-
పైసలొచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులు
ఆదాయం లేదంటూ అకస్మాత్తుగా వందల రూట్లలో ఆర్టీసీ సర్వీసుల్ని రద్దు చేశారు. సామాన్యుల కష్టాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బస్సులురద్దు చేయడంతో గత వారం పది రోజులుగాప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నిరుపేద కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, చిరుద్యోగులు ఆర్టీసీ బస్సులు రాక..ఎక్కువ చార్జీలు చెల్లించి మెట్రో రైలు, క్యాబ్లు, ఆటోలు ఎక్కలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట దాదాపు 6 వేల ట్రిప్పులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాక్షి’ మంగళవారంపరిశీలన జరపగా...సామాన్య ప్రయాణికుల వెతలెన్నో వెలుగుచూశాయి. ఇప్పటికైనా అధికారులు పునరాలోచన చేసి ట్రిప్పుల సంఖ్య పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో/నెట్వర్క్: తెల్లవారుజామున 5 గంటలకు మేడిపల్లి నుంచి సికింద్రాబాద్కు వెళ్లే బస్సును రద్దు చేశారు. ఆ సమయంలో చెంగిచర్ల, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఇప్పుడు సిటీ బస్సు సదుపాయం లేదు. సికింద్రాబాద్ నుంచి నాంపల్లి మీదుగా మెహిదీపట్నం వరకు నడిచే (49ఎం) బస్సు కూడా రద్దయింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అడ్డగుట్ట, మహేంద్ర హిల్స్, గౌతమ్నగర్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకొనే (సికింద్రాబాద్– సికింద్రాబాద్ 38 ఈఎక్స్) బస్సును ఆదాయం రావడం లేదనే కారణంతో రద్దు చేశారు. దీంతో ఉదయాన్నే సికింద్రాబాద్కు చేరుకొనే కూలీలు, చిరువ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు. రాత్రి వేళల్లోనూ ఇప్పుడు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. సికింద్రాబాద్ నుంచి కోఠి మీదుగా శాలిబండకు వెళ్లే (8ఏ), సికింద్రాబాద్– బోయిన్పల్లి (26ఎన్), తదితర రూట్లలోనూ ట్రిప్పుల సంఖ్యను తగ్గించారు. చిలుకానగర్, హేమానగర్, ఉప్పల్, తార్నాక మీదుగా నాంపల్లికి వెళ్లే (136), హేమానగర్– కోఠికి రాకపోకలు సాగించే (3ఎన్) రూట్లోనూ ఉదయం, రాత్రి బస్సుల సంఖ్యను తగ్గించారు. కేవలం ఈ రూట్లలోనే కాదు నగరంలోని 1100కుపైగా రూట్లలో ట్రిప్పుల రద్దుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు డిపోల్లో 100 నుంచి 200కుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. మరిన్ని డిపోల్లో ట్రిప్పుల రద్దుపైన ప్రణాళికలను రూపొందిస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్లోని 29 డిపోల పరిధిలో సుమారు 6వేలకుపైగా ట్రిప్పులు రద్దు కానున్నట్లు అంచనా. అతితక్కువ మంది ఉన్న మార్గాల్లోనే బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఉదయం, రాత్రి వేళల్లో బస్సులు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్గంజ్ వరకుఉదయం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు రద్దీ ఉంటుంది. సికింద్రాబాద్– అఫ్జల్గంజ్ మధ్య బస్సులు ప్రయాణికుల రద్దీకిఅనుగుణంగా ఉన్నాయి. కానీ సికింద్రాబాద్ నుంచి రీసాలాబజార్కు, అఫ్జల్గంజ్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నడిచే బస్సులను తగ్గించారు. పలు డిపోల్లో ట్రిప్పుల రద్దు ఇలా.. ♦ కుషాయిగూడ డిపోలో 240 ట్రిప్పులు రద్దు చేశారు. కుషాయిగూడ నుంచి అఫ్జల్గంజ్ (3కే) ఏకంగా రూట్లో 16 ట్రిప్పులు రద్దయ్యాయి. దీంతో ఈ రూట్లో దీంతో కుషాయిగూడ, ఈసీఐఎల్, హబ్సిగూడ మీదుగా కోఠికి వెళ్లే ప్రయాణికులు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ మీదుగా సికింద్రాబాద్కు వచ్చి అక్కడి నుంచి కోఠికి వెళ్లాల్సివస్తోంది. లేదా సెవెన్ సీటర్ ఆటోలు, షేరింగ్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ♦ 16సీ రూట్లో రెండు ట్రిప్పులు, 16ఏ రూట్లో మరో 2 ట్రిప్పులను రద్దు చేశారు. 