breaking news
Clarke
-
'మ్యాక్స్ వెల్ స్థానంపై భరోసా లేదు'
ధర్మశాల: ఇటీవల భారత్ తో జరిగిన మూడో టెస్టులో తమ దేశ ఆటగాడు మ్యాక్స్ వెల్ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ అతని స్థానంపై పూర్తి స్థాయి భరోసా లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. 'మ్యాక్స్ వెల్ ఒక స్సిన్ ఆల్ రౌండర్. అయినప్పటికీ ఆసీస్ జట్టుకు మ్యాక్స్ వెల్ రెగ్యులర్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కాదు. ప్రధానంగా ఫాస్ట్ పిచ్ లపై ఆడేటప్పుడు మ్యాక్స్ వెల్ ఎంపిక అనేది అవసరం కాకపోవచ్చు. దాంతో మ్యాక్స్ వెల్ ఎంపికపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొగ్గు చూపే అవకాశం చాలా తక్కువ.ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్ వెల్ ను ఎంపిక చేయడం అనుమానమే. ఒక స్పిన్ ఆల్ రౌండర్ కంటే కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కే స్మిత్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. దాంతో మ్యాక్స్ వెల్ స్థానంపై భరోసా లేదనే చెప్పాలి' అని క్లార్క్ పేర్కొన్నాడు. ఆసీస్ జట్టులో మ్యాక్స్ వెల్ కీలక ఆటగాడైనప్పటికీ, అతను ఆల్ రౌండర్ గా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. -
భారత్ను అభినందించండి: ఆసీస్ మాజీ కెప్టెన్
బెంగళూరు: రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై భారత్ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు కోహ్లి సేనపై ట్వీట్లతో ప్రశంసలు కురిపించారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అశ్విన్ను పొగడ్తలతో ముంచెత్తారు. అశ్విన్ జీనియస్ అని, ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోశించడం గొప్ప విషయం అన్నారు. భారత్ గొప్ప విజయం సాధించందని, జట్టుకు క్లార్క్ అభినందనలు తెలిపారు. భారత్లోని అతని అభిమానులందరిని ట్వీట్లతో భారత జట్టును అభినందించాలని సూచించారు. వాటే మ్యాచ్, వాటే సీరీస్ అని ట్వీట్టర్లో పేర్కొన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగాక్కర గ్రేట్ ఫైట్ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్ చేశారు. భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఛాంపియన్లని భారత జట్టును ప్రశంసిస్తూ ఒక ఫోటోను ట్వీట్ చేశారు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆసీస్పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా; రోజర్స్ ఔట్
-
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్, వార్నర్ అర్థ సెంచరీ
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ కోనసాగుతోంది. తొలుత బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 58 బంతుల్లో 10 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. వార్నర్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 33 బంతుల్లో 3 ఫోర్లుతో 14 పరుగులు చేసిన వాట్సన్ ఆరోన్ బౌలింగ్ లో దావన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాటపట్టాడు. -
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా; రోజర్స్ ఔట్
అడిలైడ్: 50 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలుత ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, రోజర్స్ శుభారంభం చేశారు. ఓపెనర్ డెవిడ్ వార్నర్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన రోజర్స్ 22 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 9 పరుగులు చేశాడు. భారత్ బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో ధావన్ క్యాచ్ పట్టడంతో ఔటైయ్యాడు. ప్రస్తుతం డెవిడ్ వార్నర్, వాట్సన్ క్రీజులో ఉన్నారు. -
తొలి టెస్ట్ సిరీస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ ఫిట్ అని తేలడంతో.. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించారు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ఆడుతున్నాడు. ఆస్ర్టేలియా ఓపెనర్లు రోజర్స్, వార్నర్ శుభారంభం చేశారు. -
కోహ్లి కెప్టెన్సీలోనే...
ఎట్టకేలకు విరాట్ కోహ్లి కల సాకారం కాబోతోంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్కు సారథ్యం వహించబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ఆడుతున్నాడు. నేటి నుంచి తొలి టెస్టు - దూకుడే ఆసీస్ మంత్రం - తమదీ అదే బాటన్న భారత్ - బరిలోకి దిగుతున్న క్లార్క్ అడిలైడ్: టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి రెండు వారాలైంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడినా, హ్యూస్ మరణం వల్ల ఏర్పడిన పరిస్థితుల విషయంలో చాలా అనిశ్చితి ఏర్పడింది. ఎట్టకేలకు అంతా ముగిసి భారత్ ఓ పెద్ద మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ధోని ఆడతాడా? లేదా? అనే విషయంలో ఏర్పడిన సందిగ్ధ్దతను భారత జట్టు తొలగించింది. ‘నేనే తొలి టెస్టులో జట్టుకు సారథ్యం వహిస్తున్నాను’ అని సోమవారం కోహ్లి ప్రకటించాడు. 2011-12లో చివరిసారిగా భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడి ఘోరంగా ఓడిపోయింది. ఆ సిరీస్లో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నారు. అయినా పరాభవం తప్పలేదు. ఈసారి జట్టు మొత్తం కొత్తగా, పూర్తిగా యువకులతో ఉంది. మరి వీళ్లు భారత్ రాతను మారుస్తారా? ఆస్ట్రేలియా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న సిరీస్ విజయం ఘనతను సాధిస్తారా? మంగళవారం నుంచి జరిగే తొలి టెస్టులో దీనికి చాలా వరకు సమాధానం తెలిసిపోతుంది. ఇద్దరిదీ అదే మాట హ్యూస్ మరణం తర్వాత భావోద్వేగాల నడుమ జరుగుతున్న మ్యాచ్ ఇది. అయితే ఆట విషయానికొస్తే అది ప్రభావం చూపదని ఇరు జట్లూ చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడు తగ్గించబోమని ఆస్ట్రేలియా అంటుంటే... తమది అదే దారని భారత్ చెబుతోంది. బౌన్సర్ల వర్షం కురిపిస్తానంటూ జాన్సన్ భారత బ్యాట్స్మెన్ను హెచ్చరిస్తే... మా దగ్గరా బౌన్సర్లు వేసే వాళ్లు ఉన్నారని కోహ్లి సమాధానం ఇచ్చాడు. ఇక కెప్టెన్గా ధోని వన్డేల్లో చాలా దూకుడుగా వ్యవహరించినా... టెస్టుల్లో ఆత్మరక్షణతో వ్యవహరిస్తాడని అతనిపై విమర్శలు ఉన్నాయి. కోహ్లి బాగా దూకుడుగా ఉంటాడని పేరు. కాబట్టి భవిష్యత్లో టెస్టు కెప్టెన్గా ధోని స్థానంలో కోహ్లిని ఎంపిక చేయాలా వద్దా అనే అంశాన్ని కూడా ఈ టెస్టు ద్వారా పరిశీలించవచ్చు. ధోని మినహా అంతా ఫిట్ భారత శిబిరంలో ధోని మినహా అందరూ ఫిట్నెస్తో ఉన్నారని కోహ్లి చెబుతున్నాడు. భువనేశ్వర్ కాలి నొప్పి తగ్గిందని, తను తొలి టెస్టు సెలక్షన్కు అందుబాటులో ఉంటాడని కెప్టెన్ తెలిపాడు. అయితే టీమ్ మేనేజ్మెంట్ బయటకు అలా చెబుతున్నా... భువనేశ్వర్ గాయం తగ్గలేదని, తను తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం కష్టమని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. కెప్టెన్ క్లార్క్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని, అతను బరిలోకి దిగుతుండటంతో తమ స్థైర్యం మరింత పెరుగుతుందని జాన్సన్ చెప్పాడు. ‘భారత్కు టెస్టు ఆడటం అనేది నా కల. ఈ రోజు టెస్టు జట్టుకు సారథ్యం వహించబోతున్నాను. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా గొప్ప విషయం. వన్డేల్లో సారథ్యం వహించిన అనుభవం ఇప్పుడు ఉపకరిస్తుంది. జట్టులోని ఆటగాళ్లందరి సంపూర్ణ సహకారం ఉంటుంది. నా నిర్ణయాలను గౌరవిస్తారు. కానీ కెప్టెన్సీ కంటే బాగా ఆడటం ముఖ్యం. మొత్తం 11 మంది ప్రణాళికలకు తగ్గట్టుగా ఆడితేనే గెలుస్తాం. నా కెరీర్లో ఎప్పుడూ దూకుడుగానే ఉన్నాను. టెస్టు కెప్టెన్గానూ అదే కొనసాగిస్తాను. మైదానంలో ప్రత్యర్థికి ఆటతోనైనా, నోటితోనైనా దీటుగా బదులివ్వాలి. అలా చేయడం వల్ల నేను ఆటపై మరింత దృష్టిపెట్టగలుగుతా. ఆస్ట్రేలియాలో గత పర్యటన ద్వారా ఇక్కడ ఎలా ఆడాలో తెలుసుకున్నా. బౌన్సర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేమీ లేదు. అది ఆటలో భాగం. ఇంగ్లండ్ సిరీస్లో ఏం జరిగింది, ఎలా ఆడాననేది ఇప్పుడు అనవసరం. ఈ సిరీస్లో బాగా ఆడటం ముఖ్యం. ఏం జరిగినా మరచిపోయి ముందుకు సాగడం ముఖ్యం. హ్యూస్ మరణం కలచివేసినా ఇక ఆటపై దృష్టి పెట్టడం ముఖ్యం.’ - కోహ్లి (భారత్ కెప్టెన్) ‘మేం ఎప్పటిలాగే దూకుడుగానే ఆడతాం. బౌన్సర్లు వేయడానికి వెనుకాడం. గత 18 నెలలుగా నేను బాగా బౌలింగ్ చేస్తున్నాను. హ్యూస్ను స్మరించుకుని మ్యాచ్ మొదలుపెట్టడం భావోద్వేగాలతో కూడిన విషయం. కానీ ఒకసారి మ్యాచ్ మొదలైతే ఆట మీదే పూర్తి దృష్టి. మానసికంగా కూడా మేం మ్యాచ్ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యాం. క్లార్క్ పూర్తిగా కోలుకుని బరిలోకి దిగుతుండటం మా స్థైర్యాన్ని పెంచుతుంది.’ -జాన్సన్ (ఆస్ట్రేలియా పేసర్) 32-భారత్కు టెస్టుల్లో సారథ్యం వహిస్తున్న 32వ క్రికెటర్ కోహ్లి పిచ్ ఆస్ట్రేలియాలోని చాలా పిచ్ల తరహాలోనే పేసర్లకు అనుకూలం. అయితే స్పోర్టింగ్ పిచ్ తయారు చేశామని క్యురేటర్ డామియన్ చెబుతున్నారు. ఆరంభంలో పేసర్లకు, మధ్యలో రెండు రోజులు బ్యాట్స్మెన్కు, చివరి రోజు స్పిన్నర్లకు సహకరిస్తుందని ఆయన తెలిపారు. 13వ ఆటగాడు హ్యూస్ సాధారణంగా మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించాక 12వ ఆటగాడిగా ఒక పేరును ప్రకటిస్తారు. తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా 13 మందిని ప్రకటించింది. 13వ ఆటగాడిగా ఇటీవల మరణించిన హ్యూస్ను గౌరవిస్తున్నారు. అతని టెస్టు క్యాప్ నంబర్ 408ని షర్ట్ల మీద ధరిస్తారు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభానికి ముందు హ్యూస్కు నివాళిగా ఒక వీడియో ప్రదర్శించనుంది. డీఆర్ఎస్ లేదు భారత్, ఆస్ట్రేలియా సిరీస్లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఉండటం లేదు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే అన్ని సిరీస్లకూ ఈ పద్ధతిని వాడతారు. కానీ మొదట్నించి బీసీసీఐ దీనిని విశ్వసించడం లేదు. సిరీస్లో ఇరు జట్లూ అంగీకరిస్తేనే డీఆర్ఎస్ను వాడాలనే నిబంధన ఉంది.