏ స్థారుులో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, శాఖల వారీగా ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యా రుు. ఎన్నింటిని పరిష్కరించారు, పరిష్కరించకపోతే కారణాలేమిటన్నవివరాలనుకలెక్టర్తో పా టు శాఖల ఉన్నతాధికారులు తెలుసుకునే వెసలుబాటు ఉంది. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెరిగి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారనేది కలెక్టర్ భావన. ఈ మేరకు ఆన్లైన్లో గ్రీవెన్స పద్ధతిపై జిల్లాలో విసృ్తతంగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఎస్ఎంఎస్ అలర్ట్ ప్రజావాణిలో నేరుగా లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వారికి ఎస్ఎంఎస్ అందుతుంది. అలాగే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యాక మరో మెసేజ్, పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు చెబుతూ మెసేజ్లు అందుతారుు. అరుుతే, ఒక్కో మెసేజ్కు ఐదు పైసల ఖర్చవుతుండగా.. దీనిని భరించేందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంగీకరించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎస్ చార్జీలు ఎవరు చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఫిర్యాదుదారుల సెల్ నంబర్లకు మెసేజ్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశముంది. -
ప్రసవానికి వెళ్తే గెంటేశారు
ఇందూరు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల తీరును నిరసిస్తూ పచ్చి బాలింత కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. వివరాల్లోకి వెలితే... నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్కు చెందిన నిషాత్ పర్విన్ (సబియా) కు నెలల నిండడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలకు నొప్పులు రాగా తల్లిదండ్రులు, బంధువులు కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆస్పత్రిS మెట్లు ఎక్కుతుండగానే అక్కడి సిబ్బంది, నర్సులు డెలివరీ చేయబోము, వెళ్లిపోండని అక్కడి నుంచి పంపించి వేశారు. గర్భిణి తల్లి బిస్మిల్లా షేక్ సిబ్బందిని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వేరే గతిలేక ఇంటికి తీసుకెళ్లారు. గర్భిణి ఇంట్లోనే ఆడ బిడ్డను ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పసి బిడ్డ, బాలింతతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోఅధికారులు ఎవరూ లేనందున కలెక్టర్ సీసీ సూచన మేరకు డీఆర్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసి వెళ్లారు. ప్రవసం చేయకుండా తిప్పి పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
ట్రైబల్ వెల్ఫేర్లో పోస్టింగ్ వివాదం
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్లకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్లో వార్డెన్గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్లో చేర్చారు. కానీ శంకర్పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్తో పాటు మిగతా వార్డెన్లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఏటీడబ్ల్యూ నియామకం వివాదాస్పదం
ఇందూరు: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్లకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్లో వార్డెన్గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్లో చేర్చారు. కానీ శంకర్పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్తో పాటు మిగతా వార్డెన్లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
వీడియో ఆధారాలున్నా కేసు పెట్టరా?
పూతలపట్టు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించకపోవడం ఘోరం ఎస్సీ,ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ తిరుపతి : పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం ఘోరమని ఎంపీ మిథున్రెడ్డి విస్మయాన్ని వ్యక్తం చేశారు. వీడియో ఆధారాలున్నా పోలీసులు ఇప్పటివరకూ బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఎంపీ మిథున్రెడ్డి సాక్షితో మాట్లాడుతూ, పోలీసుల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా మారిందన్నారు. మండల సమావేశం సందర్భంగా ఎస్సీ ఎమ్మెల్యేకి అవమానం జరిగిన నేపథ్యంలో స్వయంగా శాసనసభ్యుడు ఫిర్యాదు చేసినా పోలీసులు సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం, కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో పోలీసులు స్పందించకపోతే హెచ్ఆర్సీకి, ఎస్సీఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడం ఖాయమని ఎంపీ హెచ్చరించారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అందరితో కలిసి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇదే విషయంపై జీడీ నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా స్పందించి పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. బాధ్యులపై కేసు నమోదు చేయని పక్షంలో పార్టీ తరపున ఆందోళనలు మొదలు పెడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సునీల్కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం, బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పోలీస్స్టేషన్ల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు యోచిస్తున్నారు. వచ్చే మంగళవారం కార్యక్రమాలకు రూపకల్పన జరిపి నిరసన కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించే అవకాశాలున్నాయి. ఎస్సీ ఎమ్మెల్యేపై పోలీసులు చిన్నచూపు చూడడాన్ని పార్టీ నేతలు సహించలేకపోతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement