-
బొగ్గు కుంభకోణం: బెంగాల్ న్యాయ మంత్రిపై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ/కోల్కతా: బొగ్గు కుంభకోణం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ నివాసాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పశ్చిమ బర్దమాన్ జిల్లా అసన్సోల్లోని మూడు ఇళ్లు, కోల్కతాలోని రెండు ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి. కోల్కతాలో ఘటక్ సన్నిహితుడికి చెందిన ఒక ఇంట్లో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్లో మరో ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. అసన్సోల్లో ఈస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్కు చెందిన గనిలో తవ్విన బొగ్గును కొందరు స్వాహా చేసినట్లు ఫిర్యాదు అందడంతో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తోంది. మంత్రి మొలోయ్ ఘటక్ను కోల్కతాలోని ఆయన అధికారిక నివాసంలో సీబీఐ బృందం ప్రశ్నించింది. బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో మంత్రిపేరు తెరపైకి వచ్చిందని, ఇందులో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు తమకు సాక్ష్యాధారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. మంత్రి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఘటక్ వద్ద పనిచేస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్ను కూడా ప్రశ్నించామన్నారు. అసన్సోల్లో ఘటక్ ఇంట్లో బీరువా తాళాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు దాన్ని బద్దలు కొట్టినట్లు తెలిసింది. మంత్రి ఇళ్లల్లో సీబీఐ సోదాల సందర్భంగా కేంద్ర పారామిలటరీ సిబ్బంది భారీగా మోహరించారు. బొగ్గు స్మగ్లింగ్ కేసులో ఘటక్ గతంలో ఒకసారి ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. -
నా ప్రమేయం లేదు.. అంతా ప్రధానే: దాసరి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో తన ప్రమేయమేదీ లేదని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు చెప్పారు. కేసు విచారణ నిమిత్తం సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పటికీ క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకునేవారని తెలిపారు. కోర్టులోనూ ఇదే విషయాన్ని చెప్పానన్నారు. కేటాయింపులపై నిర్ణయం తీసుకొనే 'స్క్రీనింగ్ కమిటీ' ని ప్రభావితం చేసేందుకే బొగ్గుశాఖ సహాయమంత్రి హోదాలో దాసరి జిందాల్ గ్రూపు సంస్థలకు అనుకూలంగా లేఖ రాశారని సీబీఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. 120-బి (నేరపూరిత కుట్ర), 420 (చీటింగ్), అవినీతి నిరోధక చట్టంలోని ఇతర సెక్షన్ల కింద దాసరి సహా కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, జ్ఞాన స్వరూప్ గార్గ్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, గిరీష్కుమార్ సునేజా, ఆర్.కె.సరాఫ్, కె.రామక్రిష్ణ ప్రసాద్లపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే జిందాల్ సంస్థలతో పాటు దాసరికి చెందిన సౌభాగ్య మీడియాపై కూడా చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement