breaking news
clean ap
-
ఏపీ పరిశుభ్రతపై దృష్టిసారించిన వైఎస్ జగన్ సర్కార్
-
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
-
AP: పరిశుభ్రతకు పెద్దపీట
పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మించడమే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. విలేజ్ క్లినిక్స్ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. గ్రామంలో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలి. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని చెప్పారు. ఇందుకు కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రేడ్ 2, గ్రేడ్ 3 నగర పంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ ఆయా ఊళ్లకు త్వరగా చేరవేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు (ఎస్డబ్ల్యూపీసీ), అర్బన్లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ (ఐఎస్డబ్ల్యూఎం) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, జూన్ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు చెత్త సేకరణకు 30 లక్షల డస్ట్బిన్స్ సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ అందించాలని సీఎం ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. దుర్వాసన రాకుండా చర్యలు ► నగరాలు, పట్టణాల్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి సమీపంలోని ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడమే కాకుండా ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. ► గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్– డబ్ల్యూటీఈ) సిద్ధమైన నేపథ్యంలో.. మరో రెండు ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మురుగు నీటి నిర్వహణపై దృష్టి ► మురుగు నీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలి. ఎక్కడా కూడా మురుగు నీరు నిల్వ లేకుండా చేయాలి. దీన్నొక సవాల్గా తీసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ► మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలి. క్లాప్ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ రూంలో సమర్థులైన అధికారులను పెట్టాలి. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. -
బండెనక బండి కట్టి..
సాక్షి, అమరావతి: గ్రామాలు, పట్టణాల్లో మెరుగైన పారిశుధ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలు, ఇతర చెత్తను రోడ్లపై వేయక ముందే వాటిని గ్రామ పంచాయతీ, మున్సిపల్, నగరపాలక సిబ్బంది సేకరించేలా పారిశుధ్య కార్యక్రమాలకు ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో చెత్త సేకరణకు 4,097 వాహనాలను కొనుగోలు చేసింది. శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఆయన వేదిక వద్ద జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సీడీని ఆవిష్కరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ వాహనాలు ఒక్కొక్కటిగా సీఎం ఉన్న వేదిక వద్ద నుంచి ముందుకు సాగాయి. చెత్త సేకరణ మహిళతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెత్త సేకరణ సిబ్బందితో సీఎం మాటా మంతి పంచాయతీ, మున్సిపల్, నగర పాలక సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రభుత్వం వర్మీ కంపోస్టు తయారీ, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనుంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ వాహనాలు, డస్ట్బిన్లు, చెత్తను ప్రాసెసింగ్ చేసే యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో చెత్త సేకరణ విధుల్లో పాల్గొనే కొంత మంది సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమ నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగాలని వారి భుజం తట్టారు. కాగా, స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఆటో రిక్షాలు, దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు కూడా సరఫరా చేస్తారు. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ప్రారంభం కానున్న క్లీన్ ఏపీ ప్రోగ్రాం
-
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్.. 100 రోజుల ప్రచారం
పరిసరాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా 100 రోజుల ప్రచారం నిర్వహించాలి. చెత్త, మురికి నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. అవి పేరుకుపోతే కలిగే ఇబ్బందులు, వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త నుంచి విద్యుత్ తయారీపై దృష్టి సారించాలి. వీటి కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. విశాఖలో బీచ్ కారిడార్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలి. దీన్ని తొలి ప్రాధాన్యత పనిగా గుర్తించాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలి. మెట్రో, ట్రాం నిర్మాణ శైలిలో మంచి డిజైన్లు రూపొందించాలి. వీటి నిర్మాణం నగరానికి ఆభరణంలా.. అందం తీసుకొచ్చేలా ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణకు ప్రతి వార్డుకు రెండు చొప్పున 8 వేల ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ వాహనాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని స్పష్టం చేశారు. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్), జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యత ప్రాజెక్టులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వీధి చివర డస్ట్ బిన్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సేకరించిన తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని, వ్యర్థ జలాల శుద్ధి కోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు, చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. వంద రోజుల అవగాహన ► ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే విషయమై సమావేశంలో చర్చ జరిగింది. ఇందుకోసం 100 రోజుల పాటు ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ► పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దరి చేరవని, ఒక పద్దతి ప్రకారం చెత్తను తరలించేందుకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆయా నగరాలు, పట్టణాల్లో సేకరించిన చెత్తను క్లస్టర్ల వారీగా పోగు చేసి ప్రాసెసింగ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ► ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఇందులో భాగంగా స్వల్ప మొత్తంలో సేవా చార్జీలు వసూలు చేస్తే బావుంటుందనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. నగర పంచాయతీలు, గ్రేడ్–2, గ్రేడ్–3 మునిసిపాలిటీల్లో రోజుకు ఒక్క రూపాయి చొప్పున.. గ్రేడ్–1, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీల్లో రోజుకు రూ.2 రూపాయల చొప్పున, కార్పొరేషన్లలో రోజుకు రూ.3 చొప్పున ఒక్కో ఇంటి నుంచి వసూలు చేసే విషయం చర్చించారు. పేదలకైతే (బీపీఎల్) ఏ ప్రాంతంలో అయినా కేవలం రోజుకు ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్రక్కుల కొనుగోలుకు ఏప్రిల్ మొదటి వారంలో టెండర్లు ► ఇంటింటికీ వెళ్లి తడిచెత్త, పొడిచెత్త విడి విడిగా సేకరించాలి. సేకరించిన చెత్తను వంద శాతం ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యం. 8,000 ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తారు. ► రోజుకు 30 టన్నుల కన్నా ఎక్కువ తడిచెత్త ఉంటే బయోమెథనేషన్ (బయోగ్యాస్ తరహా) ప్రక్రియ అమలు చేస్తారు. రాష్ట్రంలో ఆరు అర్బన్ ప్రాంతాల్లో ఐదు బయోమెథనేషన్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. 68 అర్బన్ ప్రాంతాల్లో బయోమెథనేషన్, వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఇవికాక కొత్తగా మరో 10 బయోమెథనేషన్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ► 30 టన్నుల లోపు తడిచెత్త ఉంటే వర్మి కంపోస్టుగా మార్చే ప్రక్రియ. తడిచెత్త నుంచి వర్మి కంపోస్టు తయారీ చేసే యూనిట్లు 18 నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా మరో 50 యూనిట్ల నిర్మాణానికి ప్రతిపాదనల సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి వీటిని ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పొడిచెత్త నుంచి విద్యుత్ తయారీపై దృష్టి ► పొడిచెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న 74 పొడిచెత్త రికవరీ కేంద్రాలను ఉపయోగించుకుంటారు. ► గుంటూరు జిల్లాలో 9 మునిసిపాలిటీలు, వీటికి అనుకుని ఉన్న 22 ప్రాంతాల్లో పొడిచెత్తను సేకరించి, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ నిర్మాణం గుంటూరులో పురోగతిలో ఉంది. ► విశాఖపట్నంలో 4 మున్సిపాలిటీలు, వీటికి ఆనుకుని ఉన్న 8 ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల నుంచి పొడిచెత్త సేకరించి, విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఇక్కడ (విశాఖలో) నిర్మాణంలో ఉంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ తరహా ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ► పురపాలక శాఖ కొన్ని వ్యర్థాలను సిమెంటు పరిశ్రమలకు ముడి పదార్థంగా అందించనుంది. 34 మునిసిపాలిటీలలో వ్యర్థాలను సిమెంటు కంపెనీలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 20 మునిసిపాలిటీల నుంచి వ్యర్థాల సరఫరా ప్రక్రియ అనుసంధానం పూర్తయింది. ► లక్ష లోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జగనన్న కాలనీలు సహా 93 చోట్ల మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. జగనన్న కాలనీల్లో ప్రతి పనిలో నాణ్యత ► వైఎస్సార్ జగనన్న కాలనీ పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. మౌలిక సదుపాయాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సీఎం చెప్పారు. ప్రతి పనిలో కూడా నాణ్యత స్పష్టంగా కనిపించాలన్నారు. ► రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లు, తాగునీటి సరఫరా, కరెంటు, కాలనీలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.30,691 కోట్లు ఖర్చు అవుతుందని, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి మొత్తం రూ.33,406 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. విశాఖలో వేగంగా ప్రాధాన్యత ప్రాజెక్టు పనులు ► భోగాపురం ఎయిర్పోర్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్ ద్వారా విశాఖకు తరలించడం.. ఈ మూడు పనులను శరవేగంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ► వీటి తర్వాత మెట్రో ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని, విశాఖపట్నం నుంచి భీమిలి వరకు ఇప్పుడున్న బీచ్ రోడ్డు విస్తరణ.. భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ► రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. భూ సేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకు రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు. విశాఖకు గోదావరి జలాలు ► పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖ నగరానికి తరలింపునకు సంబంధించి పైపులైన్ ప్రాజెక్ట్ను కూడా ప్రాధాన్యతగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. ► రానున్న 30 ఏళ్ల కాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ట్రాం, మెట్రోల ఏర్పాటుకు రూ.20 వేల కోట్లు ► విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకు మెట్రో ప్రతిపాదనలకు సంబంధించి మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదించారు. దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్ ప్రతిపాదించారు. ► మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ కారిడార్ ఉండనుంది. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేయగా ట్రాం సర్వీసులకు మరో రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా. ► ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రుణాల మాఫీపై కేంద్రం సహకరించలేదు
విజయనగరం: రైతుల రుణాల మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు త్వరలోనే వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛఆంధ్రప్రదేశ్ పైలాన్ను చంద్రబాబు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... విజయనగరం జిల్లాకు పలు వరాలు కురిపించారు. చీపురుపల్లిలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, గరివిడిలో పశువైద్య కళాశాల, పార్వతీపురంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. భోగాపురం సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. (చీపురుపల్లి)