-
చెప్పిన మైలేజీ రాలేదు.. కంపెనీకి షాకిచ్చిన కస్టమర్
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు. కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్కి అప్పీల్కు వెళ్లింది. అలా కేసు ఎన్సీడీఆర్సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది. మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
నష్టపరిహారం చెల్లించాలని రైతుల రాస్తారోకో
నర్సంపేట : నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాని కోరుతూ రైతులు పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాలకు చెందిన రైతులు లక్కి మిర్చి విత్తనాలు ప్యాకెట్కు రూ.450 చొప్పున కొనుగోలు చేశారు. ఎకరానికి 12 నుంచి 15 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు వేశారు. మొక్క ఎదిగే సమయంలో కాండానికి పూత వచ్చినా కాయలు లేవని, వారం క్రితం రాస్తారోకో చేయగా కంపెనీ ప్రతినిధులు వచ్చి శాస్త్రవేత్తలను తీసుకొచ్చి సర్వే చేయిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరూ రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో రెండుగంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎస్సైలు హరికృష్ణ, రాజువర్మ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెపినా వారు వినకపోవడంతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాస్తారోకో విరమించి నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు కంపెనీ ప్రతినిధులతో ఫొ¯ŒSలో మాట్లాడడంతో శాస్త్రవేత్తలతో సర్వే నిర్వహించి 80 శాతం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రైతులు అందుకు ఒప్పుకోకపోవడంతో రైతులు కొనుగోలు చేసిన ప్యాకెట్ రూ. 700 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. దానికి కూడా రైతులు అంగీకరించలేదు. రాస్తారోకోకు సీపీఐ ఎంఎల్ నాయకుడు మోడెం మల్లేషం, న్యూడెమెక్రసీ నాయకుడు తోటకూరి రాజు, సీపీఐ డివిజ¯ŒS కార్యదర్శి భూక్య సమ్మయ్య, నాయకులు కందికట్ల వీరేష్ మద్దతు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement