breaking news
Coffee Machine
-
ఈ రైల్లోనే టీవీలు, వై-ఫై, కాఫీ మిషన్!
-
ఈ రైల్లోనే టీవీలు, వై-ఫై, కాఫీ మిషన్!
రైల్లో ముంబై నుంచి గోవా వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.. అంతసేపు రైల్లో కూర్చోవాలంటే బోర్ అనుకునేవాళ్ల కోసం సరికొత్త తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చేశాయి. వీటిలో ఎల్ఈడీ టీవీలు, వై-ఫై కనెక్షన్, సీసీటీవీ, కాఫీ మిషన్లు.. ఇలా బోలెడన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉన్న ఈ కొత్త తేజస్ రైళ్లను రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ప్రతి సీటుకు ముందు భాగంలో సమాచారాన్ని అందించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. వాటిలో ఏవైనా సినిమాల లాంటివి చూడాలన్నా చూడొచ్చు. దానికితోడు రైలు చాలా సురక్షితంగా ఉంటుంది. ఇందులో పొగను గుర్తించే అలారం, టీ/కాఫీ వెండింగ్ మిషన్ల లాంటి ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయని కంఏద్ర రైల్వే జనరల్ మేనేజర్ డీకే శర్మ చెప్పారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి బయల్దేరిన ఈ రైలును.. నేలమీద నడిచే విమానంతో ఆయన పోల్చారు. శతాబ్ది రైళ్లంటేనే సాధారణంగా అన్నిరకాల సదుపాయాలు ఉండి, అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లాయని అంటారు. వాటి టికెట్ ధరలు కూడా మామూలు సూపర్ఫాస్ట్ రైళ్ల కంటే ఎక్కువ. ఇప్పుడీ తేజస్ రైళ్ల టికెట్లు శతాబ్ది టికెట్ల కంటే కూడా 20 శాతం ఎక్కువగా ఉంటాయి. ముందుగా వీటిని కొంకణ్ ప్రాంతంలో నడిపిస్తున్నారు. వారంలో ఐదు రోజుల పాటు ముంబై నుంచి కర్మలి (గోవా)కు ఈ రైలు వెళ్తుంది. అదే వర్షాకాలంలో అయితే వారానికి మూడు రోజులే వెళ్తుంది. దారిలో దాదర్, థానె, పన్వేల్, రత్నగిరి, కుడల్ స్టేషన్లలో ఆగుతుంది. సీఎస్టీ స్టేషన్లో ఉదయం 5 గంటలకు బయల్దేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా గోవా చేరుకుంటుంది. అలాగే గోవాలో తిరిగి 2.30 గంటలకు బయల్దేరి, రాత్రి 9 గంటలకు ముంబై సీఎస్టీ స్టేషన్కు చేరుకుంటుంది. ఇందులో 56 సీట్ల సామర్థ్యంతో ఉండే ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ బోగీ ఒకటి, దాంతోపాటు 78 సీట్ల సామర్థ్యం ఉండే ఏసీ ఛైర్కార్ బోగీలు 12 ఉంటాయి. అంటే రైలు మొత్తం ఏసీ ఛైర్కార్ మాత్రమే అన్నమాట. ఇందులో ఆహారంతో కలిపి అయితే ఒకరేటు, కాకుండా అయితే మరో రేటు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్కార్ అయితే ఆహారంతో కలిపి రూ. 2680, ఆహారం కాకుండా రూ. 2525 చొప్పున టికెట్ ధరలున్నాయి. ఏసీ ఛైర్కార్ టికెట్లు రూ. 1280, 1155 చొప్పున ఉన్నాయి. -
షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్.. ఏంటది?
స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా ఫుల్ ఫేమస్ అయిన చెనీస్ దిగ్గజం షియోమి ఇప్పటికే మి స్మార్ట్ స్కేల్, మి స్మార్ట్ కెమెరా, మి స్కూలర్ వంటి పలు ప్రొడక్ట్ లను మార్కెట్లోకి పరిచయం చేసింది. ప్రస్తుతం మరో కొత్త ప్రొడక్ట్ తో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. షియోమి ఈ వారంలోనే ఓ కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందని, అది కాఫీ మిషిన్ అని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ మిషన్ ను యూజర్లు స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా ఆపరేట్ చేసుకునే విధంగా కంపెనీ రూపొందించిందని రిపోర్టులు చెబుతున్నాయి. మార్చి 7న దీన్ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. షియోమి తన ప్రొడక్ట్ రేంజ్ ను విస్తరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, పెన్స్ దగ్గర్నుంచి స్మార్ట్ కుకర్స్ వరకు షియోమి ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ బ్రాండులో అత్యంత ప్రాచుర్యం పొందిన షియోమి తర్వాతి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమి మి6. -
వాడి పారేసే ‘కాఫీ మెషీన్’!
వేడి వేడి పాలలో వేసి అప్పటికప్పుడు తేలికగా చాయ్ తయారు చేసుకునేందుకు టీ పొడి బ్యాగులు ఉన్నాయి. మరి కాఫీ పొడి బ్యాగులను ఎక్కడైనా చూశారా? అలాంటివి లేవు కదూ. అందుకే మరి.. ఉల్రిక్ రాస్మ్యూసెన్ అనే డానిష్ డిజైనర్ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ డిస్పోజబుల్ ‘కాఫీ మెషీన్’ను తయారు చేశారు. ‘గ్రోవర్స్ కప్’ అని పేరుపెట్టిన ఈ బ్యాగులో ఒక అరలో కాఫీ పొడి ఉంటుంది. దీన్లోకి నీళ్లు పోస్తే చాలు.. కాఫీ నీళ్లు ఫిల్టర్ అయి కింది అరలోకి చేరుతాయి. వాటిని పాలలో ఒంపుకుంటే సరి.. కాఫీ రెడీ! కాఫీ అంటే తెగ ఇష్టపడే ఉల్రిక్.. ఓసారి కాఫీ మెషీన్లో ఫిల్టర్లు పనిచేయకపోవడంతో బాగా ఆలోచించి ఈ గ్రోవర్స్ కప్ను డిజైన్ చేశాడు. సుమారు 300 మి.లీ. నీరు పట్టే ఈ బ్యాగు ద్వారా రెండు కప్పుల కాఫీ తయారు చేసుకోవచ్చు. ధరెంతో చెప్పలేదు కదూ.. జస్ట్ 102 రూపాయలు మాత్రమే!