16ఏకే రూట్లో 3 ట్రిప్పులు రద్దయ్యాయి. ♦ 24ఎస్ రూట్లో 4 బస్సులను రెండింటికి తగ్గించారు. ♦ 17ఎస్ రూట్లో తిరిగే 10 బస్సులలో 5 తగ్గాయి. 117 రూట్లో 2 బస్సులను కుదించారు. ♦ కుషాయిగూడ నుంచి అఫ్జల్గంజ్కు ఉదయం 4:30 గంటలకు వెళ్లే బస్సు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ♦ ఉప్పల్ డిపోలో మొత్తం 150 బస్సులు ఉన్నాయి. 1,553 ట్రిప్పులు నడుస్తాయి. ఇందులో 168 ట్రిప్పులు రద్దు చేశారు. ♦ ఉప్పల్– కోఠి (115 రూట్), ఉప్పల్– మెహిదీపట్నం (113 ఎం), ఉప్పల్– కూకట్పల్లి, ఉప్పల్–వేవ్రాక్, ఉప్పల్–కొండాపూర్ తదితర రూట్లలో ట్రిప్పులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ వెంకారెడ్డి తెలిపారు. ♦ హయత్నగర్– 1, 2 డిపోలలో 30 ట్రిప్పులు రద్దు చేశారు. త్వరలో మరిన్ని ట్రిప్పులను రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ♦ కంటోన్మెంట్ డిపోలో మొత్తం 137 బస్సులు ఉండగా, సుమారు 30 బస్సుల వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ♦ కాచిగూడ డిపో పరిధిలో 27 సర్వీసులను రద్దు చేశారు. అందులో ఉదయం 3:30 గంటలకు బయలుదేరే బస్సులన్నింటినీ గంట ఆలస్యంగా ఉదయం 4:30 గంటలకు నడుపుతున్నారు. ప్రతి రోజు కనీసం 50 ట్రిప్పులు రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఎం శ్రీనివాస్తెలిపారు. ♦ బర్కత్పురా డిపో పరిధిలో ప్రస్తుతం 7 బస్సు సర్వీసులను నిలిపివేశారు. ♦ కూకట్పల్లి డిపో పరిధిలో 12 బస్సులు, 18 సర్వీసులను రద్దు చేశారు. జగద్గిరిగుట్ట నుంచి 10కె, 19కె, 158 రూట్లలో కొన్ని సర్వీసులను తగ్గించినట్లు డిపో సిబ్బంది చెప్పారు. డిపోలకే పరిమితమైన 500 బస్సులు.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రస్తుతం 3,550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ట్రిప్పుల రద్దుతో ఇప్పటికే 500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దశలవారీగా మరిన్ని బస్సులను తగ్గించనున్నారు. లాభాలు లేని రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించి లాభాలు వచ్చే మార్గాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఆక్యుపెన్సీ సైతం 72 శాతం వరకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కి.మీపై రూ.16 చొప్పున రోజుకు సుమారు రూ.96 లక్షల నష్టాలను చవిచూస్తోంది. ఆదాయం లేని మార్గాల్లో, సమయాల్లో బస్సులు నడపడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఉదయం 4 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు పలు రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు. బస్సుల్ని తగ్గిస్తున్నారు.. డిపోలవారీగా బస్సులను తగ్గిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతి డిపోలో పది నుంచి 50 వరకు బస్సులను తగ్గిస్తున్నారు. కార్గోకు ఈ బస్సులను వాడే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఈ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. డ్యూటీలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుంది. – నగేష్ పటేల్, డ్రైవర్, కంటోన్మెంట్ -
సీటే బంగారమాయెనా...
