breaking news
Clicks
-
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్ట్!
న్యూఢిల్లీ: తోటి ప్రయాణీకురాలిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. విమాన ప్రయాణంలో మహిళను అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళను కెమెరాలో అసభ్యంగా చిత్రీకరించి వివాదంలో ఇరుక్కున్నాడు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరవ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళను అసభ్యంగా ఫొటోలు తీసిన గౌరవ్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మదాబాద్ నుంచి విమానం ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిందితుడు గౌరవ్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడిపై ఐపీసీ సెక్షన్ 354C కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డీసీపీ డికె. గుప్తా తెలిపారు. బాధిత మహిళ స్వస్థలం అహ్మదాబాద్ కాగా, నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ వాసిగా తెలుస్తోంది. గత రెండు మూడురోజుల్లోనే విమాన ప్రయాణంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఇది రెండోసారి. రెండ్రోజుల క్రితం కోల్ కత్తా నుంచి ముంబై వెడుతున్న ఇండిగో 6E 326 విమానంలో బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి... ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతడ్ని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన 38 ఏళ్ళ అషిమ్ భూమిక్ ను అరెస్టు చేసినట్లు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డీసీపీ వీరేంద్ర మిశ్రా తెలిపారు.