breaking news
closing down
-
కిరాణా కొట్లకు ‘క్విక్’ దెబ్బ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కొనుగోళ్ల సంస్కృతి పెరుగుతోంది. ఏ వస్తువు కావాలన్నా ప్రజలు ఆన్లైన్ వైపే చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి దూసుకొచ్చి¯]∙క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు వినియోగదారులు కోరుకున్న వస్తువులను 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. ఈ ప్రభావం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఏఐసీపీడీఎఫ్) నివేదిక వెల్లడించింది.క్విక్ కామర్స్ వల్లే..క్విక్ కామర్స్ (శీఘ్ర వాణిజ్యం) ప్లాట్ఫామ్ల రాకతోనే కిరాణా షాపులు మూతపడుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు చిన్నపాటి పట్టణాల్లోనూ క్విక్ కామర్స్ ఊపందుకోవడంతో పచారీ దుకాణాలు మూతపడుతున్నాయి. కాలు బయటకు పెట్టకుండా ఇంటికే వేగంగా సరుకులు రావాలని కోరుకుంటున్న వినియోగదారులు బ్లింకిట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్ఫామ్ల ద్వారా ఆర్డర్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు.ఫలితంగా సంప్రదాయ కిరాణా షాపులు దెబ్బతింటున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 1.30 కోట్ల కిరాణా షాపులు ఉంటే.. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ వల్ల కేవలం ఏడాది కాలంలోనే కనీసం 2 లక్షల కిరాణా స్టోర్లు, చిన్నాచితక రిటైల్ ఔట్లెట్లు మూతపడ్డాయి. ముఖ్యంగా మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాల్లోని కిరాణా దుకాణాలపై క్విక్ కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఐసీపీడీఎఫ్ స్పష్టం చేసింది. నగరాల్లోనే 45 శాతంమూతపడిన దుకాణాల్లో 45 శాతం మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 30 శాతం, పట్టణాల్లో 25 శాతం కిరాణా షాపులు కనుమరుగయ్యాయి. క్విక్ కామర్స్ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా దుకాణాలు ఖాతాదారులను, లాభదాయకతను కోల్పోతున్నాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ స్పష్టం చేశారు. తగ్గింపు ధరల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొడుతున్నాయని తెలిపారు.40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులతో వస్తువులను విక్రయించడం ఏ కంపెనీకి వాస్తవికమైనది లేదా స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ సంస్థల చట్టవిరుద్ధ ధరలపై విచారణ జరిపించాలని పాటిల్ డిమాండ్ చేశారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఈ–కామర్స్, క్విక్ కామర్స్ భారీ తగ్గింపులపై ఏఐసీపీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలపై దర్యాప్తు చేయాలని కోరింది. క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపులను కాపాడుకోవడం కష్టమని స్పష్టం చేసింది.అద్దెలు చెల్లించడం కష్టంగా ఉందిమాల్స్, డీమార్ట్, స్మార్ట్ బజార్, బిగ్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లు రావడంతో చిన్నచిన్న కిరాణా షాపుల్లో విక్రయాలు తగ్గిపోయాయి. ఆన్లైన్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు సైతం డోర్ డెలివరీలు చేçస్తుండటంతో కిరాణా షాపులకు కొనుగోలుదారులు రావడం లేదు. వ్యాపారం లేక షాపుల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సరుకులు, షాపుల నిర్వహణ కోసం చేసిన అప్పులు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక వంటి కారణాలతో కిరాణా షాపులు మూతపడుతున్నాయి. – బొలిశెట్టి సత్యనాగ బాలరాజు, అధ్యక్షుడు, పెడన వర్తక సంఘం, కృష్ణా జిల్లాకిరాణా వ్యాపారాలకు గడ్డుకాలమేకిరాణా వ్యాపారులకు గడ్డుకాలం వచ్చింది. ఒకవైపు ఆన్లైన్ మార్కెట్, మరోవైపు చిన్న పట్టణాల్లో మెగా మార్ట్ల రాకతో దశాబ్దాల కాలంగా స్థానికంగా చేస్తున్న కిరాణా వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్, మాల్స్ పోటీని తట్టుకుని నిలబడలేక నష్టాల బాట పట్టాం. అద్దె షాపుల్లో సిబ్బందితో నడిపే కిరాణా వ్యాపారాలు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాస్తవానికి కిరాణా షాపుల్లో సరుకుల నాణ్యత చూసి కొనుక్కునే అవకాశంతోపాటు అరువు తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. – అద్దంకి వెంకట శివప్రసాదరావు, కార్యదర్శి, భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, పశ్చిమగోదావరి -
తెరుచుకోనున్న కంటోన్మెంట్ దారులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూసేసిన అన్ని కంటోన్మెంట్ దారులను వెంటనే తెరవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. కంటోన్మెంట్లు, అక్కడి దారుల మూసివేతపై నిర్వహించిన ఈ భేటీకి 62 కంటోన్మెంట్ల ఉపాధ్యక్షులు, ఆ ప్రాంత ఎంపీలు హాజరయ్యారు. ఇకపై ఒక్కో కంటోన్మెంట్ దారి మూసివేతను సంబంధిత చట్టంలోని నిబంధనలను అనుసరించి సమీక్షించాలని నిర్ణయించారు. స్థానికులు, సైనికుల ఫిర్యాదులు, అవసరాలను ఉమ్మడిగా పరిష్కరించేందుకు ప్రామాణిక విధానాన్ని అమల్లోకి తేవాలని కూడా నిర్ణయించారు. -
బ్యాంకుల మూసివేతపై క్లారిటీ
న్యూడిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలో మూత పడనున్నాయన్న కథనాలు ఆందోళన నేపథ్యంలో ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ స్పందించాయి. గతరెండు వారాలుగా సోషల్మీడియా ప్లాట్ఫాంలలో చక్కర్లు కొడుతున్న వదంతులపై వివరణ ఇచ్చాయి. ఈ మెసేజ్లన్నీ నిరాధారమైనవనీ, సత్యదూరాలని కొట్టి పారేశాయి. ఖాతాదారుల డిపాజిట్ సొమ్ము సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చాయి. ఈ పుకార్ల పట్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతగా ఉండాలని సూచించారు. తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకుల మూత వేత అనే అంశం హాస్యాస్పదంగా ఉందని, ఇది నిరాధారమైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరోవైపు ఈ వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఖాతాదారులను కోరారు. సోషల్ మీడియా సందేశాల్లో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ బ్యాంకులు..భారీగా పేరుకుపోయిన బ్యాడ్ లోన్లు, తక్కువ మూలధన బఫర్ కు సంబంధించి బలహీనంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రాంమ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఈఏ) పరిధిలో ఈ బ్యాంకుల పనితీరును సకాలంలో మెరుగుపరుస్తామని ముంద్రా పేర్కొన్నారు. కాగా ముఖ్యంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ల విలీనం తరువాత బ్యాంకుల కన్సాలిడేషన్ వైపు కేంద్రం యోచిస్తోందన్నవాదనలు వినిపించాయి. తద్వారా మొత్తం 3-4 అంతర్జాతీయ బ్యాంక్లను రూపొందించనుందనీ, అందుకే ప్రస్తుతం ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు తగ్గించే ప్రతిపాదనలు సిద్దం చేస్తోందని కథనాలు వినిపించాయి. అలాగే గత కొన్ని వారాలుగా వాట్సాప్ గ్రూపులలో తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులు (కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మూత పడనున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్న సందేశాలు విపరీతంగా షేర్ అవుతున్న సంగతి తెలిసిందే.