హ్యూమర్ కాస్త డబ్బుంటే కష్టపడి ఎలాగోలా కిందా మీదా పడి ఏదో పార్టీలో ఓ ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు గానీ మన హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సులో సీటు సంపాదించుకోవడం మాత్రం అంతకన్నా కష్టం. అది బస్సెక్కి ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే తప్ప చెబితే అతిశయోక్తే అంటారు. రోజూ రెండు పూటలా సిటీ బస్సెక్కితే ’బతుకు జట్కా బండి కాదనీ, గుట్కా పొడి అనీ, కిలోమీటర్ చొప్పున మనల్ని తొలిచేస్తుందనీ’ తెల్సుకుంటాం. నా పేరు ముఖేష్, నేను ఒక్కసారే బస్సెక్కాను, మళ్లీ నగరంలో బస్సు ప్రయాణం చేస్తానని నమ్మకం లేదు అంటూ థియేటర్లో స్లైడులు వేసుకోవాల్సిందే. రామదాసు గనుక సిటీ బస్సు ఎక్కితే ’సీటే బంగార మాయెనా కోదండపాణి’ అని ప్రార్థించక మానడు. ఎక్కాల్సిన బస్సువైపు చూస్తే.. దాంట్లో ’దండయాత్ర ఇది దయా గాడి దండయాత్రా’ అంటూ చాలా మంది ఎన్టీఆర్ లు టెంపర్ మీదుంటారు. ‘ఈ బస్సు మనందరిదీ’ అనే స్లోగన్ బాగా నచ్చిన కాలేజీ కుర్రాళ్లు ఫుట్ బోర్డుపై గబ్బిలాల్లా వేలాడుతుంటారు. ’సెన్సిటివ్’ జీవులం గనుక ఆ ఫీట్లు చేయలేక.. జనాల్ని తోసుకుంటూ, జీవితంలో అసలు సిసలు సంఘర్షణ అంటే ఏంటో తెల్సుకుంటూ, బస్సు మధ్యలోకి చేరిపోతాం. అలా వెళ్లే క్రమంలో తోటివాళ్లు మన కాళ్లు ఇంట్లో చపాతీ పిండిలా మెత్తగా తొక్కే ప్రక్రియ పాక్షికంగా పూర్తవుతుంది. (మళ్లీ దిగేప్పుడు సంపూర్ణమవుతుందనుకోండి). ఆశతో ఒక సీటు పక్కన నిల్చుంటాం..అతను వచ్చే స్టాప్ లోనే లేచి వెళ్లిపోతాడని మన ప్రిడిక్షన్. అయితే ఎన్టీఆర్ గార్డెన్ బయట చిలక జ్యోతిష్కులు చెప్పేవాటిలాగే ఇదీ జరగదు. అతనిది బస్సుతో విడిపోనిబంధమైనట్లు చివరి స్జేజీ వరకు దిగడు. ఈలోపు మీ తల ’సాధ్యమైనంత’ తిప్పితే కనబడే సీట్లలో కొందరు బిలబిలమంటూ దిగిపోతుంటారు. కొందరు నిరాశావాదులకు ఆ ఉచితాసనం దక్కుతుంది. ఇక వాళ్ల దర్జా మాటల్లో చెప్పలేం. అదృష్టాన్ని టిఫిన్ లో పెట్టుకుని బస్సెక్కిన ఆ ’సీటు రాజాలు’ వెంటనే ెహ డ్ ఫోన్స్ తీసి, పాటలు వింటూ, లయబద్దంగా తలూపుతుంటారు. ఆ ఊపుడుకి ’నో వేకెన్సీ’ వాళ్లందరికీ కడుపు మండుతుంటుంది. మా ఆఫీసులో ‘సార్’లా ఓరీ దురహంకారీ అనాలనిపిస్తుంది. మన పక్కసీట్లో కూర్చున్న పుణ్యపురుషుడు మాత్రం ఇంచు కదలడే. ఇక వీడు దిగడు అని విసిగిపోయి మన ఆశను వెనుక సీటు పక్కకి మార్చుకున్నామనుకో, ఇంతసేపూ మనం ఆశలు పెట్టుకున్న వాడు ఆకాశవాణి పిలిచినట్లు సడెన్ గా దిగిపోతాడు. ఈ అవకాశంతో అప్పటిదాకా ఆ సీట్లో సర్దుకుని కూర్చున్న మరో ఇద్దరు కులాసాగా కూర్చోవడమో, మరో కొత్త అతిథి వాళ్ల గూటికి చేరడమో జరుగుతుంటుంది. ఈ ’కిరణజన్య సంయోగ క్రియ’ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న ఆశ- నిరాశ తెలుగు పాఠం లీలగా గుర్తుకొస్తుంది. మన రెండో ఆప్షన్ లేడీస్ రిజర్వేషన్ సీట్లపైకి వెళ్లినా.. అదృష్టదేవత మన వెంట ఉంటే తప్ప కూర్చోలేం. ఈ లోపు ఏ ఇంజినీరింగ్ సైన్స్ దేవ తనో వచ్చి ఇది లేడీస్ సీటుఅందనుకో.. సీటు వేటుతో పాటు అవమాన పోటూ తప్పదు. మనం వదిలేసిన మహిళా రిజర్వేషన్ సీట్లలో ఎవడో సభ్యత మరిచి ‘సిగ్గు’ లేకుండా కూర్చుంటాడు. ’మహిళలను గౌరవించడం మన విధి... వాళ్లకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం’ అన్న సుభాషితాలు తలపైనే రాసి ఉన్నా వాడికి పేనుకుట్టినట్లయినా ఉండదు. అలాంటి అసభ్యుడు కూర్చున్నప్పుడు మాత్రం ఏ దేవకన్యా ఆ సీటు వైపు కన్నెత్తి చూడదు. బహుశా ఆఫీసులో పొద్దంతా కూర్చున్నాం కదా కాసేపు నిల్చుందాం అని డిఫరెంట్ గా ఆలోచిస్తుందేమో. మన కా కనికరం దక్కదెందుకో. పోనీ, సిగ్గూ బిడియం విడిచిపెట్టి, స్వార్థం బుసలు కొట్టి .. ఆ సీట్లలో మనం కూర్చున్నామనుకో... ఏదో అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేస్తున్నామని లోపలి మనిషి అరుస్తూనే ఉంటాడు. లేవరా.. అంటూ పెదరాయుడులో రజినీకాంత్ లా గద్దిస్తుంటాడు. ఈ లోపలి సంఘర్షణ తో పాటు, ఎవరైనా లేడీస్ వస్తారేమో అని క్షణక్షణం భయం భయంగా హార్రర్ సినిమా చూస్తున్నట్లు కూర్చోవాల్సి వస్తుంది. ఇంత హెడ్ పెయిన్ తో కూర్చోడం కంటే... లెగ్ పెయిన్ తో నిల్చోవడం బెటరనిపిస్తుంది. అతి అరుదుగా ఎవరైనా బ్యూటిఫుల్ గర్ల్ కాస్త జరుగుతారా కూర్చుంటా.. అందనుకో, ఇక నువ్వు కూర్చునేది సీటుకి ఐదించుల పైనే గానీ సీట్లో కాదు. ఇదే కాదు.. బస్సు ఎక్కాలన్నా ఆశనిరాశే.. (మన ఫేట్ తిరగబడినట్లే) 9 నెంబరు కోసం కోసం చూస్తే 6 వెళ్లిపోతుంటుంది. మనవి కాని బస్సులు కదులుతూ, అమూల్యమైన సాయం సమయం కరుగుతూ, ఎన్నో ’హోప్స్’ పెట్టుకున్న ఇంటినుంచి ‘ఎక్కడ లక్కీ’ అంటూ ఫోన్ లో మెసేజ్ లు ఫ్లాష్ అవుతూంటే, ’కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం’ అంటూ మహాప్రస్థానంలో శ్రీ శ్రీ నా కోసమే పాట రాశాడా అనిపిస్తుంది. - రమేష్ గోపిశెట్టి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement