-
మొబైల్ చూడొద్దని మందలించారని...
సాక్షి బెంగళూరు: మొబైల్ చూడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు బాలిక మనస్తాపానికి గురై పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..బెంగళూరు ఈశాన్య విభాగం బాగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కణ్ణూరులోని అపార్ట్మెంట్లో రవికుమార్ ఓజా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన కుమార్తె నవ్య ఓజా (13) ఏడో తరగతి చదువుతోంది. నవ్య ఎక్కువగా మొబైల్ చూస్తుండడంతో చదువుపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు గురువారం రాత్రి పది గంటల సమయంలో మందలించారు. పది నిమిషాల అనంతరం బాలిక అపార్టుమెంట్పైకి వెళ్లి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!) -
ప్రియుడికిచ్చి పెళ్లి చేయకుండా దూరం చేశారని..
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని రెడ్డివారిపల్లి పంచాయతీ, ఎగువరెడ్డివారిపల్లిలోని ఎస్ఎల్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ(19) చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎగువరెడ్డివారిపల్లిలోని తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు. మోహన్కృష్ణ ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్స రం చదువుతోంది. చదవండి: భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం ఈ క్రమంలో నాగయ్యగారిపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారం రోజుల క్రితం బాలిక.. ప్రేమించిన యువకుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమజంటకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. తన ప్రియుడికిచ్చి పెళ్లిచేయకుండా దూరం చేశారనే మనస్తాపంతో యువతి గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వంశీధర్ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చనిపోతున్నాను నన్ను క్షమించండి
మధిర: ఫోన్ చేసి మాట్లాడుతూనే ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మధిర రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. భద్రాద్రి జిల్లా పాత కొత్తగూడేనికి చెందిన అన్నపూర్ణమ్మ, మాధవాచారి దంపతులకు అనిల్ (25), వినయ్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్కుమార్కు వివాహం కాగా, మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో కొంతకాలంగా మనస్తాపానికి గురైన అనిల్ మధిరలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పి శనివారం ఉదయం ఇంటినుంచి బయటకు వచ్చాడు. సాయంత్రం సమయంలో మధిరలోని వైరా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో కొంతసేపు తిరిగి సెల్ఫీ ఫొటోలు తీసుకున్నాడు. రాత్రి 10:30 గంటల సమయంలో రైల్వేట్రాక్పైకి వచ్చి అతడి బాబాయి లక్ష్మీనారాయణకు ఫోన్చేశాడు. మధిర రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్పై ఉన్నానని, ‘చనిపోతున్నాను నన్ను క్షమించండి’ అంటూ కాల్లో చెప్పాడు. అనిల్ మాట్లాడుతుండగానే పెద్ద శబ్ధం వినిపించిందని లక్ష్మీనారాయణ రోదిస్తూ వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం పాతకొత్తగూడెంలో అనిల్ అంత్యక్రియలు నిర్వహించారు. -
ఫోన్లో గేమ్ ఆడుకోనివ్వలేదని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గేమ్ ఆడుకునేందుకు మొబైల్ ఇవ్వలేదని 12 ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మియాపూర్లో చోటుచేసుకుంది. వివరాలు.. బాలవెంకట్ సత్య ప్రసాద్(12) అనే బాలుడు తల్లిదండ్రులతో కలిసి మియాపూర్లోని స్వప్న నిర్వాన్ అపార్టుమెంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ట్యాబ్లో గేమ్ ఆడుకునేందుకు తండ్రి నిరాకరించాడన్న మనస్థాపంతో అపార్టుమెంట్పై నుంచి దూకి మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక ఇటీవల కాలంలో చిన్నారులపై సెల్ఫోన్లు, గేమ్ల ప్రభావం ఎంతగా ఉందో మరోసారి ఈ తాజా ఘటనతో రుజువైంది. -
తెలుగు తమ్ముళ్ల దష్టీకానికి మరో వ్యక్తి బలి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement